Kottu Satyanarayana: చంద్రబాబు 2014లో ప్రజలను మభ్యపెట్టి గెలిచాడు
Kottu Satyanarayana Fires On Chandrababu Naidu: చంద్రబాబు ఆల్ ఫ్రీ బాబు అని.. 2014 ఎన్నికల్లో ప్రజలను మభ్యపెట్టి గెలిచాడని మంత్రి కొట్టు సత్యనారాయణ ధ్వజమెత్తారు. మేనిఫెస్టో అంటే భగవద్గీత, ఖురాన్, బైబిల్ అని.. కానీ చంద్రబాబు 2014లో అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే మేనిఫెస్టోని డిలీట్ చేయించాడని ఆరోపించారు. పవన్ కూడా ఆంధ్ర రాష్ట్రం మరో శ్రీలంక, పాకిస్తాన్ అవుతుందని.. అప్పులతో రాష్ట్ర ప్రజల్ని జగన్ సోమరిపోతులను చేస్తున్నాడంటూ దిగజారి మాట్లాడుతున్నాడని మండిపడ్డారు. ఎన్నికల సమయంలో తాము కాపు నేస్తం ఇస్తామని చెప్పలేదని.. అయినా కాపులకు న్యాయం చేశామని అన్నారు. అందుకు కాపులందరూ ప్రభుత్వంపై సంతృప్తిగా ఉన్నారని తెలిపారు.
Margani Bharath: ఒడిశా రైలు ప్రమాదంపై సమగ్ర దర్యాప్తు జరిపించాలి
Also Read
- Sajjala Ramakrishna Reddy: ఓట్లు తొలగింపుపై జాగ్రత్త.. వైసీపీ నేతలకు సజ్జల కీలక సూచనలు..
- AP 10th Results: వాహ్!! మీరు సూపర్.. ఒకేసారి పదో తరగతి పాసైన తల్లి కొడుకులు..
- AP Cabinet Key Decisions: ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు..
- AP SSC Results 2026: టెన్త్ ఫలితాల్లో సత్తా చాటిన ఎంజేపీ బీసీ గురుకులాలు.. 96.02 శాతం ఉత్తీర్ణత..
హరిరామ జోగయ్య పుస్తకంలో వంగవీటి మోహన్ రంగ హత్య కేసులో ప్రథమ ముద్దాయి ఎవరని రాశారు? ప్రభుత్వ పాలనపై కూడా ఏమి రాస్తాడో రాయనివ్వండని మంత్రి కొట్టు సత్యనారాయణ తెలిపారు. ముందస్తు ఎన్నికలకు తమ ప్రభుత్వం వెళ్లదని స్పష్టం చేశారు. ఈసారి చంద్రబాబు ఎన్ని వేషాలు వేసినా ఎన్నికల్లో గెలవడని తేల్చి చెప్పారు. పవన్ కళ్యాణ్ కేవలం షెడ్యూల్ గ్యాప్లో వస్తాడని, ఆ తర్వాత సినిమాలు చేసుకుంటూ హ్యాపీగా ఉంటాడని పేర్కొన్నారు. మూడు రాజధానులను అభివృద్ధి చేయడమే తమ వైసీపీ ప్రభుత్వ ధ్యేయమని అన్నారు. ముందే అభివృద్ధి చెందిన వైజాగ్ని రూ.5 వేల కోట్లతో రాజధానిగా అభివృద్ధి చేయొచ్చని అన్నారు. అమరావతి తాత్కాలికమేనని.. మూడు రాజధానులు అభివృద్ధి చెందితే హైదరాబాద్, ముంబైల తలదన్నెలా ఉంటాయని చెప్పుకొచ్చారు.
Rahul Ramakrishna: రైలు ప్రమాదం.. కామెడీ చేసిన ‘అర్జున్ రెడ్డి’ కమెడియన్
అంతకుముందు కూడా.. చంద్రబాబుకు ‘ఎన్టీఆర్ హంతక’ బిరుదు ఇవ్వాలని మంత్రి కొట్టు సత్యనారాయణ విరుచుకుపడ్డారు. కేవలం ఓట్ల కోసమే చంద్రబాబు మళ్లీ ఎన్టీఆర్ జపం చేస్తున్నారని, ఆయనకు ‘భారతరత్న’’ ఇవ్వాలని దొంగ నాటకాలు ఆడుతున్నారని ఫైర్ అయ్యారు. చంద్రబాబు స్వార్థపూరిత రాజకీయాలకు ఇది నిదర్శనమని చెప్పారు. ఎన్టీఆర్ పేరునే నిర్మూలించాలని చంద్రబాబు దుర్మార్గపు ఆలోచన చేసిన విషయం రాష్ట్ర ప్రజలందరికీ తెలుసన్నారు. ఇప్పుడు ఎన్నికలొస్తున్నాయి కాబట్టే ఎన్టీఆర్ జపం చేస్తున్నారన్నారు. 14 ఏళ్లు సీఎంగా పనిచేసిన చంద్రబాబు.. ఏనాడైనా ఎన్టీఆర్కు ‘భారతరత్న’ ఇవ్వాలని కోరుతూ తీర్మానం చేశారా? అని ప్రశ్నించారు.
తాజావార్తలు
-
Aadhar Update Charges: ఆధార్ అప్డేట్ చేసుకోవాలా..? అయితే కొత్త ఛార్జీలపై ఓ లుక్కేయండి..
-
West Bengal Exit Poll 2026: బెంగాల్ లేటెస్ట్ ఎగ్జిట్ పోల్.. బీజేపీదే అధికారం..
-
Mangli: వివాదాల నడుమ మంగ్లీ కొత్త సాంగ్ రిలీజ్
-
IPL 2026 సీజన్లో 41 మ్యాచ్ల్లోనే 10 సార్లు 200+ రన్ ఛేజ్.. ఐపీఎల్ స్వరూపాన్నే మార్చేసిన ఒకే ఒక్క రూల్ ఇదే..
-
Sorakaya Paratha Recipe : మెత్తని సొరకాయ జొన్న పరాటాలు.. బరువు తగ్గాలనుకునే వారికి పర్ఫెక్ట్ హెల్తీ బ్రేక్ఫాస్ట్.!
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!