Andhra Pradesh: ఏపీలో మరో ఉద్దానం.. కిడ్నీ వ్యాధితో 35మందికి పైగా మృత్యువాత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Andhra Pradesh: శ్రీకాకుళం జిల్లాలోని ఉద్దానం తరహాలో ఏపీలో మరో ప్రాంతంలోని ప్రజలు కిడ్నీ వ్యాధితో అల్లాడిపోతున్నారు. ఎన్టీఆర్ జిల్లా ఎ.కొండూరు మండల వాసులు కిడ్నీ వ్యాధి బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటివరకు కిడ్నీ వ్యాధితో 35 మందికి పైగా మరణించినట్లు తెలుస్తోంది. ఒక్క ఈ నెలలోనే ఆరుగురు మృత్యువాత పడ్డారు. చీమలపాడు, దీప్లానగర్, చైతన్య నగర్, మాన్ సింగ్ తండా, రేపూడి తండా, కంభంపాడు, లక్ష్మీపురం, పెద్దతండా సహా 15 గిరిజన గ్రామాల్లో పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది. ఈ గ్రామాల్లో దాదాపు ప్రతి ఇంట్లో కిడ్నీ బాధితులు ఉన్నారని స్థానిక అధికారులు చెప్తున్నారు. దీంతో భూములు అమ్ముకుని వైద్యం చేయించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని వాపోతున్నారు.
ఎ.కొండూరు మండలంలోని పలు గ్రామాల్లో ప్రజలు కిడ్నీ వ్యాధి బారిన పడేందుకు తాగునీరే కారణమని స్థానికులు ఆరోపిస్తు్న్నారు. ఇక్కడి తాగునీటిలో అధికంగా ఫ్లోరైడ్, సిలికాన్ ఉంటున్నాయని.. ఈ నీటిని తాగడానికి, వంటకు ఉపయోగించడంతో కిడ్నీ సంబంధిత వ్యాధులు సంక్రమిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తు్న్నారు. గత ప్రభుత్వ హయాంలో ట్యాంకర్లతో తాగునీరు సరఫరా చేసేవాళ్లు అని.. కానీ ఇప్పుడు ట్యాంకర్లతో నీటి సరఫరా నిలిచిపోయిందని.. ఆర్వో ప్లాంట్ల నిర్వహణ కూడా సరిగ్గా లేకపోవడంతో ప్రజలు కిడ్నీ వ్యాధి బారిన పడుతున్నారు. తమకు తాగునీటి కోసం కృష్ణా జలాలు పంపిణీ చేయాలని ప్రజలు కోరుతున్నారు. ఎ.కొండూరు మండలంలోని పలు గ్రామాలకు తాగునీటి కోసం కృష్ణా జలాలను అందించే ప్రాజెక్టుకు రూ.38 కోట్లతో అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేసినా ప్రభుత్వం ఆమోదించలేదు. దీంతో చాలా మంది గ్రామాలను ఖాళీ చేసి ఇతర ప్రాంతాలకు వలసపోతున్నారు.
Also Read
- AP IAS Transfers 2026: 22 మంది IAS అధికారుల బదిలీలు.. కీలక శాఖల్లో మార్పులు.. ఆమ్రపాలికి నో పోస్టింగ్..
- Medico Priyanka: మెడికో ప్రియాంక పరిస్థితి విషమం.. మద్యం మత్తులో కారుతో తొక్కించిన ఉన్మాదులు..
- OTR : టీడీపీ సీనియర్ నేత కళా వెంకట్రావుకు గడ్డుకాలమా? పార్టీలో తగ్గిన ప్రాధాన్యతపై చర్చ
- OTR : మంత్రి పార్థసారధిపై మైనింగ్ ఆరోపణలు.. నూజువీడులో రాజకీయ రగడ
Read Also: Party Funds: గుప్త విరాళాల్లో వైసీపీ టాప్.. పార్టీల విరాళాలను వెల్లడించిన ఏడీఆర్
అటు గత ప్రభుత్వ హయాంలో కిడ్నీ బాధితులు చనిపోతే రూ.10వేలు పరిహారం ఇచ్చేవాళ్లు అని.. కానీ ఇప్పుడు వాటిని ఆపేశారని.. డయాలసిస్ చేయించుకున్న వారికి మాత్రం రూ.10వేల పరిహారం కొనసాగుతోందని స్థానికులు వివరించారు. అటు కిడ్నీ బాధితులకు గతంలో ఫించన్ ఇచ్చే వాళ్లు అని.. ఇప్పుడు బాధితులు పెరిగినా కొత్త వారికి ఫించన్ ఇవ్వడం లేదని వాపోతున్నారు. కాగా ఎ.కొండూరులో డయాలసిస్ యూనిట్ ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన చాలాకాలంగా ఉందని.. కనీసం కిడ్నీవేర్ సెంటర్నైనా ఏర్పాటు చేయాలని.. నెప్రాలజిస్ట్, ఇద్దరు జనరల్ ఫిజిషియన్లను కేటాయించాలని బాధితులు కోరుతున్నారు.
తాజావార్తలు
-
IND Vs SL Test Free Entry: భారత్ – శ్రీలంక టెస్టు సిరీస్కు ఉచిత ప్రవేశం.. ఎవరైనా వెళ్లి చూడొచ్చు..
-
Story Board: కమ్మేస్తున్న డ్రగ్స్ భూతం.. మన విద్యార్థుల్ని డ్రగ్స్ నుంచి ఎలా కాపాడుకోవాలి..?
-
Off The Record: సీఎం సొంత జిల్లాలో టీడీపీకి ఏమైంది? ఎమ్మెల్యేల తీరుపై చర్చ
-
Bengaluru: కుళ్లిన మాంసం, పాడైన కూరగాయలు..5-స్టార్ హోటళ్లలో కూడా అదే కంపు..
-
Dhurandhar : నెట్ఫ్లిక్స్లో ‘ధురంధర్’ ప్రపంచ రికార్డు..
ట్రెండింగ్
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్తో REDMI 17 5G లాంచ్..!
-
Will Jacks: సూపర్మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్కు గుడ్బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!