Minister Anitha: జగన్ బయటకు వస్తే విధ్వంసమే.. పరామర్శల పేరుతో అరాచకం.. మంత్రి అనిత ఘాటు వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister Anitha: మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు ఏపీ హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత… రెండేళ్ల కూటమి ప్రభుత్వ పాలనలో రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు వేగంగా అమలవుతున్నాయని, ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లో జరిగిన అభివృద్ధిని ప్రజలకు వివరిస్తున్నారని చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పెట్టుబడులు, పరిశ్రమల కోసం దేశ విదేశాల్లో పర్యటిస్తూ రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. దీనికి భిన్నంగా ప్రతిపక్షం మాత్రం ప్రజలకు ఉపయోగపడే అంశాలపై మాట్లాడకుండా పరామర్శ యాత్రల పేరుతో ఉద్రిక్త పరిస్థితులు సృష్టిస్తోందని మంత్రి ఆరోపించారు. జగన్ బయటకు వచ్చిన ప్రతిసారీ విధ్వంసం, అరాచకం జరుగుతోందని విమర్శించారు. మహిళలపై దాడులు, ప్రజలకు ఇబ్బందులు కలిగించే ఘటనలు చోటుచేసుకుంటున్నాయని అన్నారు. ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలపై బాధ్యతాయుతమైన ప్రశ్నలు అడిగితే సమాధానం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నప్పటికీ, బలప్రదర్శనలతో రాజకీయాలు చేయడం సరికాదని వ్యాఖ్యానించారు.
పోలీసులను బెదిరించేలా, ప్రజలను భయభ్రాంతులకు గురిచేసేలా ప్రతిపక్ష నేతల వ్యవహారం ఉందని మంత్రి అనిత ఆరోపించారు. కల్తీ మద్యం కేసులో నిందితులను పరామర్శించేందుకు వెళ్తున్నారని, అయితే బాధిత కుటుంబాలను పరామర్శించడంలో ఆసక్తి చూపడం లేదని విమర్శించారు. సిదిరి అప్పలరాజు కుమారుడు దానయ్య రోడ్డు ప్రమాదంలో మృతి చెందినా, ఆ కుటుంబాన్ని జగన్ పరామర్శించలేదని గుర్తు చేశారు. రాష్ట్రానికి అభివృద్ధి, సంక్షేమమే ముఖ్యమని, విధ్వంస రాజకీయాలను ప్రజలు తిరస్కరించాలని మంత్రి అనిత పిలుపునిచ్చారు. రాష్ట్ర భవిష్యత్తు కోసం శాంతి, అభివృద్ధి, పెట్టుబడులే అవసరమని, ప్రజలు వాస్తవాలను గమనించి సరైన నిర్ణయం తీసుకోవాలని ఆమె కోరారు.
Also Read
- Pawan Kalyan: 21 సీట్ల వ్యూహం అసెంబ్లీ ఎన్నికలకే.. స్థానిక ఎన్నికల్లో జనసేన కొత్త వ్యూహం
- Southern Zonal Council Meeting: దక్షిణాది ఐక్యతే దేశ బలం.. జోనల్ కౌన్సిల్లో చంద్రబాబు కీలక ప్రసంగం
- BC Reservation: బీసీలకు గుడ్న్యూస్.. స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్ కోటా పెంపు.. ప్రభుత్వం ఉత్తర్వులు
- AP Junior Doctors Strike: చర్చలు విఫలం.. స్టైఫండ్ పెంపుపై పట్టు.. జూడాల సమ్మె ఉధృతం..!
తాజావార్తలు
-
Deepika Padukone Spirit Exit: లాభాల్లో 10% వాటా డిమాండ్, లీక్స్.. ప్రణయ్ వంగ సంచలన వ్యాఖ్యలు!**
-
Mahesh – Sandeep Vanga: స్పిరిట్ తర్వాత మహేష్ బాబు-సందీప్ రెడ్డి వంగ కాంబో?
-
Spirit : స్పిరిట్ ఎన్ని వేల కోట్లు..?
-
Sandeep Vanga : Spirit సెట్ లో అందరికి కోటింగ్…ప్రణయ్ రెడ్డి సంచలన కామెంట్స్
-
Google Offers For Students: విద్యార్థులకు గూగుల్ బంపరాఫర్.. రూ.4,800 విలువైన ఏఐ సబ్స్క్రిప్షన్ ఫ్రీ.. ఎప్పటి వరకు అంటే..?
ట్రెండింగ్
-
Home Decoration Ideas : వరలక్ష్మీ వ్రతం 2026.. తక్కువ బడ్జెట్లో ఇంటికి పండుగ లుక్.!
-
50 గంటల బ్యాటరీ, 42ms లో లేటెన్సీతో రూ.1,899కే iQOO Buds లాంచ్.. గేమర్లకు బెస్ట్ TWS.!
-
రూ.1,999కే CMF Buds Neo.. 35dB ANC, 52 గంటల బ్యాటరీ లైఫ్తో అదిరిపోయే ఇయర్బడ్స్..!
-
144Hz AMOLED డిస్ప్లే, 7050mAh బ్యాటరీతో iQOO Z11 వచ్చేసిందోచ్.. ధర ఎంతంటే.?
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ రూమర్స్.. ముంబై ఇండియన్స్ పోస్ట్ వైరల్.. హింట్ ఇచ్చేసిందా?