Karumuri Nageswara Rao: చంద్రబాబు మేనిఫెస్టో టిష్యూ పేపర్ లాంటిది.. తుడుచుకోవటానికి తప్ప దేనికీ పనికిరాదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Karumuri Nageswara Rao Fires On Chandrababu Manifesto: ఇటీవల మహానాడు కార్యక్రమంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రకటించిన ఎన్నికల మేనిఫెస్టోపై ఏపీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ మేనిఫెస్టో ఒక టిష్యూ పేపర్ లాంటిదని.. తుడుచుకోవడానికి తప్ప దేనికీ పనికిరాదని విమర్శించారు. తాడేపల్లిలో ఆయన మాట్లాడుతూ.. వైఎస్ జగన్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసి నాలుగేళ్లు అవుతోందని అన్నారు. మొదటి కలెక్టర్ల మీటింగ్లోనే ప్రజలకు న్యాయం చేయాలని జగన్ చెప్పారని, కానీ చంద్రబాబు మాత్రం కేవలం పార్టీ వారికే పనులు చేయండని చెప్పారని.. ఇదే జగన్కి, చంద్రబాబుకి ఉన్న తేడా అని వివరించారు. జగన్ నిర్ణయం వల్ల.. కులం, మతం, పార్టీలతో పని లేకుండా సంక్షేమాన్ని అందించామని అన్నారు.
Vizag Job Scam: సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్లో భారీ మోసం.. ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులకు టోకరా
Also Read
- APL 2026: బోణీ కొట్టిన అమరావతి రాయల్స్.. 6 వికెట్ల తేడాతో విజయం
- Pawan Kalyan: ‘ఇది ఎవరి జాగీరు కాదు.. నా మాతృభూమి’.. మీ అయ్య జాగీరా అనొద్దా?
- Home Minister Anitha: విశాఖలో జగన్ పర్యటనపై హోంమంత్రి కౌంటర్.. మీకు ఆ హక్కు లేదు..!
- Amaravati Development: అమరావతికి కేంద్రం భారీ శుభవార్త.. రాజధాని రూపురేఖలు మారనున్నాయా..?
బీసీలకు చంద్రబాబు కేవలం రూ.35 వేల కోట్లే ఖర్చు చేశారని.. ఒక్క బీసీని కూడా రాజ్యసభకు పంపలేదని నాగేశ్వరరావు పేర్కొన్నారు. జగన్ సీఎం అయ్యాక 56 కార్పోరేషన్లు పెట్టి బీసీలను అభివృద్ధి చేస్తున్నారన్నారు. కానీ చంద్రబాబు మాత్రం తోకలు కత్తిరిస్తానని దూషిస్తారని మండిపడ్డారు. జగన్ అమలు చేస్తున్న పథకాల గురించి పేపర్ చూడకుండా చెప్తే.. పది లక్షలిస్తానని ఛాలెంజ్ చేశారు. టీడీపీ వారికి కూడా ఈ సవాల్ చేస్తున్నానని.. అధికారులు, విలేకర్లు సైతం ఈ ఛాలెంజ్ని స్వీకరించవచ్చని చెప్పారు. అధికారంలో ఉంటే దోచుకోవటం, దాచుకోవడమే చంద్రబాబు పని అని ఆరోపించారు. జగన్ హయాంలో ఫ్యామిలీ డాక్టర్ నుండి అనేక పథకాలు ప్రజల ముంగిటకే వచ్చాయన్నారు. ఒక మీడియాని అడ్డం పెట్టుకొని చంద్రబాబు మాయ చేయటం తప్ప మరేమైనా చేయగలిగాడా? అని ప్రశ్నించారు. చంద్రబాబు ముఖంలో ప్రేతకళ కనిపిస్తోందని వ్యాఖ్యానించారు.
Odisha: భార్యపై అనుమానం.. పసిబిడ్డకు పురుగుమందుతో ఇంజెక్షన్..
గతంలో ఇచ్చిన 650 వాగ్దానాలను ప్రజలకు కూడా కనపడకుండా చేసిన ఘనత చంద్రబాబుది అని మంత్రి నాగేశ్వరరావు దుయ్యబట్టారు. నెరవేర్చని హామీలను మళ్ళీ ప్రజల వద్దకు తెస్తున్నాడని పేర్కొన్నారు. ఈ నాలుగు సంవత్సరాలలో తాము చేసిన పథకాల గురించి తాము చెప్పగలమని చెప్పారు. అయితే.. తాము తెచ్చిన సంక్షేమ పథకాల వల్ల రాష్ట్రం శ్రీలంక అవుతుందని చంద్రబాబు గోల చేశాడని, మరి ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని చంద్రబాబు సంక్షేమ పథకాలను తెస్తానంటున్నారు? అని నిలదీశారు. ఈ డబ్బు ఎక్కడ నుండి తెస్తావ్? అని అడిగారు. మాయల ఫకీరులకే మార్తండ చంద్రబాబు అని కౌంటర్ వేశారు. అధికారంలో ఉన్నప్పుడు గుర్తురాని పేదలను ఇప్పుడు కోటేశ్వరులను చేస్తానంటూ చంద్రబాబు మోసం చేస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు.
తాజావార్తలు
-
2027 ODI World Cup: ఇక అంతా వారి చేతుల్లోనే.. 2027 వన్డే ప్రపంచకప్లో రో-కో ఆడతారా?
-
Lenovo IdeaPad Slim 3 Gen 11: లెనోవా ఐడియాప్యాడ్ స్లిమ్ 3 జెన్ 11 విడుదల.. FHD IR కెమెరా, Rapid Charge ఫీచర్స్ తో
-
Ram Charan : RC17 పై ‘పెద్ది’ ఎఫెక్ట్.. అందుకే చరణ్ గ్యాప్ ఇచ్చాడా?
-
Janhvi Kapoor : పెద్ది తర్వాత వాట్ నెక్ట్స్ జాన్వీ కపూర్..?
-
Patriotic Telugu Movies : ప్రభాస్ నుంచి ఎన్టీఆర్ వరకు… ‘దేశభక్తి’ టాలీవుడ్ హీరోల కొత్త ఆయుధం
ట్రెండింగ్
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్లైన్ మ్యాప్స్తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!