Ambati Rambabu: చంద్రబాబుకు కౌంటర్.. సీఎం జగన్ భారతీయుడు సినిమాలో కమల్హాసన్ లాంటోడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ambati Rambabu: టీడీపీ అధినేత చంద్రబాబుపై ఏపీ ఇరిగేషన్ శాఖ మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. అసెంబ్లీకి రాకుండా పారిపోయిన ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి బాధితులను రెచ్చగొట్టే విధంగా మాట్లాడారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కోడి కత్తి కమల్హాసన్ అంటూ సీఎం జగన్ను ఉద్దేశించి మాట్లాడుతున్న చంద్రబాబుకు.. భారతీయుడులో కమల్హాసన్ గురించి తెలియదా అని అంబటి రాంబాబు ప్రశ్నించారు. దుర్మార్గులకు, దుష్టులను, చంద్రబాబు లాంటి 420 గాళ్లను రాజకీయంగా గొంతు కోయడానికి వచ్చిన భారతీయుడిలో కమల్హాసన్ సీఎం జగన్ అని ప్రజలు చెబుతున్నారన్నారని స్పష్టం చేశారు. అలాంటి జగన్ను చంద్రబాబు చూడలేదా అంటూ చురకలు అంటించారు. 1986లో భద్రాచలంలో కరకట్ట కట్టానని చంద్రబాబు గొప్పలు చెప్పుకోవడం హాస్యాస్పదంగా ఉందని మంత్రి అంబటి రాంబాబు ఎద్దేవా చేశారు. పోలవరం ముంపు గ్రామాలకు చంద్రబాబు వెళ్లగా.. అక్కడ అందరూ తమకు ప్రభుత్వ సాయం అందిందిని చెప్పారని.. ప్రజల మాటలు విని చంద్రబాబు మైండ్ బ్లాంక్ అయ్యిందని అంబటి రాంబాబు ఆరోపించారు.
Read Also: Chandrababu Naidu: వరద బాధితులను మానవతావాదులు, దాతలు ఆదుకోవాలి
Also Read
- OTR : హిందూపురం గడ్డ మా అడ్డా! బాలయ్య ఇలాకాలో లోకల్ వార్ మొదలైందా?
- OTR: సిక్కోలులో వైసీపీకి గ్రూపుల గోల! స్థానిక ఎన్నికల వేళ అసలు రచ్చ ఇదేనా?
- Big Rain Alert: విజయవాడలో వర్ష బీభత్సం.. మునిగిపోయిన రోడ్లు, బ్రిడ్జిలు..
- Botsa Satyanarayana Emotional: మరోసారి బొత్స కన్నీళ్లు.. అమర్నాథ్ వ్యాఖ్యలతో కన్నీటి పర్యంతం
ఐదేళ్ళు అధికారంలో ఉన్న చంద్రబాబు పోలవరం ఎందుకు పూర్తి చేయలేదో చెప్పాలని అంబటి రాంబాబు డిమాండ్ చేశారు. బస్సుల్లో జనాలను తీసుకుని వెళ్లి చంద్రన్న చంద్రన్న అంటూ ఆనాడు భజన చేయించారని మండిపడ్డారు. కాఫర్ డ్యాం కట్టకుండా డ్రయాఫ్రమ్ వాల్ ఎందుకు కట్టాడో చంద్రబాబు చెప్పాలన్నారు. సెంట్రింగ్ వేయకుండా శ్లాబ్ వేయించాడని.. కేంద్రం కట్టాల్సిన జాతీయ ప్రాజెక్టును చంద్రబాబు ఎందుకు తీసుకున్నాడని ప్రశ్నించారు. డబ్బులకు కక్కుర్తిపడి కాదా అని నిలదీశారు. 2018లో పూర్తి చేస్తానని చెప్పి ఎందుకు పూర్తి చేయలేదన్నారు. నోరు ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఎలా కుదురుతుందన్నారు. పోలవరం ముంపునకు గురి కావటానికి చంద్రబాబే కారణమని అంబటి రాంబాబు ఆరోపించారు. త్వరలోనే పోలవరంలో జరిగిన అవినీతి వ్యవహారాలు బయటకు తీస్తామని.. చంద్రబాబు, దేవినేని ఉమా కలిసి చేసిన అరాచకం అంతా ఇంతా కాదన్నారు. ఆ అవినీతిని కప్పిపుచ్చుకోవడానికి గోదావరి వరద ప్రాంతాల్లో జగన్ మీద చంద్రబాబు ఏడుపు యాత్ర ప్రారంభించాడని.. వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలను రెచ్చగొట్టడానికి చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. వరద బాధితులను రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంది అయినా సరే ఏదో లబ్ధి పొందాలని చంద్రబాబు తాపత్రయం చూస్తుంటే బాధ వేస్తుందని అంబటి రాంబాబు పేర్కొన్నారు.
తాజావార్తలు
-
OTR : హిందూపురం గడ్డ మా అడ్డా! బాలయ్య ఇలాకాలో లోకల్ వార్ మొదలైందా?
-
Story Board : BRICS సదస్సు ప్రధాన ఉద్దేశమేంటి..? భారత్ ఎలాంటి సందేశం ఇస్తుంది..?
-
Telangana Assembly : తెలంగాణ అసెంబ్లీకి ఒకరోజు పొడిగింపు.. బుధవారానికి వాయిదా
-
Greenfield Highway : గ్రీన్ఫీల్డ్ హైవేపై మృత్యుఘోష.. ఒకే రోజు మూడు ప్రమాదాలు
-
Happy Journey : వందల ఫోన్ నెంబర్లున్నా మాట్లాడుకోలేని ఒంటరితనం.. మనందరి కథే ‘హ్యాపీ జర్నీ’..
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్తో సెప్టెంబర్ 15న భారత్లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్తో భారత్ దౌత్యం.. చాబహార్తో కొత్త ట్రేడ్ రూట్.!