Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Andhra Pradesh News Kidney Disease Patients Are Increased In Ntr District

Andhra Pradesh: ఏపీలో మరో ఉద్దానం.. కిడ్నీ వ్యాధితో 35మందికి పైగా మృత్యువాత

Published Date :August 27, 2022 , 8:36 am
By Ramesh Nalam
Andhra Pradesh: ఏపీలో మరో ఉద్దానం.. కిడ్నీ వ్యాధితో 35మందికి పైగా మృత్యువాత
  • Follow Us :
  • google news
  • dailyhunt

Andhra Pradesh: శ్రీకాకుళం జిల్లాలోని ఉద్దానం తరహాలో ఏపీలో మరో ప్రాంతంలోని ప్రజలు కిడ్నీ వ్యాధితో అల్లాడిపోతున్నారు. ఎన్టీఆర్ జిల్లా ఎ.కొండూరు మండల వాసులు కిడ్నీ వ్యాధి బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటివరకు కిడ్నీ వ్యాధితో 35 మందికి పైగా మరణించినట్లు తెలుస్తోంది. ఒక్క ఈ నెలలోనే ఆరుగురు మృత్యువాత పడ్డారు. చీమలపాడు, దీప్లానగర్, చైతన్య నగర్, మాన్ సింగ్ తండా, రేపూడి తండా, కంభంపాడు, లక్ష్మీపురం, పెద్దతండా సహా 15 గిరిజన గ్రామాల్లో పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది. ఈ గ్రామాల్లో దాదాపు ప్రతి ఇంట్లో కిడ్నీ బాధితులు ఉన్నారని స్థానిక అధికారులు చెప్తున్నారు. దీంతో భూములు అమ్ముకుని వైద్యం చేయించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని వాపోతున్నారు.

ఎ.కొండూరు మండలంలోని పలు గ్రామాల్లో ప్రజలు కిడ్నీ వ్యాధి బారిన పడేందుకు తాగునీరే కారణమని స్థానికులు ఆరోపిస్తు్న్నారు. ఇక్కడి తాగునీటిలో అధికంగా ఫ్లోరైడ్, సిలికాన్ ఉంటున్నాయని.. ఈ నీటిని తాగడానికి, వంటకు ఉపయోగించడంతో కిడ్నీ సంబంధిత వ్యాధులు సంక్రమిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తు్న్నారు. గత ప్రభుత్వ హయాంలో ట్యాంకర్‌లతో తాగునీరు సరఫరా చేసేవాళ్లు అని.. కానీ ఇప్పుడు ట్యాంకర్లతో నీటి సరఫరా నిలిచిపోయిందని.. ఆర్వో ప్లాంట్ల నిర్వహణ కూడా సరిగ్గా లేకపోవడంతో ప్రజలు కిడ్నీ వ్యాధి బారిన పడుతున్నారు. తమకు తాగునీటి కోసం కృష్ణా జలాలు పంపిణీ చేయాలని ప్రజలు కోరుతున్నారు. ఎ.కొండూరు మండలంలోని పలు గ్రామాలకు తాగునీటి కోసం కృష్ణా జలాలను అందించే ప్రాజెక్టుకు రూ.38 కోట్లతో అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేసినా ప్రభుత్వం ఆమోదించలేదు. దీంతో చాలా మంది గ్రామాలను ఖాళీ చేసి ఇతర ప్రాంతాలకు వలసపోతున్నారు.

Also Read

  • AP Weather Alert: ఏపీలో విభిన్న వాతావరణం.. ఓ వైపు 45.8°C ఎండలు.. మరోవైపు పిడుగులు..
  • Sajjala Ramakrishna Reddy: ఓట్లు తొలగింపుపై జాగ్రత్త.. వైసీపీ నేతలకు సజ్జల కీలక సూచనలు..
  • AP 10th Results: వాహ్!! మీరు సూపర్.. ఒకేసారి పదో తరగతి పాసైన తల్లి కొడుకులు..
  • AP Cabinet Key Decisions: ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు..

Read Also: Party Funds: గుప్త విరాళాల్లో వైసీపీ టాప్.. పార్టీల విరాళాలను వెల్లడించిన ఏడీఆర్

అటు గత ప్రభుత్వ హయాంలో కిడ్నీ బాధితులు చనిపోతే రూ.10వేలు పరిహారం ఇచ్చేవాళ్లు అని.. కానీ ఇప్పుడు వాటిని ఆపేశారని.. డయాలసిస్ చేయించుకున్న వారికి మాత్రం రూ.10వేల పరిహారం కొనసాగుతోందని స్థానికులు వివరించారు. అటు కిడ్నీ బాధితులకు గతంలో ఫించన్ ఇచ్చే వాళ్లు అని.. ఇప్పుడు బాధితులు పెరిగినా కొత్త వారికి ఫించన్ ఇవ్వడం లేదని వాపోతున్నారు. కాగా ఎ.కొండూరులో డయాలసిస్ యూనిట్ ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన చాలాకాలంగా ఉందని.. కనీసం కిడ్నీవేర్ సెంటర్‌నైనా ఏర్పాటు చేయాలని.. నెప్రాలజిస్ట్, ఇద్దరు జనరల్ ఫిజిషియన్‌లను కేటాయించాలని బాధితులు కోరుతున్నారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • a.kondur mandal
  • Andhra Pradesh
  • kidney disease
  • ntr district
  • uddanam

తాజావార్తలు

  • OnePlus Realme Merger: విలీనం కానున్న వన్‌ప్లస్, రియల్‌మీ..!?

  • Muttiah Muralitharan: “ఐపీఎల్ అంటేనే వ్యాపారం.. క్రికెట్ ఎక్కడుంది?”.. SRH కోచ్ షాకింగ్ కామెంట్స్!

  • Silver Price: సిల్వర్ మార్కెట్ హీట్.. వెండి ధరల్లో అనూహ్య మార్పులు..

  • West Bengal: బెంగాల్‌లో తృణమూల్ హైడ్రామా.. స్ట్రాంగ్ రూం ముందు ఆందోళన..

  • Chips and Soft Drinks Side Effects : చిప్స్ తింటూ కూల్ డ్రింక్స్ తాగుతున్నారా? అయితే ఈ ప్రమాదాలు తప్పవు.!

ట్రెండింగ్‌

  • 3.4K డిస్‌ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!

  • స్టైలిష్ కలర్స్‌తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?

  • స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!

  • Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!

  • Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్‌ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions