KTR : గ్లోబరీనా వివాదం.. రేవంత్కు కేటీఆర్ డిఫమేషన్ నోటీసు
- గ్లోబరీనా ఆరోపణలపై డిఫమేషన్ నోటీసు
- లై డిటెక్టర్ పరీక్షకు కేటీఆర్ సవాల్
- కాంగ్రెస్-బీజేపీపై తీవ్ర విమర్శలు
- పాదయాత్రపై కీలక ప్రకటన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
KTR : వరంగల్లో నిర్వహించిన చిట్ చాట్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. గ్లోబరీనా సంస్థ తనదంటూ చేసిన ఆరోపణలపై సీఎం రేవంత్ రెడ్డికి డిఫమేషన్ నోటీసులు పంపినట్లు ఆయన వెల్లడించారు. ఆ నోటీసుకు సరైన సమాధానం ఇవ్వకపోతే న్యాయపరంగా మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. గ్లోబరీనా సంస్థతో తమకేమీ సంబంధం లేదని స్పష్టం చేస్తూ, ఒకవేళ అది తన సంస్థే అయితే ప్రస్తుత రేవంత్ ప్రభుత్వం ఆ సంస్థతో ఒప్పందం ఎందుకు కుదుర్చుకుందో చెప్పాలని నిలదీశారు. విచారణకు తాను పూర్తిస్థాయిలో సహకరిస్తానని, దమ్ముంటే విచారణ జరిపించాలని సవాల్ విసిరారు. అవసరమైతే ఇద్దరం లై డిటెక్టర్ పరీక్షకు వెళ్దామని, దానికి సీఎం సిద్ధమా అని సవాల్ విసిరారు.
రేవంత్ పాలన, బీజేపీతో అంతర్గత బంధంపై ధ్వజం
రేవంత్ రెడ్డి మనస్ఫూర్తిగా ఒక్కసారి కూడా ‘జై తెలంగాణ’ అని అనలేదని కేటీఆర్ ఎద్దేవా చేశారు. పాత కేసుల బూజు దులుపుతారనే భయంతోనే రేవంత్ రెడ్డి బీజేపీని, ప్రధాని మోదీని ఏమీ అనలేకపోతున్నారని ఆరోపించారు. సింగరేణిలో భారీ కుంభకోణాలు జరుగుతున్నా బీజేపీ మౌనంగా ఉంటోందని మండిపడ్డారు. పగలు కాంగ్రెస్, రాత్రి బీజేపీగా వ్యవహరించే నైజం రేవంత్ రెడ్డిదని, ఢిల్లీకి వెళ్తే బీజేపీ నేతల కార్లలో తిరుగుతారని తీవ్ర విమర్శలు చేశారు. తమది ‘తెలంగాణ జాతి’ అని, బ్యాగులు మోసే జాతి లేదా దగుల్బాజీ జాతి కాదని స్పష్టం చేశారు. అర్ధరాత్రి కాళ్లు పట్టుకునే దుస్థితి తమకు అలవాటు లేదని వ్యాఖ్యానించారు.
Also Read
- Chit Fund Scam: రూ.2,000 కోట్ల చిట్ఫండ్ స్కామ్.. వెల్ఫేర్ గ్రూప్పై ఈడీ దాడులు..
- Drunk and Drive: స్పీడ్.. డ్రింక్.. డెత్! హైదరాబాద్లో ఒకే రోజు ముగ్గురు బలి!
- OTR : తెలంగాణ MLC ఎన్నికల్లో కాంగ్రెస్ కొత్త లెక్కలు..! రెండు సీట్లు రెడ్లకేనా..?
- Indiramma Indlu : ఇందిరమ్మ ఇళ్లకు మరో ఛాన్స్.. ఆగస్టు 15 వరకు గడువు.!
అవినీతి ఆరోపణలు , రాబోయే రాజకీయ కార్యాచరణ
రేవంత్ రెడ్డి బావమరిది అమృత్ కాంట్రాక్టుల్లో తీవ్ర కుంభకోణానికి పాల్పడుతున్నారని, అందులో నుంచి కాంగ్రెస్కు ఒక మూట, బీజేపీకి రెండు మూటలు పంపుతున్నారని కేటీఆర్ ఆరోపించారు. గ్లోబరీనా, ఫోన్ ట్యాపింగ్, ఫార్ములా ఈ-రేస్ వంటి ఏ అంశంపైనా కేసులు పెట్టుకోవచ్చని, తాము దేనికైనా సిద్ధంగా ఉన్నామని చెప్పారు. గ్లోబరీనా సంస్థ తనదేనని నిరూపిస్తే రాహుల్ గాంధీతో వచ్చి తన ఇంటి ముందు ధర్నా చేయాలని, ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఇలాంటి బాధ్యతారాహిత్య మాటలు మాట్లాడటం సిగ్గుచేటని వ్యాఖ్యానించారు. రాబోయే రోజుల్లో జిల్లాల నుంచే తమ పాదయాత్ర ప్రారంభమవుతుందని, త్వరలోనే అన్ని వర్గాల ప్రజలను ఏకం చేసేలా ముమ్మర రాజకీయ ప్రణాళికతో ముందుకు వెళ్తామని వెల్లడించారు.
తాజావార్తలు
-
Colombia Earthquake : కొలంబియాలో భారీ భూకంపం.. 47 మంది మృతి, కూలిన భవనాలు.!
-
OTR : అసెంబ్లీకి వైసీపీ..? DSC రచ్చ వేళ కూటమి అలర్ట్.. బీసీ బిల్లుపై కీలక నిర్ణయం..!
-
Chairmans Desk : దేశంలో వ్యవస్థలు ఎటు పోతున్నాయి..? పాలన కంటే రాజకీయమేముఖ్యమైపోయిందా..?
-
OTR: రెడ్ ఐ ఎవరి మీద..?
-
Chit Fund Scam: రూ.2,000 కోట్ల చిట్ఫండ్ స్కామ్.. వెల్ఫేర్ గ్రూప్పై ఈడీ దాడులు..
ట్రెండింగ్
-
Kitchen Hacks : నూనె సీసాల జిడ్డు పోవాలంటే.. ఈ 4 చిట్కాలు ట్రై చేయండి.!
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!