Ambati Rambabu: ఇప్పటంలో అనవసర రాద్ధాంతం.. చివరికి ఏమైంది?
ఇప్పటం వ్యవహారంలో ఆగ్రహం వ్యక్తం చేసిన హైకోర్టు.. కోర్టును ఆశ్రయించిన 14 మందికి లక్ష రూపాయల చొప్పున జరిమానా విధించిన విషయం విదితమే.. అయితే, ఈ వ్యవహారంపై స్పందించిన మంత్రి అంబటి రాంబాబు.. విపక్షాలపై ఫైర్ అయ్యారు.. ఇప్పటంలో అనవసర రాద్దాంతం చేశారు.. ప్రభుత్వాన్నే కూల్చాలని లోకేష్ విమర్శలు చేశారు.. చివరికి ఏమైంది? కోర్టునే మోసం చేసినట్టు తేలిందని ఫైర్ అయ్యారు.. పిటిషనర్లకు లక్ష చొప్పున పెనాల్టీ వేసింది అని గుర్తుచేశారు.. కుట్రలు చేసి ప్రభుత్వాన్ని అభాసుపాలు చేయాలనుకుంటే ఏమవుతుందో ఇప్పటం కథలో తేలిపోయిందన్నారు మంత్రి అంబటి.
Read Also: MP VIjaya Sai Reddy: లోకేష్పై సెటైర్లు.. అక్కడ ఫోన్ను తలకిందులు చేయాల్సిన అవసరం ఏంటి?
Also Read
- Seshachalam Forest : శేషాచలం అడవుల్లో కార్చిచ్చు.. జీవకోన ప్రాంతంలో ఎగిసిపడుతున్న మంటలు.!
- Nadendla Manohar : డీజిల్ కొరతకు కారణం ఇదే.. రేపు ఉదయం కల్లా బంకులకు స్టాక్.. మంత్రి కీలక ప్రకటన..!
- Vizag ROB Collapse: విశాఖలో ప్రమాదం.. కూలిన నిర్మాణంలో ఉన్న రైల్వే బ్రిడ్జి
- CM Chandrabbau: రాష్ట్రంలో డీజిల్, పెట్రోల్ కొరత.. బంకుల మూసివేతపై సీఎం సమీక్ష!
మరోవైపు, రాష్ట్ర వ్యాప్తంగా చిట్ ఫండ్ కంపెనీల మీద సోదాలు జరుగుతున్నాయని తెలిపారు మంత్రి అంబటి.. తప్పుడు పనులు చేసిన వారిపై చట్టపరమైన కేసులు పెడుతున్నారు.. ఇందులో మార్గదర్శి చిట్ ఫండ్ కంపెనీ కూడా అక్రమాలు చేసినట్టు అధికారులు గుర్తించారని వెల్లడించారు.. సుప్రీంకోర్టులో కేసు విచారణలో ఉంది.. ప్రభుత్వం స్పెషల్ పిటిషన్ వేసిందని.. రాష్ట్రంలో ఎవరైనా చట్టబద్దంగా వ్యాపారాలు చేస్తే సరే.. అలా కాకుండా చట్టవ్యతిరేకంగా చేస్తామంటే కుదరదు.. చిట్ ఫండ్ చట్టం ఏం చెప్తుందో అలాగే వ్యవహరించాలి.. మొన్నటి సోదాల్లో మార్గదర్శిలో భారీగా అక్రమాలు జరిగాయని తేలింది.. ఒక్కో చిట్ కి ఒక్కో ఖాతాని ఓపెన్ చేయాలి.. కానీ, మార్గదర్శి అన్ని చిట్ లకు కలిపి ఒకే ఖాతా నిర్వహిస్తోందని విమర్శించారు. ష్యూరిటీ పేరుతో డబ్బులు ఇవ్వకుండా వారి దగ్గరే ఉంచుకుంటున్నారని ఆరోపించారు మంత్రి అంబటి రాంబాబు.. ఇలా పెద్ద ఎత్తున రిజర్వ్ఫండ్ ని రెడీ చేసుకుంటున్నారు.. ఆ ఫండ్ను ఇతర అవసరాల కోసం వాడుకుంటున్నారని ఆరోపించిన ఆయన.. ఇలా చేయటం చట్ట వ్యతిరేకం.. దీనిని ప్రశ్నిస్తే కక్షసాధింపు అంటూ గోల చేస్తున్నారని మండిపడ్డారు.. ఎవరైనాసరే చట్టానికి అతీతులు కాదని స్పష్టం చేశారు అంబటి రాంబాబు.
తాజావార్తలు
-
CM Revanth Reddy : ఐఏఎస్ల బదిలీల్లో రేవంత్ రెడ్డి క్యారెట్ అండ్ స్టిక్ పాలసీ
-
House Sales Down: భారీగా పడిపోయిన ఇళ్ల అమ్మకాలు.. ప్రధాన కారణం ఇదే..
-
Software Jobs Opening: లేఆఫ్స్ మధ్య భారీ ఊరట.. నియామకాలు స్టార్ట్ చేసిన ప్రముఖ సాఫ్ట్వేర్ సంస్థ..
-
Success Story: ఊరి నుంచి రూ.12 అప్పు చేసి వచ్చాడు.. నేడు రూ. 15 వేల కోట్లకు అధిపతి..
-
Angkrish Raghuvanshi: రేర్ డిస్మిసల్.. అంగ్క్రిష్ రఘువంశీ ఆబ్స్ట్రక్టింగ్ ది ఫీల్డ్ కు ఔట్.. కేకేఆర్ ఆగ్రహం
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!