Perni Nani: జగన్ దెబ్బకు సీఆర్డీఏలో ‘అవిగన్’ తీర్మానం.. కేబినెట్లో పెట్టనున్నారు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Perni Nani: అమరావతి రాజధానిపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి పేర్ని నాని సంచలన వ్యాఖ్యలు చేశారు.. వైఎస్ జగన్ దెబ్బకు సీఆర్డీఏలో ‘అవిగన్’గా తీర్మానం చేశారన్న ఆయన.. అమరావతి, విజయవాడ, గుంటూరు కలిసి రాజధానిగా తీర్మానం చేశారు.. త్వరలో కేబినెట్లో తీర్మానం పెట్టనున్నారంటూ హాట్ కామెంట్స్ చేశారు.. ఇక, డీఎస్సీ అంశంపై ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన వ్యక్తం చేస్తున్న వారిపై దాడులు జరిగాయని ఆయన ఆరోపించారు. విజయవాడలో నిరసనకారులపై దాడులు చేయడమే కాకుండా, దీక్షా శిబిరంపై కూడా దాడి జరిగిందని పేర్కొన్నారు. మహిళలపై దాడులు జరిగినా పోలీసులు స్పందించలేదని, మల్లాది విష్ణుపై దాడి జరిగిన తర్వాత కూడా బాధితుడినే పోలీసులు అదుపులోకి తీసుకెళ్లారని విమర్శించారు.
డీఎస్సీలో జరిగిన అవకతవకలపై పోరాటం చేయడం తప్పా అని ప్రశ్నించిన పేర్ని నాని, అధికార పార్టీ నేతల చర్యలు ప్రభుత్వ ప్రోత్సాహంతోనే జరుగుతున్నాయని ఆరోపించారు. ముద్రగడ పద్మనాభం విగ్రహాన్ని తయారు చేయించి ఎందుకు ఏర్పాటు చేయలేదని, వంగవీటి రంగా విగ్రహాన్ని ఎందుకు ప్రతిష్ఠించలేదని ప్రశ్నించారు. ఇక, అమరావతి పరిధిలో విజయవాడ, గుంటూరును కలుపుతూ కేబినెట్లో తీర్మానం తీసుకురావాలని ప్రభుత్వం ఆలోచిస్తోందని వ్యాఖ్యానించారు.. రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. దాడులు, బెదిరింపులతో ప్రతిపక్షం గొంతును అణచివేయలేరని, తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని అన్నారు మాజీ మంత్రి పేర్నినాని..
Also Read
- CM Chandrababu: వారణాసిలో చంద్రబాబు పర్యటన.. కాశీ విశ్వనాథుడికి ప్రత్యేక పూజలు.. రాజ్నాథ్, యోగితో కలిసి..
- YS Jagan: నేడు వైసీపీ జిల్లా అధ్యక్షులతో వైఎస్ జగన్ కీలక భేటీ.. ప్రధాన అజెండా ఇదే
- CM Chandrababu: ధరలకు కళ్లెం.. ద్రవ్యోల్బణం కట్టడికి సీఎం కీలక ఆదేశాలు
- Gadikota Srikanth Reddy: కొత్త పెన్షన్ల పేరుతో మళ్లీ మోసం.. గడికోట ఫైర్
కాగా, అమరావతి రాజధానిగా కాకుండా.. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు(మావిగన్) లను కలిపి రాజధాని కారిడార్గా అభివృద్ది చేయాలని వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిపాదించిన విషయం విదితమే.. దీనివల్ల లక్షల కోట్ల ప్రజాధనం వెచ్చించవలసిన అవసరం ఉండదని ఆయన పేర్కొన్నారు. వచ్చే ఎన్నికలలో మావిగన్ కు ఆమోదం తెలిపేవారు వైఎస్సార్సీపీకి, అమరావతికి అంగీకారం తెలియచేసేవారు కూటమికి ఓటు వేయవచ్చని, ఇది ఎన్నికల అంశంగా తీసుకుంటామని కూడా వైఎస్ జగన్ సవాల్ విసిరిన విషయం విదితమే..
తాజావార్తలు
-
Story Board : డీలిమిటేషన్ పై కేంద్రం వ్యూహమేంటి..? తెలుగు రాష్ట్రాల్లో ఏం జరుగుతుంది..?
-
CM Revanth Reddy :హైదరాబాద్లో హార్వర్డ్ కోర్సులు.. డిసెంబర్ నుంచే క్లాసులు
-
Telangana SIR : ఓటర్లకు ఈసీ గుడ్న్యూస్.. నోటీసులకు ఇక ఇలా స్పందించొచ్చు
-
Supreme Court: మహిళకు ఉద్యోగం నిరాకరించినందుకు పనిష్మెంట్.. రూ.12 లక్షలు పరిహారం చెల్లించాలని తీర్పు
-
OTR: వైసీపీ ప్లాన్ రివర్స్! రేపల్లెలో ఫ్యాన్కు బ్రేక్!
ట్రెండింగ్
-
Samsung Phones: పర్సుకి ఫోన్కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!