Anagani Satya Prasad: త్వరలోనే గుజరాత్ తరహాలో ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్..
- మాజీ ముఖ్యమంత్రి కేసుల కోసమే ఢిల్లీ పర్యటనలు చేశారు..
- సీఎం చంద్రబాబు కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చేందుకు వెళ్తున్నారు..
- త్వరలో గుజరాత్ తరహాలో ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్: మంత్రి అనగాని
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Anagani Satya Prasad: గత ప్రభుత్వంలో మాజీ సీఎం కేసుల మాఫీ కోసమే ఢిల్లీ పర్యటనలు చేశారని మంత్రి అనగాని సత్య ప్రసాద్ ఆరోపించారు. ఇప్పుడు జగన్ ఢిల్లీ వెళ్ళినా.. గవర్నర్ ను కలిసినా ఎవరూ పట్టించుకోరు.. వినుకొండ పర్యటన, గవర్నర్ ని కలవడం రాజకీయ లబ్ధి కోసమే చేశారు.. జగన్ ఎన్ని నాటకాలు ఆడిన ప్రజలు నమ్మే స్థితిలో లేరు అని మండిపడ్డారు. వినుకొండలో హత్య ఇద్దరి మధ్య వ్యక్తిగత కారణాలు తప్పా.. రాజకీయ అంశాలు లేవు.. గతంలో నిర్లక్ష్యానికి గురైన రాజధాని నిర్మాణాన్ని తిరిగి పున: ప్రారంభించడం జరుగుతుందన్నారు. గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ఆయన అనుచరులు బాగుపడటం తప్ప రాష్ట్ర అభివృద్ధి ఎక్కడ జరగలేదు అని మంత్రి సత్యప్రసాద్ పేర్కొన్నారు.
Read Also: CM Revanth Reddy: ఢిల్లీ చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి.. సాయంత్రం కాంగ్రెస్ అధిష్టానంతో భేటీ!
Also Read
- Kharif Water Release: ఖరీఫ్కు నీటి విడుదలపై ప్రభుత్వం ఫోకస్.. కృష్ణా, గోదావరి డెల్టాలకు యాక్షన్ ప్లాన్ సిద్ధం
- Pithapuram Varma : వర్మ ఓదార్పు రాజకీయాలపై జనసేన అసంతృప్తి.?
- AP Government: వారికి భారీ శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. జూన్ 12 నుంచి ప్రారంభం..
- Perni Nani: ఆర్టీసీని సర్వనాశనం చేశారు.. మహిళలపై నెపం వేస్తున్నారు..
కాగా, గతంలో జగన్ అరాచక పాలన చూశామని మంత్రి అనగాని సత్యప్రసాద్ వెల్లడించారు. మాచర్లలో తోట చంద్రయ్యను టీడీపీకి వ్యతిరేకంగా మాట్లాడలేదని దారుణంగా చంపారు.. గత ప్రభుత్వంలో వైసీపీ అరాచకాలు తట్టుకోలేక చాలామంది ఆత్మహత్య చేసుకున్నారు.. ప్రస్తుతం రాష్ట్రం సుభిక్షంగా ఉందన్నారు. గత ప్రభుత్వంలో చంద్రబాబుని అసెంబ్లీలో ఎంత హేళనగా మాట్లాడారో అందరూ చూశారు.. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి వారి నాయకులను కంట్రోల్ లో పెట్టి ఉంటే ఇలాంటి ఫలితాలు వచ్చేవి కాదు కదా అని మంత్రి అన్నారు.
Read Also: Bangladesh : పోలీసులు కర్ఫ్యూను పొడగింపు.. షూట్ ఎట్ సైట్ ఆర్డర్స్.. 114మంది మృతి
ఇక, ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీ పర్యటనలు కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి నిధులను తీసుకు రావడానికి జరుగుతున్నాయని మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు. గత ఐదు సంవత్సరాలుగా అనేక కబ్జాలు వైసీపీ ప్రభుత్వంలో జరిగాయి.. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనే పేరుతో అక్రమాలకు పాల్పడ్డారు.. ప్రస్తుతం ల్యాండ్ టైటిలింగ్ రద్దు చేశాము.. ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ ని తీసుకొని వచ్చి కబ్జాలు చేసిన వారికి శిక్ష పడేవిధంగా చర్యలు తీసుకుంటాము.. గుజరాత్ ప్రభుత్వ తరహాలో ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ అమలు చేస్తాం.. రాష్ట్రంలో కబ్జాలు లేకుండా చూస్తామని మంత్రి సత్యప్రసాద్ వెల్లడించారు.
తాజావార్తలు
-
Naturally Lizard Removal Tips: వేసవిలో ఇంట్లో బల్లుల బెడద ఎక్కువైందా..? ఈ సింపుల్ స్ప్రే చాలు.. వెంటనే పారిపోతాయి..!
-
Peddi: ‘పెద్ది పార్ట్ 2’పై బుచ్చిబాబు ఫుల్ క్లారిటీ..!
-
Karuppu : 13 ఏళ్ల తర్వాత హిట్ కొట్టిన సూర్య.. సింగం – 2 వసూళ్లను బ్రేక్ చేసిన ‘వీరభద్రుడు’
-
Vaibhav Sooryavanshi: వామ్మో.. కోహ్లీ, అభిషేక్ రికార్డులు బద్దలుగొట్టిన బుడ్డోడు.. ఐపీఎల్లో నయా హిస్టరీ!
-
Nurjahan Mango: బాబోయ్.. ఒక్క మామిడి పండు ధర రూ.3,000, దీని ’ స్పెషాలిటీ ఏంటో తెలుసా?
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..