Karumuri Nageswararao: పవన్.. యువతకు రౌడీయిజం నేర్పిస్తున్నారా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Karumuri Nageswararao: జనసేన అధినేత పవన్ కళ్యాణ్పై ఏపీ పౌరసరఫరాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు తీవ్ర విమర్శలు చేశారు. ఏపీ పవన్ కళ్యాణ్ కాల్షీట్ ముగిసిందని.. అందుకే హైదరాబాద్ వెళ్లిపోయారని ఎద్దేవా చేశారు. విశాఖ గర్జనకు ప్రజల నుంచి విశేష స్పందన వచ్చిందని తెలిపారు. విశాఖ ఎయిర్పోర్టు ఘటనలో జనసేన కార్యకర్తలు దాడికి పాల్పడ్డారని.. మంత్రి రోజా వెంట్రుక వాసిలో దాడి నుంచి తప్పించుకున్నారని పేర్కొన్నారు. జనసైనికులకు పవన్ కళ్యాణ్ ఏం సందేశం ఇస్తున్నారని మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ప్రశ్నించారు. యువతకు మంచి మాటలు చెప్పాల్సింది పోయి దాడులు చేయమని రెచ్చగొడతారా అంటూ మండిపడ్డారు. యువతకు రౌడీయిజం నేర్పిస్తున్నారా అంటూ ఫైరయ్యారు.
ఇప్పటి వరకు నిర్వహించిన జనవాణి కార్యక్రమాలను ప్రభుత్వం సహకరించకుండానే పవన్ కళ్యాణ్ ఎలా నిర్వహించారా అని మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ప్రశ్నించారు. తాము ప్రజామద్దతుతో ఎన్నికయ్యామని.. తమను కొడితే రాష్ట్ర ప్రజలను కొట్టినట్లేనని అభిప్రాయపడ్డారు. ఇప్పటివరకు ఎంతమంది తాట తీశారో పవన్ చెప్పాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు డైరెక్షన్లో రాష్ట్ర ప్రజలపైనే దాడి చేసే స్థాయికి వెళ్లారని చురకలు అంటించారు. ఇప్పటివరకు ఉన్న ముసుగు తొలగిందని.. ప్యాకేజీ, దత్తపుత్రుడు అన్న మాటలను పవన్ నిజమే అని స్పష్టం చేశారని మంత్రి కారుమూరి పేర్కొన్నారు.
Also Read
- TDP vs YSRCP: టెంపుల్ సిటీలో టెన్షన్.. టెన్షన్.. టీడీపీ వర్సెస్ వైసీపీ
- Kakinada Accident: ఉపాధి కూలీలపైకి దూసుకెళ్లిన టిప్పర్.. అక్కడికక్కడే నలుగురు మహిళల మృతి
- AP Horror: మాఫియాలో చేరాలని ప్లాన్.. స్నేహితుడితో కలిసి తల్లిని హత్య చేసిన కొడుకు.. బంగారంతో పరారీ
- Off The Record : పొలిటికల్ డబుల్ యాక్షన్తో రోజా ఇరుకున పడ్డారా?
Read Also: Snake on Plane: విమానంలో పాము.. ఆందోళనకు గురైన ప్రయాణికులు..
అటు వైసీపీ నేతలను ఉద్దేశించి పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు చాలా అభ్యంతరకరంగా ఉన్నాయని మంత్రి విడదల రజినీ ఆరోపించారు. పవన్ మతిభ్రమించి ఏదేదో మాట్లాడుతున్నారని.. ఒకేసారి రెండు నియోజవర్గాల్లో ఓడిపోయినా ఆయనకు బుద్ధి రాలేదని ఎద్దేవా చేశారు. పవన్ను నమ్ముకుంటే కుక్కతోక పట్టుకుని గోదారిని ఈదినట్టే ఉంటుందని.. ఈ విషయం ఇప్పుడు జనసేన కార్యకర్తలకు కూడా అర్ధమైందని మంత్రి విడదల రజినీ తెలిపారు.
తాజావార్తలు
-
Gig Workers Strike: “పెరిగిన రేట్లకు తగ్గట్టు సర్వీస్ ఛార్జీలు పెంచండి”.. మళ్లీ సమ్మే బాట పట్టిన గిగ్ వర్కర్లు..
-
Messi-Ronaldo: మెస్సీ vs రొనాల్డో.. ఆఖరి వరల్డ్ కప్లో చరిత్ర సృష్టించనున్న ఫుట్బాల్ దిగ్గజాలు
-
Manchu Manoj: మంచు మనోజ్ టీమ్లో మిస్టరీ డెత్.. ‘డేవిడ్ రెడ్డి’ సెట్స్లో అసలేం జరిగింది?
-
Buchi Babu Sana: జాన్వీకి ‘పెద్ది’ ఛాన్స్ వెనుక ఇంత పెద్ద స్టోరీ ఉందా..!
-
Rishabh Pant: ‘మా గెలుపుకు కారణం.. నేను బ్యాటింగ్కు రాకపోవడానికి రీజన్ ఇదే’: రిషబ్ పంత్
ట్రెండింగ్
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..