MLA Parthasarathy Apology: దళిత సర్పంచ్కు బహిరంగ క్షమాపణ కోరిన ఎమ్మెల్యే పార్థసారథి..
- దళిత సర్పంచ్కు బహిరంగ క్షమాపణ కోరిన ఎమ్మెల్యే పార్థసారథి..
- సర్పంచ్ ఎస్సీ కావడంతో వేదిక కిందనే నిలబెట్టారని విమర్శలు..
- సోషల్ మీడియాలో వైరల్ గా మారిన వీడియో..
- దళిత సంఘాల మధ్య బహిరంగ క్షమాపణ కోరారు పార్థసారథి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MLA Parthasarathy Apology: కర్నూలు జిల్లా ఆదోనిలో దళిత సర్పంచ్ ఘటనలో క్షమాపణ చెప్పారు ఎమ్మెల్యే పార్థసారథి.. దళిత సంఘాల మధ్య బహిరంగ క్షమాపణ కోరారు పార్థసారథి.. రెండు రోజుల క్రితం దనాపురంలో దళిత సర్పంచ్ కి అవమానం జరిగింది.. ప్రజల కోసం మీ పార్థసారథి ప్రోగ్రామ్ లో ఎమ్మెల్యే సమక్షంలో సర్పంచ్ కి అవమానం జరిగిందంటూ ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.. అయితే, సర్పంచ్ ని ఎమ్మెల్యే వేదికపై పిలుస్తుండగా అతను ఎస్సీ, ఎస్సీ అని.. ఎమ్మెల్యే పార్థసారథికి చెప్పారు టీడీపీ రాష్ట్ర మహిళా కార్యదర్శి గుడిసె కృష్ణమ్మ… దీంతో, సర్పంచ్ ఎస్సీ అని వేదికపైకి రాకుండా కిందే ఆగిపోవాలనే సైగలు చేశారు ఎమ్మెల్యే పార్థసారథి.. సర్పంచ్ చంద్రశేఖర్ ను కింద నిల్చోమని చూపించారు ఎమ్మెల్యే పార్థసారథి… కానీ, సర్పంచ్ ఎస్సీ కావడంతో వేదిక కిందనే బీజేపీ , టీడీపీ నాయకులు నిలబెట్టారంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి.. దీనిపై దళిత సంఘాలు ఆందోళనలు కూడా చేపట్టారు.. ఈ నేపథ్యంలో క్షమాపణ చెప్పారు ఎమ్మెల్యే పార్థసారథి..
Read Also: Shashi Tharoor: బీజేపీతో సాన్నిహిత్యంపై నోరు విప్పిన శశి థరూర్.. ఏమన్నారంటే..!
Also Read
- TG Bharath vs Byreddy Siddharth Reddy: బైరెడ్డి సిద్ధార్థ రెడ్డిపై మంత్రి టీజీ భరత్ క్రిమినల్ పరువునష్టం దావా
- Byreddy Siddharth Reddy: “నన్ను తిట్టేవారికి బహుమతులు ఇస్తున్నారు”.. మంత్రి టీజీ భరత్పై బైరెడ్డి విమర్శలు..
- AP Student Suicide in US: అమెరికాలో కర్నూలు యువకుడు ఆత్మహత్య.. పిస్టల్తో కాల్చుకుని..
- Mantralayam Road Accident: మంత్రాలయం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. ఎనిమిది మంది భక్తులు మృతి
కాగా, తాజాగా కర్నూలు జిల్లాలో దళిత సర్పంచ్కు అవమానం జరిగింది అంటూ సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అయ్యింది.. దీనిపై నెటిజన్లు కామెంట్లు పెట్టసాగారు.. కూటమి ఏడాది పాలన ఈనెల 12న పూర్తిచేసుకున్న సందర్భంగా కర్నూలు జిల్లా ఆదోని నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యే పార్థసారథి.. ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆదోని మండలం దానాపురంలో గుడి కట్టపై ప్రజల కోసం మీ పార్థసారథి అని పేరుతో కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ ప్రొగ్రామ్కు తెలుగుదేశం పార్టీ నాయకురాలు కృష్ణమ్మ కూడా హాజరయ్యారు. వేదికపై ఎమ్మెల్యే పార్థసారథి మాట్లాడుతూ.. సర్పంచ్ ఎక్కడ అంటూ ఆరా తీశారు. సర్పంచ్ రాకపోవడంతో ఆయన ఏమైనా క్రిస్టియనా? అని ఎమ్మెల్యే అనగా.. అక్కడే ఉన్న టీడీపీ నాయకురాలు కృష్ణమ్మ.. ఎమ్మెల్యే చెవిలో ఎస్సీ అని చెప్పారు. ఇంతలోనే సర్పంచ్ చంద్రశేఖర్ స్టేజి దగ్గరకు వచ్చాడు.. వారు మాట్లాడుతూ ఉండగా కిందనే నిలబడ్డారు. దీంతో, దళిత సర్పంచ్కు అన్యాయం అంటూ సోషల్ మీడియాలో ప్రచారం మొదలుపెట్టారు. విపరీతంగా వైరల్ అయ్యింది ఆ వీడియో.. చివరకు ఎమ్మెల్యే పార్థసారథి.. బహిరంగ క్షమాపణ చెప్పి.. ఆ వివాదానికి ముగింపు పలికారు..
తాజావార్తలు
-
Ragi Ponganalu: మహిళలకు అమృతం లాంటిది.. ఐరన్, క్యాల్షియం కావాలంటే వారంలో రెండుసార్లు ఇవి తినండి!
-
Vaibhav Sooryavanshi: సెంచరీ మిస్పై సంచలన కామెంట్స్ చేసిన వైభవ్ సూర్యవంశీ.. నా మైండ్లో ఉన్నది అదే అంటూ..
-
Story Board : ఇరాన్ యుద్ధం మళ్లీ మొదలవుతోందా..? మాంద్యం ముప్పు ఖాయమేనా..?
-
US-Iran: తూచ్.. హార్ముజ్పై ఎలాంటి ఒప్పందం జరగలేదు.. వైట్హౌస్ ఖండన
-
Mental Health: 120కోట్ల మందిని పట్టి పీడిస్తోన్న శాపం.. ఇది క్యాన్సర్ కంటే డేంజర్ భయ్యా!
ట్రెండింగ్
-
MG Majestor : రూ.40 లక్షల SUV కేవలం రూ.41,000లకే..!
-
Home Remedies : వర్షాకాలం వచ్చేస్తోంది.. దోమల బెడదకు ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి..!
-
స్టైలిష్ డిజైన్, 50MP పెరిస్కోప్ కెమెరా, IP69K రెసిస్టెన్స్ తో OPPO Reno16 సిరీస్ లాంచ్..
-
200MP కెమెరా, 8600mAh బ్యాటరీ, Dimensity 8550 Elite చిప్తో HONOR 600 సిరీస్ లాంచ్.!
-
12.1 అంగుళాల 3K డిస్ప్లే, 10100mAh బ్యాటరీతో HONOR Pad 20 లాంచ్.!