Chandrababu Naidu: వరద బాధితులను మానవతావాదులు, దాతలు ఆదుకోవాలి
Chandrababu Naidu: ఇటీవల గోదావరి వరదలకు పలు లంక గ్రామాల బాధితుల్లో కొందరు ఇంకా నిస్సహాయస్థితిలోనే ఉన్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు దాతలకు పిలుపునిచ్చారు. వరద బాధితులకు కూరగాయలు, బియ్యం వితరణ చేయాలని దాతలను కోరారు. ఇటీవల కురిసిన వర్షాలు ప్రజలకు అపార నష్టాన్ని మిగిల్చాయని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. దశాబ్దాల తరబడి సమకూర్చుకున్న సంపదంతా వరదపాలై కట్టుబట్టలతో ప్రజలు నిస్సహాయ స్థితిలో ఉన్నారని అభిప్రాయపడ్డారు. వరద బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం చేతులెత్తేసిందని.. మానవత్వాన్ని మరచిందని చంద్రబాబు ఆరోపించారు. మేత లేక పశువులు నకనకలాడుతున్నాయని.. వాటి కోసం ఎండుగడ్డిని దాతలు అందించేందుకు ముందుకు రావాలని విజ్ఞప్తి చేశారు.
Read Also: Auto Driver Selfie Video: సెల్ఫీ వీడియో తీసుకుని ఆటోడ్రైవర్ ఆత్మహత్య
Also Read
- AP Liquor Scam Case: లిక్కర్ స్కామ్లో కీలక మలుపు.. రంగంలోకి దిగిన ఐటీ అధికారులు
- Minister Gottipati Ravikumar: విద్యుత్ కోతలకు నో.. నిరంతర సరఫరా ఉండాల్సిందే.. మంత్రి గొట్టిపాటి ఆదేశాలు
- School Holidays: 2026-27 విద్యాసంవత్సరానికి అకడమిక్ క్యాలెండర్ విడుదల.. స్కూళ్లకు 87 సెలవులు
- AP WhatsApp Services: ఏపీ సర్కార్ కీలక నిర్ణయం.. వాట్సాప్లోనే మెడికల్ కౌన్సిల్ సేవలు
వరద ప్రభావిత ప్రాంతాల్లో బాధితులు కూరగాయలు, బియ్యం దొరక్క ప్రజలు, పసి బిడ్డలు దుర్భర స్థితిలో ఉన్నారని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఇళ్లల్లోకి పూర్తిగా నీరు చేరి 4 నుంచి 7 రోజులు నిల్వ ఉండిపోయాయని… ఇళ్లలో బురద చేరిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఫ్యాన్లు, టీవీలతోపాటు ఇంట్లో ఉన్న అన్ని వస్తువులు పనికి రాకుండా పోయిన దృశ్యాలు తన పర్యటనలో చూశానని చంద్రబాబు వివరించారు. వరద బాధితుల్ని ఆదుకోవడంలో ప్రభుత్వం బాధ్యత మరిచిందని విమర్శలు చేశారు. అలాంటప్పుడు బాధితుల్ని సమాజం, మానవతావాదులు, దాతలు ఆదుకోవాలని కోరారు. స్వచ్ఛంద సంస్థలు, రాజకీయ పార్టీలు ఆదుకునేందుకు ముందుకు రావాలన్నారు. ఇప్పటికే ఎన్టీఆర్ ట్రస్ట్ కొంత మేరకు సాయం అందించిందని.. ఇంకా సాయం కొనసాగిస్తోందని చంద్రబాబు తెలిపారు. తక్షణం పశువులకు ఎండుగడ్డి అవసరం ఎక్కువగా ఉందని.. దాతలు వారి పేరుతో గానీ, టీడీపీ ద్వారా గాని ఎండుగడ్డి వితరణ చేయాలన్నారు. అలాగే కూరగాయలు, బియ్యం కూడా అందించాలని దాతలను కోరుతున్నట్లు చంద్రబాబు తన ప్రకటనలో పేర్కొన్నారు. టీడీపీ కార్యకర్తలు, నాయకులు, ఎన్ఆర్ఐలు సాధ్యమైనంత వరకు ప్రజలకు కూరగాయలు, బియ్యం.. పశువులకు ఎండుగడ్డి వితరణ చేయాలన్నారు.
తాజావార్తలు
-
Vivo S50t 5G: 50MP ట్రిపుల్ కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 90W ఛార్జింగ్తో.. వివో S50t 5G విడుదల
-
Cucumber Chutney Recipe: మండుటెండలో చల్లని టేస్టీ రెసిపీ.. దోసకాయ చట్నీ ఇలా తయారు చేయండి..
-
Emergency Alert: మీ మొబైల్స్ పెద్ద శబ్దంతో మోగాయా? కంగారు పడకండి.. మేటరేంటంటే..!
-
IPL 2026 Playoffs Chances: హీటేక్కిస్తున్న ప్లేఆఫ్స్ రేస్.. టాప్-4 కోసం 10 జట్లకు ఎన్ని విజయాలు కావాలి?
-
Santosh Goyal Story: విధి వంచించిన మేధావి.. ఈ పీహెచ్డీ స్కాలర్ పరిస్థితి చూస్తే కన్నీళ్లు ఆగవు..
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!