Shashi Tharoor: బీజేపీతో సాన్నిహిత్యంపై నోరు విప్పిన శశి థరూర్.. ఏమన్నారంటే..!
- ఎంపీ శశి థరూర్కు సొంత పార్టీ కాంగ్రెస్తో విభేధాలు..!
- ఈ అంశాలపై తాజాగా స్పందించిన శశి థరూర్
- నేను గత 16 ఏళ్లుగా కాంగ్రెస్లో పనిచేస్తున్నాను
- నాకు పార్టీతో కొన్ని విభేదాలు ఉన్నాయి
- నాకు పార్టీతో కొన్ని విభేదాలు ఉన్నాయి: థరూర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎంపీ శశి థరూర్కు సొంత పార్టీ కాంగ్రెస్తో విభేధాలు ఉన్నాయని పుకార్లు చక్కర్లు కొడుతున్న విషయం తెలిసిందే. ఇటీవల.. అమెరికాకు వెళ్లే ప్రతినిధి బృందానికి భారత ప్రభుత్వం శశి థరూర్ను నాయకుడిగా నియమించింది. విదేశాలకు వెళ్లే ప్రతినిధి బృందం కోసం కాంగ్రెస్ శశి థరూర్ పేరును ప్రతిపాదించలేదు. కానీ.. కేంద్ర ప్రభుత్వం మాత్రం ఆయనను నియమిచింది. దీంతో కాంగ్రెస్తో విభేధాలు ఉన్నాయన్న ఊహాగానాలు మొదలయ్యాయి. గతంలో కూడా అనేక సందర్భాల్లో పార్టీతో శశి థరూర్ విభేదాలు తెరపైకి వచ్చాయి.
READ MORE: Viratapalem: PC Meena Reporting: ఆసక్తి రేకెత్తిస్తున్న ‘విరాటపాలెం : PC మీనా రిపోర్టింగ్’ ట్రైలర్
Also Read
ఈ అంశాలపై తాజాగా శశి థరూర్ స్పందించారు. ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. “నేను గత 16 సంవత్సరాలుగా కాంగ్రెస్లో పనిచేస్తున్నాను. నాకు పార్టీతో కొన్ని విభేదాలు ఉన్నాయి. వాటిని పార్టీలో అంతర్గతంగా చర్చిస్తాను. ఈ రోజు వాటి గురించి మాట్లాడకూడదనుకుంటున్నాను. సమయం రావాలి, అప్పుడు నేను మీతో చర్చిస్తాను. ఇప్పుడు.. ఎంపీల ప్రతినిధి బృందానికి సంబంధించిన విషయాలపై మాత్రమే ప్రధానితో చర్చ జరిగింది. దేశానికి ఏదైనా సమస్య తలెత్తినప్పుడు.. దేశం వైపున నిలబడటం మన బాధ్యత. దేశానికి నా సేవ అవసరమైనప్పుడు, నేను ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాను.” అని ఆయన వెల్లడించారు.
READ MORE: Eatala Rajendar: తెలంగాణలో ప్రాజెక్టులు కట్టాలా వద్దా?.. సీఎం వ్యాఖ్యలపై ఈటల కౌంటర్
కాగా.. ఇటీవల శశి థరూర్ అనేక సందర్భాల్లో ప్రధాని మోడీని ప్రశంసించారు. ఎస్ జైశంకర్ను విదేశాంగ మంత్రిగా, అశ్విని వైష్ణవ్ను రైల్వే మంత్రిగా నియమించడం పట్ల కూడా ఆయన సంతోషం వ్యక్తం చేశారు. ఈ ఇద్దరు నాయకులను శశి థరూర్కు మంచి స్నేహితులుగా భావిస్తారు. థరూర్ ఎప్పటికప్పుడు ప్రధాని మోడీని, నిర్ణయాలను ప్రశంసిస్తున్నారు. దీంతో థరూర్ బీజేపీలోకి వెళ్తారనే వాదనలు వినిపించాయి.
తాజావార్తలు
-
Aasara Pensions: గుడ్న్యూస్.. తెలంగాణలో ఆసరా పింఛన్లపై బిగ్ అప్డేట్..
-
UP: యూపీలో భారీ తుపాను.. 11 మంది మృతి
-
CM Convoy: ‘నా కాన్వాయ్లో వాహనాలను కుదించండి’.. ఆదేశాలు జారీ చేసిన సీఎం చంద్రబాబు..
-
CBI Director: సీబీఐ డైరెక్టర్ ఎంపికపై కేంద్రం కీలక నిర్ణయం.. మళ్లీ లక్కీ ఛాన్స్ ఆయనకే
-
Pakistan: ‘‘భారత్, ఆఫ్ఘనిస్తాన్ ఒకటే’’.. పాక్ రక్షణ మంత్రి రెచ్చగొట్టే వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Gold Import Duty: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!