Margani Bharath: ఒడిశా రైలు ప్రమాదంపై సమగ్ర దర్యాప్తు జరిపించాలి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MP Margani Bharath Demands Investigation On Odisha Train Accident: ఒడిశా రైలు ప్రమాదంపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ డిమాండ్ చేశారు. ప్రస్తుతం ఆధునిక సాంకేతికత కాలంలో.. సిగ్నల్ వ్యవస్థ దెబ్బతిని, ఘోరమైన రైలు ప్రమాదం జరగడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం.. ఈ రైలు ప్రమాదంపై రాజమండ్రి రైల్వే స్టేషన్ను పరిశీలించి, ప్రమాదంలో చిక్కుకున్న రాజమండ్రి ప్రయాణికుల గురించి ఆరా తీశారు. రైల్వే అధికారులతో ప్రమాదంపై సమీక్షించారు. రాజమండ్రికి చెందిన 26 మంది ప్రయాణికుల్లో 12 మంది సెల్ఫోన్లు రెస్పాన్స్ కావడం లేదు. ఇప్పటికే ఈ ప్రమాదంపై సీఎం జగన్ స్పందించి.. ప్రత్యేకంగా అంబులెన్స్లు పంపారని, మోనటరింగ్, సహాయక చర్యల కోసం ప్రత్యేక అధికారులను నియమించారు.
David Warner: ఇది హాస్యాస్పాదం.. ఆస్ట్రేలియా బోర్డుపై వార్నర్ ఫైర్
Also Read
- Rain Alert: ఏపీలో భారీ వర్ష సూచన.. ఆ జిల్లాల్లో మూడు రోజుల పాటు వర్షాలు..
- Covid Cases In AP: ఏపీలో ఆగని కరోనా కేసులు.. బాపట్లలో ఒకరికి కరోనా పాజిటివ్..
- CM Chandrababu: ఆర్టీజీఎస్ కేంద్రంలో సీఎం చంద్రబాబు సమీక్ష.. సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల ప్రైవేటీకరణపై కీలక నిర్ణయం..
- AP Govt: కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ ప్రభుత్వం.. ఆగస్టు 1 నుంచి ప్రారంభం..
ఇదిలావుండగా.. శుక్రవారం సాయంత్రం ఒడిశాలోని బాలాసోర్లో మూడు రైళ్లు ఢీకొనడానికి కారణం, రైలు ట్రాఫిక్ను ట్రాక్ చేసే భారతీయ రైల్వే వ్యవస్థ తప్పిదమేనని ప్రాథమిక విచారణలో తేలింది. ఈ ఘటనలో 288 మందికిపైగా మృతి చెందరగా.. 1000 మందికి పైగా గాయపడ్డారు. రైలు నంబర్ 12841 కోరమండల్ ఎక్స్ప్రెస్కు అప్మెయిన్ లైన్ కోసం సిగ్నల్ ఇవ్వగా.. అది లూప్ లైన్లోకి ప్రవేశించింది. అప్పటికే ఆ లైన్లో ఉన్న గూడ్స్ రైలుని డీకొని, పట్టాలు తప్పడంతో ఈ ఘోరం చోటు చేసుకుంది. కోరమండల్ రైలులో 19 బోగీలు పట్టాలు తప్పాయి. సంఘటనా స్థలాన్ని ప్రధాని నరేంద్ర మోడీ పరిశీలించి, సహాయక చర్యలపై ఆరా తీశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. మరోవైపు.. ఈ రైలులో మొత్తం 178 మంది తెలుగువారు ప్రయాణించారని తెలిసింది. వారిలో మృతులు, గాయపడ్డవారు, మిస్సింగ్ వివరాల సమాచారాల్ని అధికారులు సేకరిస్తున్నారు.
Khiladi Lady: కి‘లేడీ’.. అధిక వడ్డీ ఆశ చూపి రూ.41 లక్షలు స్వాహా
తాజావార్తలు
-
Rain Alert: ఏపీలో భారీ వర్ష సూచన.. ఆ జిల్లాల్లో మూడు రోజుల పాటు వర్షాలు..
-
Monalisa: ‘నా జీవితం ప్రమాదంలో ఉంది’.. కుంభమేళా ఫేమ్ మోనాలిసా!
-
Covid Cases In AP: ఏపీలో ఆగని కరోనా కేసులు.. బాపట్లలో ఒకరికి కరోనా పాజిటివ్..
-
NBK సినిమాలో ఐశ్వర్య రాజేశ్? ఇప్పటి వరకు చేయని పాత్రలో క్రేజీ బ్యూటీ!
-
Tollywood : ఏం నమ్మి బడ్జెట్ పెడుతున్నారు ?
ట్రెండింగ్
-
SAIL Recruitment: పరీక్ష లేకుండానే 1,110 అప్రెంటిస్ పోస్టులు.. దరఖాస్తు ఎక్కడ చేసుకోవాలంటే.?
-
Ferrari Amalfi Spider: ఫెరారీ కొత్త కన్వర్టిబుల్ సూపర్కార్ లాంచ్.. ధర ఎంతంటే?
-
Rohit Sharma: మజా ఉండదు కదా.. రిటైర్మెంట్ వార్తలపై తొలిసారి స్పందించిన రోహిత్ శర్మ!
-
Mahindra New SUV: ఆగస్టు 15న మహీంద్రా నుంచి కొత్త SUV.. స్కార్పియో N ఫేస్లిఫ్ట్ ఎంట్రీ ఖాయమేనా?
-
Paneer Tikka Recipe: ప్రోటీన్ రిచ్ ఫుడ్.. టేస్టీ “పన్నీర్ టిక్కా”ను ఇంట్లో సులువుగా చేసేయండి ఇలా.!