Kakani Govardhan Reddy: బాబు హయాంలో రైతులు కిడ్నీలు అమ్ముకున్నారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kakani Govardhan Reddy: టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబుపై రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. నెల్లూరు జిల్లాలో ఆయన మాట్లాడుతూ.. రైతుల ఆత్మహత్యలపై చంద్రబాబు ట్వీట్లు చేస్తున్నారని.. 2014 నుంచి 2019 మధ్య చంద్రబాబు పరిపాలన ప్రభావం వల్లే రైతుల ఆత్మహత్యలు కొనసాగాయని ఆరోపించారు. టీడీపీ హయాంలో రైతులకు చేసిన సంక్షేమం గురించి చెప్పాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు హయాంలో 1623 మండలాలను కరువుగా ప్రకటించారని ఎద్దేవా చేశారు. గత మూడేళ్ళలో కరువు మండలాలు లేవని గుర్తుచేశారు. రైతులకు రుణమాఫీ చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారని.. ఎంత చేశారో చెప్పాలన్నారు. లక్ష కోట్లయినా రైతులకు రుణ మాఫీ చేస్తామన్నారని.. బంగారు రుణాలకూ మాఫీ వర్తింప చేస్తామన్నారని.. ఆయన హామీలు నెరవేర్చక పోవడంతో అప్పుల ఊబిలో రైతులు కూరుకు పోయారని మండిపడ్డారు.
Read Also: Andhra Pradesh: ఉద్యమ కార్యాచరణ ప్రకటించిన ఏపీ వీఆర్వోలు
Also Read
- ACB Raid: భూమి మ్యుటేషన్ కోసం లంచం అవతారం.. ఏసీబీ వలలో వీఆర్వో..
- Vijay Sai Reddy: నేను వైసీపీని వీడటానికి అసలు కారణం ఇదే.. విజయసాయిరెడ్డి లేఖలో కీలక విషయాలు..
- CM Chandrababu: ‘సంజీవని’కి శ్రీకారం.. గిరిజనులకు సీఎం చంద్రబాబు గుడ్న్యూస్
- PG Doctors New Rules: ఏపీలో పీజీ వైద్యులకు కొత్త నిబంధనలు.. పని గంటలపై కీలక నిర్ణయం.
చంద్రబాబు మాదిరి కాకుండా సీఎం జగన్ ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తున్నారని మంత్రి కాకాణి స్పష్టం చేశారు. వరుసగా 4 ఏళ్లుగా జలాశయాలు నిండుతున్నాయన్నారు. గతంలో కంటే 14 లక్షల టన్నుల ధాన్యం అధికంగా ఉత్పత్తి అవుతోందని తెలిపారు. చంద్రబాబు హయాంలో జలాశయాలకు నీరు రాలేదన్నారు. తమ ప్రభుత్వ హయాంలో రైతులు పంట నష్టపోతే బీమా ఇస్తున్నామన్నారు. ఇన్ పుట్ సబ్సిడీని అదే సీజన్లో ఇస్తున్నామని పేర్కొన్నారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఇన్పుట్ సబ్సిడీ అమలు చేస్తున్నామని చెప్పారు. రైతుల ఆత్మహత్యలకు చెందిన బకాయిలను కూడా జగన్ వచ్చిన తర్వాత చెల్లించారన్నారు. చంద్రబాబు వ్యవసాయం దండగ అన్నారని.. ఇప్పుడు ఉచిత విద్యుత్ ఇస్తానని కబుర్లు చెప్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు హయాంలో రైతులు అప్పుల పాలై కిడ్నీలు అమ్ముకున్నారని విమర్శలు చేశారు.
తాజావార్తలు
-
Nepal Floods: భారత పౌరుల గురించి కీలక వివరాలు వెల్లడించిన కేంద్రం
-
Telangana Assembly: తెలంగాణ అసెంబ్లీ, మండలి సమావేశాల ముహూర్తం ఖారారు..
-
ACB Raid: భూమి మ్యుటేషన్ కోసం లంచం అవతారం.. ఏసీబీ వలలో వీఆర్వో..
-
Sonia Gandhi: సోనియా గాంధీ ఓటర్ లిస్ట్ కేసులో కీలక పరిణామం
-
FSSAI: ఎవరెస్ట్, లాల్జీ గోధూ ఇంగువపై బ్యాన్.. ఎగ్, చికెన్, గరం మసాలాల్లో నిబంధనల ఉల్లంఘన..
ట్రెండింగ్
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!