Ambati Rambabu: ఇప్పటంలో అనవసర రాద్ధాంతం.. చివరికి ఏమైంది?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇప్పటం వ్యవహారంలో ఆగ్రహం వ్యక్తం చేసిన హైకోర్టు.. కోర్టును ఆశ్రయించిన 14 మందికి లక్ష రూపాయల చొప్పున జరిమానా విధించిన విషయం విదితమే.. అయితే, ఈ వ్యవహారంపై స్పందించిన మంత్రి అంబటి రాంబాబు.. విపక్షాలపై ఫైర్ అయ్యారు.. ఇప్పటంలో అనవసర రాద్దాంతం చేశారు.. ప్రభుత్వాన్నే కూల్చాలని లోకేష్ విమర్శలు చేశారు.. చివరికి ఏమైంది? కోర్టునే మోసం చేసినట్టు తేలిందని ఫైర్ అయ్యారు.. పిటిషనర్లకు లక్ష చొప్పున పెనాల్టీ వేసింది అని గుర్తుచేశారు.. కుట్రలు చేసి ప్రభుత్వాన్ని అభాసుపాలు చేయాలనుకుంటే ఏమవుతుందో ఇప్పటం కథలో తేలిపోయిందన్నారు మంత్రి అంబటి.
Read Also: MP VIjaya Sai Reddy: లోకేష్పై సెటైర్లు.. అక్కడ ఫోన్ను తలకిందులు చేయాల్సిన అవసరం ఏంటి?
Also Read
- East Godavari Thief: తూర్పుగోదావరి జిల్లాలో ఘరానా దొంగ అరెస్ట్.. జూదం కోసం వరుస చోరీలు.. బెయిల్పై బయటకు వచ్చి!
- CM Chandrababu: ఏయూ వీసీ రాజశేఖర్పై సీఎం చంద్రబాబు ఫైర్!
- Kolar Tragedy: గుండెల్ని పిండేసే ఘటన.. ఇద్దరు పసిబిడ్డల ప్రాణాలు తీసిన కన్నతల్లి.. చివరకు..!
- Robbery: బ్యాంకులో బంగారం చోరీకి ఉద్యోగి యత్నం.. సిబ్బందిపై సుత్తితో దాడి చేసి.. దారుణంగా..
మరోవైపు, రాష్ట్ర వ్యాప్తంగా చిట్ ఫండ్ కంపెనీల మీద సోదాలు జరుగుతున్నాయని తెలిపారు మంత్రి అంబటి.. తప్పుడు పనులు చేసిన వారిపై చట్టపరమైన కేసులు పెడుతున్నారు.. ఇందులో మార్గదర్శి చిట్ ఫండ్ కంపెనీ కూడా అక్రమాలు చేసినట్టు అధికారులు గుర్తించారని వెల్లడించారు.. సుప్రీంకోర్టులో కేసు విచారణలో ఉంది.. ప్రభుత్వం స్పెషల్ పిటిషన్ వేసిందని.. రాష్ట్రంలో ఎవరైనా చట్టబద్దంగా వ్యాపారాలు చేస్తే సరే.. అలా కాకుండా చట్టవ్యతిరేకంగా చేస్తామంటే కుదరదు.. చిట్ ఫండ్ చట్టం ఏం చెప్తుందో అలాగే వ్యవహరించాలి.. మొన్నటి సోదాల్లో మార్గదర్శిలో భారీగా అక్రమాలు జరిగాయని తేలింది.. ఒక్కో చిట్ కి ఒక్కో ఖాతాని ఓపెన్ చేయాలి.. కానీ, మార్గదర్శి అన్ని చిట్ లకు కలిపి ఒకే ఖాతా నిర్వహిస్తోందని విమర్శించారు. ష్యూరిటీ పేరుతో డబ్బులు ఇవ్వకుండా వారి దగ్గరే ఉంచుకుంటున్నారని ఆరోపించారు మంత్రి అంబటి రాంబాబు.. ఇలా పెద్ద ఎత్తున రిజర్వ్ఫండ్ ని రెడీ చేసుకుంటున్నారు.. ఆ ఫండ్ను ఇతర అవసరాల కోసం వాడుకుంటున్నారని ఆరోపించిన ఆయన.. ఇలా చేయటం చట్ట వ్యతిరేకం.. దీనిని ప్రశ్నిస్తే కక్షసాధింపు అంటూ గోల చేస్తున్నారని మండిపడ్డారు.. ఎవరైనాసరే చట్టానికి అతీతులు కాదని స్పష్టం చేశారు అంబటి రాంబాబు.
తాజావార్తలు
-
KL Rahul: కేఎల్ రాహుల్కు ఊహించని షాక్!
-
PEDDI : రాయలసీమలో దేవరను దాటలేకపోయిన ‘పెద్ది’
-
East Godavari Thief: తూర్పుగోదావరి జిల్లాలో ఘరానా దొంగ అరెస్ట్.. జూదం కోసం వరుస చోరీలు.. బెయిల్పై బయటకు వచ్చి!
-
Praggnanandhaa: వరల్డ్ ఛాంపియన్కు చెక్ మెట్.. హ్యాట్రిక్ విజయంతో నార్వే చెస్ టైటిల్ రేసులో దూసుకపోతున్న ప్రజ్ఞానంద.!
-
K Annamalai: “కొత్త రాజకీయ ఉద్యమం మొదలు పెడుతున్నా”.. అన్నామలై సంచలన ప్రకటన..
ట్రెండింగ్
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!
-
HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..