Kottu Satyanarayana: చంద్రబాబు 2014లో ప్రజలను మభ్యపెట్టి గెలిచాడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kottu Satyanarayana Fires On Chandrababu Naidu: చంద్రబాబు ఆల్ ఫ్రీ బాబు అని.. 2014 ఎన్నికల్లో ప్రజలను మభ్యపెట్టి గెలిచాడని మంత్రి కొట్టు సత్యనారాయణ ధ్వజమెత్తారు. మేనిఫెస్టో అంటే భగవద్గీత, ఖురాన్, బైబిల్ అని.. కానీ చంద్రబాబు 2014లో అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే మేనిఫెస్టోని డిలీట్ చేయించాడని ఆరోపించారు. పవన్ కూడా ఆంధ్ర రాష్ట్రం మరో శ్రీలంక, పాకిస్తాన్ అవుతుందని.. అప్పులతో రాష్ట్ర ప్రజల్ని జగన్ సోమరిపోతులను చేస్తున్నాడంటూ దిగజారి మాట్లాడుతున్నాడని మండిపడ్డారు. ఎన్నికల సమయంలో తాము కాపు నేస్తం ఇస్తామని చెప్పలేదని.. అయినా కాపులకు న్యాయం చేశామని అన్నారు. అందుకు కాపులందరూ ప్రభుత్వంపై సంతృప్తిగా ఉన్నారని తెలిపారు.
Margani Bharath: ఒడిశా రైలు ప్రమాదంపై సమగ్ర దర్యాప్తు జరిపించాలి
Also Read
- AP Weather Alert : ఏపీలో నిప్పుల కుంపటి.. 8 జిల్లాలకు 'రెడ్ అలర్ట్' జారీ!.
- Rajya Sabha 2026: రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ విడుదల.. ఆంధ్రప్రదేశ్ లో నాలుగు స్థానాలు
- Off The Record : కోనసీమ జిల్లా వైసీపీలో అసంతృప్తి రాగాలు
- Andhra Pradesh : ఏపీకి కేంద్రం భారీ నజరానా.. రూ.1,990 కోట్ల అర్బన్ చాలెంజ్ ఫండ్ ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్.!
హరిరామ జోగయ్య పుస్తకంలో వంగవీటి మోహన్ రంగ హత్య కేసులో ప్రథమ ముద్దాయి ఎవరని రాశారు? ప్రభుత్వ పాలనపై కూడా ఏమి రాస్తాడో రాయనివ్వండని మంత్రి కొట్టు సత్యనారాయణ తెలిపారు. ముందస్తు ఎన్నికలకు తమ ప్రభుత్వం వెళ్లదని స్పష్టం చేశారు. ఈసారి చంద్రబాబు ఎన్ని వేషాలు వేసినా ఎన్నికల్లో గెలవడని తేల్చి చెప్పారు. పవన్ కళ్యాణ్ కేవలం షెడ్యూల్ గ్యాప్లో వస్తాడని, ఆ తర్వాత సినిమాలు చేసుకుంటూ హ్యాపీగా ఉంటాడని పేర్కొన్నారు. మూడు రాజధానులను అభివృద్ధి చేయడమే తమ వైసీపీ ప్రభుత్వ ధ్యేయమని అన్నారు. ముందే అభివృద్ధి చెందిన వైజాగ్ని రూ.5 వేల కోట్లతో రాజధానిగా అభివృద్ధి చేయొచ్చని అన్నారు. అమరావతి తాత్కాలికమేనని.. మూడు రాజధానులు అభివృద్ధి చెందితే హైదరాబాద్, ముంబైల తలదన్నెలా ఉంటాయని చెప్పుకొచ్చారు.
Rahul Ramakrishna: రైలు ప్రమాదం.. కామెడీ చేసిన ‘అర్జున్ రెడ్డి’ కమెడియన్
అంతకుముందు కూడా.. చంద్రబాబుకు ‘ఎన్టీఆర్ హంతక’ బిరుదు ఇవ్వాలని మంత్రి కొట్టు సత్యనారాయణ విరుచుకుపడ్డారు. కేవలం ఓట్ల కోసమే చంద్రబాబు మళ్లీ ఎన్టీఆర్ జపం చేస్తున్నారని, ఆయనకు ‘భారతరత్న’’ ఇవ్వాలని దొంగ నాటకాలు ఆడుతున్నారని ఫైర్ అయ్యారు. చంద్రబాబు స్వార్థపూరిత రాజకీయాలకు ఇది నిదర్శనమని చెప్పారు. ఎన్టీఆర్ పేరునే నిర్మూలించాలని చంద్రబాబు దుర్మార్గపు ఆలోచన చేసిన విషయం రాష్ట్ర ప్రజలందరికీ తెలుసన్నారు. ఇప్పుడు ఎన్నికలొస్తున్నాయి కాబట్టే ఎన్టీఆర్ జపం చేస్తున్నారన్నారు. 14 ఏళ్లు సీఎంగా పనిచేసిన చంద్రబాబు.. ఏనాడైనా ఎన్టీఆర్కు ‘భారతరత్న’ ఇవ్వాలని కోరుతూ తీర్మానం చేశారా? అని ప్రశ్నించారు.
తాజావార్తలు
-
Shocking: అది ఆహారం కాదు ఆత్మహత్య.. ప్లేట్లో విషాన్ని పెట్టుకుని తింటున్న హైదరాబాద్ యువత.. వెలుగులోకి షాకింగ్ నిజాలు..
-
Protein Food : అమ్మ జ్ఞాపకం.. కేవలం 5 నిమిషాల్లో తయారయ్యే రుచికరమైన లావోటియన్ ‘ఎగ్ హాష్’!
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
Modi-Suvendu: మోడీతో బెంగాల్ సీఎం భేటీ.. 45 నిమిషాలు సాగిన సమావేశం
-
Twisha Sharma: ట్విషా శర్మ మృతి కేసులో కోర్టులో లొంగిపోయిన భర్త సమర్థ్ సింగ్
ట్రెండింగ్
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!