Kodali Nani: చంద్రబాబు, రజనీకాంత్లకు భవిష్యత్తు లేదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kodali Nani Again Fires On Chandrababu Naidu Rajinikanth: ఏపీ మాజీ మంత్రి, ఎమ్మెల్యే కొడాలి నాని మరోసారి టీడీపీ అధినేత చంద్రబాబు, సూపర్స్టార్ రజినీకాంత్లపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ ఇద్దరికీ భవిష్యత్ లేదని పేర్కొన్నారు. మంగళవారం చంద్రబాబు హైదరాబాద్ ఆసుపత్రిలో ఉంటే.. రజినీకాంత్ చెన్నై హాస్పిటల్లో ఉంటాడని అన్నారు. వారిద్దరికీ ఆసుపత్రుల చుట్టూ తిరగడంతోనే సరిపోతుందని వ్యాఖ్యానించారు. చంద్రబాబు ఒక ఎకరం ల్యాండు కొనుగోలు చేసి.. మంచి నీటి అవసరాలు తీర్చాడని చెప్తే, తాను వెళ్లిపోతానని సవాల్ విసిరారు. చంద్రబాబుకి, సీఎం జగన్కి.. నక్కకి, నాగలోకానికి ఉన్నంత తేడా ఉందని విమర్శించారు. 2300 మంది ఆర్టీసీ కుటుంబాలను చంద్రబాబు గాలికొదిలేసాడని ఆరోపణలు చేశారు. గుడివాడ ఆర్టీసీ డిపో ప్రారంభోత్సవంలో ఆయన పై విధంగా నిప్పులు చెరిగారు.
Perni Nani: ఈసారి కూడా గుడివాడలో కొడాలి నానిదే విజయం.. పేర్ని నాని జోస్యం
Also Read
- CM Chandrababu: సముద్రంలో గల్లంతైన ఏడుగురు మత్స్యకారుల్లో ఒకరు సేఫ్.. రంగంలోకి సీఎం చంద్రబాబు..!
- Eluru: తీవ్ర విషాదం.. రైలు ఢీకొని ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి!
- Sai Krishna Case Updates: సాయికృష్ణ కస్టోడియల్ డె*త్ కేసు.. సిట్ విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి
- Seven Fishermen Missing: విశాఖ తీరంలో ఉత్కంఠ.. సముద్రంలో గల్లంతైన ఏడుగురు మత్స్యకారుల కోసం కోస్ట్ గార్డ్ గాలింపు
అనంతరం కొడాలి నాని మాట్లాడుతూ.. తనది కూడా మోటారు ఫీల్డ్ అని, ముఫ్ఫై బస్సులు తనవి తిరిగేవని చెప్పారు. గుడివాడ ఆర్టీసీ బస్టాండు గురించి తనకు మంచి అవగాహన ఉందన్నారు. పులివెందుల తరువాత రూ.20 కోట్లతో నిర్మాణం చేస్తున్నది గుడివాడ బస్టాండేనని తెలిపారు. చంద్రబాబు, లోకేష్ ఎందుకు కట్టలేదని ప్రశ్నిస్తే.. వాళ్లు ఏం మాట్లాడరని ఆగ్రహం వ్యక్తం చేశారు. గుడివాడ ప్రజల దాహార్తి తీర్చిన మహానుభావుడు రాజశేఖరరెడ్డి అని.. ఫ్లైఓవర్ కట్టిన మహానుభావుడు ఎన్టీఆర్ అని చెప్పుకొచ్చారు. చంద్రబాబు 14 సంవత్సరాలు అధికారంలో ఉండి కూడా ఏం చేయలేదని ఫైర్ అయ్యారు. గుడివాడలో చక్రాలు, బొంగరాలు 14 ఏళ్ళు తిప్పిన చంద్రబాబు.. ఏం చేయలేకపోయాడని ఎద్దేవా చేశారు. అయినా మొన్న సిగ్గులేకుండా చంద్రబాబు మాట్లాడాడని ధ్వజమెత్తారు. రాజశేఖరరెడ్డి ఇచ్చిన స్థలంలోనే టిడ్కో ఇళ్ళు కట్టించామని కొడాలి నాని అన్నారు. ఎవడో వచ్చాడు.. ఏదో చేస్తాడు.. అనేది ఎప్పుడూ జరుగుతూనే ఉంటున్నారు. ఎవడూ ఏకగ్రీవంగా గెలవడన్న కొడాలి నాని.. మంత్రిగా చేసినా, ఐదోసారి ఎమ్మెల్యేగా గెలిచినా.. తన పేరు చరిత్రలో నిలిచిపోతుందని ఉద్ఘాటించారు.
Lightning Strike: మొబైల్ ఫోన్ మాట్లాడుతుండగా పిడుగుపాటు.. రైతు మృతి
కాగా.. అంతకుముందు ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల్లో సూపర్ స్టార్ రజనీకాంత్ చేసిన వ్యాఖ్యలపై కొడాలి నాని నిప్పులు చెరిగిన విషయం తెలిసిందే! రజనీకాంత్ సిగ్గు శరం లేకుండా చంద్రబాబును పొగుడుతున్నారని, పవన్ కళ్యాణ్ను బ్లాక్ మెయిల్ చేసేందుకే రజనీని చంద్రబాబు రంగంలోకి దింపారని ఆరోపించారు. ఇప్పటికైనా చంద్రబాబు రాజకీయాలను పవన్ కల్యాణ్ తెలుసుకోవాలని హితవు పలికారు. ఎన్టీఆర్పై చెప్పులు విసురుతున్న సమయంలో.. వైస్రాయ్ హోటల్లో చంద్రబాబుకు రజనీ మద్దతు తెలిపారన్నారు. మూడు రోజులు షూటింగ్లో పాల్గొని, నాలుగు రోజులు హాస్పిటల్లో ఉండే రజనీకాంత్ తెలుగు ప్రజలకేం చెప్తారని ప్రశ్నించారు. ఎవడో రాసిచ్చిన స్క్రిప్ట్ను చదువుతూ రజనీకాంత్ మరింత దిగజారుతున్నారని, ఏపీ రాజకీయాలపై అవగాహన లేకుండా మాట్లాడారని అన్నారు.
తాజావార్తలు
-
Deewana OTT Deal: కంటెంట్పై నమ్మకం.. నిర్మాతలకు రూ.7 కోట్ల జాక్పాట్!
-
Nandamuri Mokshagna Debut: మోక్షజ్ఞ కోసం రంగంలోకి మాస్ డైరెక్టర్! బాలయ్య ప్లాన్ మామూలుగా లేదుగా..
-
Kiran Abbavaram: థియేటర్ల నుంచి బయటకొచ్చాక నెలల తరబడి గుర్తుంటుంది.. ‘చెన్నై లవ్ స్టోరీ’పై కిరణ్ అబ్బవరం ప్రామిస్!
-
CM Chandrababu: సముద్రంలో గల్లంతైన ఏడుగురు మత్స్యకారుల్లో ఒకరు సేఫ్.. రంగంలోకి సీఎం చంద్రబాబు..!
-
Vaibhav Sooryavanshi: ‘మీ ప్రేమ ఎప్పటికీ మర్చిపోను’.. తొలి మ్యాచ్ తర్వాత వైభవ్ ఎమోషనల్ సందేశం..
ట్రెండింగ్
-
Rainy Season Tips : వర్షాకాలంలో ఆకుకూరలు తింటున్నారా? ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే.!
-
Rainy Season Tips : వర్షాకాలంలో తేమతో సరుకులు పాడవ్వకుండా ఇలా కాపాడుకోండి.!
-
పైరసీ సినిమాలు, ఓటీటీ కంటెంట్పై ‘Telegram’కు కేంద్రం నోటీసు జారీ.. 3,142 పైరసీ ఛానళ్ల గుర్తింపు.!
-
IND Playing XI: సంజు శాంసన్, తిలక్ అవుట్ ఆఫ్ ఫామ్.. ‘వైభవ్’ అరగ్రేటం.? రెండో టీ20 భారత్ ప్లేయింగ్ XI ఇదే.!
-
England Players: ఇంగ్లండ్ ఆటగాళ్లకు ‘వయాగ్రా’ అనుమతి.. అసలు కారణం ఇదే!