AP Cabinet Meeting: ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు.. ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్, నేతన్నలకు భరోసా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Cabinet Meeting: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన ఏపీ మంత్రివర్గ సమావేశంలో రాష్ట్ర అభివృద్ధి, వ్యవసాయం, నీటిపారుదల, ఉద్యోగాల కల్పన, సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించిన పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్రంపై ఎల్ నినో ప్రభావం ఉండే అవకాశాలను దృష్టిలో ఉంచుకుని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యవసాయ శాఖ, నీటిపారుదల శాఖ అధికారులను అప్రమత్తం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం సాగులో ఉన్న పంటల వివరాలు, ప్రధాన జలాశయాల్లో ఉన్న నీటి నిల్వలు, తాగునీరు, సాగునీటి లభ్యతపై సమగ్ర నివేదికను వెంటనే సమర్పించాలని సంబంధిత శాఖలను ఆదేశించారు. ఎల్ నినో ప్రభావాన్ని దృష్టిలో పెట్టుకుని ముందస్తు చర్యలు తీసుకోవాలని మంత్రులకు కూడా సూచించారు.
ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్
రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మొత్తం 3,168 ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి ఆమోదం తెలిపింది. అలాగే చేనేత కార్మికుల సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తూ ‘నేతన్న భరోసా’ పథకం కింద 52 వేల చేనేత కుటుంబాలకు ఏటా రూ.25 వేల చొప్పున ఆర్థిక సాయం అందించాలని నిర్ణయించింది. ఉచిత విద్యుత్ సరఫరాతో పాటు అదనపు ఆర్థిక సహాయం ప్రకటించినందుకు మంత్రి సత్యకుమార్ యాదవ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఎన్డీయే ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.
Also Read
- 20 Lakh Jobs in AP: 20 లక్షల ఉద్యోగాలే లక్ష్యం.. పెట్టుబడులకు ఏపీ గమ్యస్థానం.. యువతకు సీఎం భరోసా
- CM Chandrababu: హెల్తీ.. వెల్తీ.. హ్యాపీ ఏపీ.. 10 సూత్రాలతో స్వర్ణాంధ్ర విజన్.. 2047 నాటికి నంబర్ వన్ లక్ష్యం
- CM Chandrababu: వికసితం నుంచి వైభవం వైపు.. ఆంధ్రప్రదేశ్పై చంద్రబాబు భారీ లక్ష్యం
- Amaravati Land Pooling Case: చంద్రబాబుకు సుప్రీంకోర్టులో బిగ్ రిలీఫ్.. రాజకీయ పోరాటాలు కోర్టులో వద్దు..!
విద్యారంగంలో భాగంగా బాపట్లలో వినికిడి లోపం ఉన్న విద్యార్థుల కోసం ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అలాగే రానున్న పుష్కరాల సందర్భంగా భద్రత, బందోబస్తు ఏర్పాట్ల కోసం రూ.50 కోట్లు మంజూరు చేశారు. రైతుల ప్రయోజనాల కోసం ఏపీ మార్క్ఫెడ్కు సెంట్రల్ బ్యాంక్ నుంచి లభించే రూ.300 కోట్ల రుణానికి ప్రభుత్వ గ్యారంటీ ఇవ్వడానికి కూడా క్యాబినెట్ అంగీకారం తెలిపింది కేబినెట్..
ఇక మధ్యాహ్నం మంత్రి నారా లోకేష్ అధ్యక్షతన జరిగే గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ (జీఓఎం) సమావేశంలో రాష్ట్రంలో 20 లక్షల ఉద్యోగాల కల్పన అంశంపై విస్తృతంగా చర్చించనున్నారు. అనంతరం సాయంత్రం భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధాని పర్యటన ఏర్పాట్లపై మంత్రులతో సమీక్ష నిర్వహించనున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ పర్యటనను ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని శాఖలను సమన్వయం చేసుకుంటూ ఏర్పాట్లు వేగవంతం చేస్తోంది. రాష్ట్ర అభివృద్ధి, వ్యవసాయ భద్రత, సంక్షేమం, ఉపాధి కల్పనకు ప్రాధాన్యత ఇస్తూ ప్రభుత్వం ముందుకు సాగుతోందని తాజా మంత్రివర్గ నిర్ణయాలు స్పష్టం చేస్తున్నాయి.
తాజావార్తలు
-
Yash Rejected 7 Films: 7 సినిమాలు వదులుకున్న యశ్.. మనీ విషయంలో రాకింగ్ స్టార్ ఫార్ములా ఇదేనట!
-
Anil Ravipudi: వీకెండ్ కూడా వర్కింగ్ డేనే.. అనిల్ రావిపూడి టీమ్ దూకుడు మామూలుగా లేదుగా!
-
Sonipat Viral Incident: వీడియో కాల్లో తండ్రి అంత్యక్రియలు.. కర్మలకు కూడా రాని కుమార్తెలు
-
CM Revanth Reddy : ఆడబిడ్డలకు డిసెంబర్లో చిలకపచ్చ చీరలు ఇస్తాం
-
Thyroid Symptoms: ఇంట్లోనే థైరాయిడ్ సమస్యను నిర్ధారించుకోవడం సాధ్యమేనా?
ట్రెండింగ్
-
Bangladesh Cricket: ఆసీస్ గడ్డపై ఆస్ట్రేలియానే సుస్సు పోయించిన బంగ్లాదేశ్.. క్రికెట్ ప్రపంచం షాక్!
-
Devdutt Padikkal Record: మొదటి బ్యాటర్గా దేవదత్ పడిక్కల్ రేర్ రికార్డు.. గవాస్కర్, సచిన్, కోహ్లీకి కూడా సాధ్యం కాలేదు!
-
Home Hacks : గోడలపై ఫర్నిచర్ మరకలకు చెక్.. ఇంట్లోనే పాటించాల్సిన సులువైన చిట్కాలు.!
-
Homemade Ghee: ఇంట్లోనే సులభంగా కమ్మనైన, స్వచ్ఛమైన ‘నెయ్యి’ని తయారు చేయండి ఇలా..!
-
Redmi Note 17 5G vs Moto G Max 5G: మిడ్రేంజ్లో బెస్ట్ స్మార్ట్ఫోన్ ఏది.?