Minister Kakani Govardhan Reddy: ప్రభుత్వంపై పథకం ప్రకారం దుష్ప్రచారం
ఏపీ ప్రభుత్వంపై పథకం ప్రకారం దుష్ప్రచారం జరుగుతోందని, దీనిని ప్రజలు నమ్మరని అన్నారు మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి. ఒక పథకం ప్రకారం అనుకూల మీడియా ద్వారా దుష్ప్రచారం చేస్తున్నారు. నిత్యం ప్రభుత్వం పై ఏదో ఒక ఆరోపణ చేస్తున్నారు. వాటికి వివరణ ఇస్తున్నా..ప్రభుత్వం పై బురద చల్లుతున్నారు. పంటల బీమా పై తప్పుడు కథనాలు రాస్తున్నారు.. పండించిన ప్రతి పంటకూ బీమా కల్పిస్తున్నాం. ప్రతి రైతుకూ బీమా కల్పించాలనే లక్ష్యంతో వంద శాతం ప్రీమియం ప్రభుత్వం చెల్లిస్తోందన్నారు మంత్రి కాకాణి.
దేశంలో ఏ రాష్ట్రం కూడా ఇలా చేయడం లేదు. వైసీపీ అధికారంలోకి రూ. 6 వేల 684 కోట్ల మేర బీమా మొత్తం చెల్లించాం. టిడిపి హయాంతో పోలిస్తే ఇది రెట్టింపు మొత్తం అన్నారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నో మండలాలను కరువు ప్రాంతాలుగా ప్రకటించారు. ఇప్పుడు కరువు మండలమే లేదు. వర్షాలు పుష్కలంగా పడుతున్నాయన్నారు. ఏటా 14 లక్షల టన్నుల ధాన్యం ఉత్పత్తి అవుతోంది.
Also Read
- Gudivada Amarnath: డేటా సెంటర్పై మాజీ మంత్రి ఫైర్.. పలు అంశాలపై సూటి ప్రశ్నలు.!
- Exam Malpractice: పరీక్షల్లో మాల్ ప్రాక్టీస్ చేస్తూ పట్టుబడ్డ 20 మంది వైద్య విద్యార్థులు..
- Fuel Shortage: పెట్రోల్ బంక్లకు మంత్రి నాదెండ్ల వార్నింగ్..
- AP Education Department: టీచర్ పోస్టుల సర్దుబాటుపై ఫోకస్ పెట్టిన విద్యాశాఖ.. బదిలీల్లో ట్విస్ట్..!
Read Also:Buffalo Died: నాగేదె చనిపోవడానికి కారణం హెలికాప్టర్.. పోలీసులకు ఫిర్యాదు
ప్రకృతి సహకరిస్తోంది..అందుకే పంటలు బాగా పండుతున్నాయి.కొన్ని మీడియా సంస్థలు స్వలాభం కోసం తప్పుడు వార్తలు రాస్తున్నాయి.నారా లోకేష్ వ్యవసాయం గురించి మాట్లాడటం హస్యాస్పదంగా వుంది. 10 పంటల్లో. ఐదు పంటలు కూడా గుర్తించలేని పవన్ కళ్యాణ్..వ్యవసాయం గురించి మాట్లాడుతున్నారు. రైతులకు వాస్తవాలు తెలుసు…తప్పుడు వార్తలు నమ్మరు. ఇప్పటికైనా ఆ మీడియా సంస్థలు తమ ధోరణి మార్చుకోవాలని హితవు పలికారు.
Read Also: Koti Deepotsavam 2022: చివరి రోజు కోటి దీపోత్సవం… ఈరోజు విశేష కార్యక్రమాలు
తాజావార్తలు
-
UAE vs Saudi Arabia: ఉప్పు నిప్పుగా యూఏఈ, సౌదీ అరేబియా.. గల్ఫ్లో పవర్ స్ట్రగుల్..
-
PBKS vs RR: స్టోయినిస్ తుఫాన్ ఇన్నింగ్స్.. రాజస్థాన్ ముందు భారీ లక్ష్యం.!
-
Payal Rajput: రిపోర్టర్ ప్రశ్నకు ఏడుస్తూ ఈవెంట్ నుంచి వెళ్లిపోయిన పాయల్ రాజ్పుత్
-
The Lalit Hotel: ఢిల్లీలోని లగ్జరీ హోటల్కు వెయ్యి కోట్ల పెనాల్టీ! ఎందుకో తెలుసా?
-
S-400 air defence system: పాకిస్తాన్కు చుక్కలే.. మరో ఎస్-400 భారత్ రాబోతోంది
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో