Kakani Govardhan Reddy: వాళ్లు ద్రోహం చేశారు.. అందుకే పార్టీ వారిని సస్పెండ్ చేసింది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kakani Govardhan Reddy Comments On Suspended MLAs: ఎమ్మెల్సీ ఎన్నికల్లో నెల్లూరు జిల్లాకు చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు తప్పుడు చేయడం వల్లే.. పార్టీ అధిష్టానం వారిని సస్పెండ్ చేసిందని మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి స్పష్టం చేశారు. జిల్లాలోని ఎమ్మెల్యేలందరూ జగన్ వల్లే గెలిచారన్న ఆయన.. జగన్ చెప్పిన వారికి ఓటు వేయకుండా వాళ్లు ద్రోహం చేశారని, ఇది క్షమించరాని నేరమని పేర్కొన్నారు. ఏమైనా సమస్యలు ఉంటే.. ముఖ్యమంత్రితో చర్చించాలే తప్ప, ఇలా విమర్శలు చేయడం ఏమాత్రం సరికాదన్నారు. ఎమ్మెల్యేలు అమ్ముడుపోయారని సజ్జల రామకృష్ణా రెడ్డి ప్రకటన చేశారు తప్ప.. ఆ ఎమ్మెల్యేల పేర్లను చెప్పలేదన్నారు. డబ్బులు తీసుకున్న వారే భుజాలు తడుముకుంటున్నారని ఎద్దేవా చేశారు. ఆ ఎమ్మెల్యేలను ప్రజలు చీదరించుకుంటున్నారని అన్నారు.
MLA Rapaka Varaprasad: టీడీపీ నాకు రూ.10 కోట్లు ఆఫర్ చేసింది.. ఎమ్మెల్యే రాపాక బాంబ్
Also Read
- Tirupati Crime News: తిరుపతిలో దారుణం.. బాలికపై బాబాయ్ అత్యాచారం!
- Off The Record : విచ్చలవిడిగా ఇసుక అక్రమాలు.. మైనింగ్ ఏడీ ఫణిభూషణ్ పై తీవ్ర ఆరోపణలు
- Off The Record : చీమకుర్తి గ్రానైట్ క్వారీల్లో అదృశ్య శక్తులు..? వైసీపీ ఎమ్మెల్యే క్వారీని టార్గెట్ చేశారా?
- YS Jagan : వైసీపీలోకి మోపిదేవి శ్రీనివాసరావు.. రేపల్లె బాధ్యత మనదే.. కార్యకర్తలే నా బలం
పట్టభద్రుల ఎన్నికలను ఎదుర్కోవడం.. వైసీపీకి ఇది మొదటిసారి అని మంత్రి కాకాణి వెల్లడించారు. ఈ ఎన్నికల ప్రక్రియ కొంత క్లిష్టంగా ఉంటుందని.. ఇందులో కొంత వెనుక బడ్డామని తెలిపారు. ప్రాధాన్యత క్రమంలోనే ఓటు వేయాలని, టీడీపీ కూడా రెండో ప్రాధాన్యత ఓటుతో గెలిచిందని చెప్పారు. టీడీపీకి ఓటు ఎవరు వేశారనేది అందరికీ తెలుసని.. వారి వైఖరే ఈ విషయాన్ని స్పష్టం చేస్తోందని అన్నారు. కొందరు మరుసటి రోజు అసెంబ్లీకి రాకుండా ముఖం చాటేశారన్నారు. ఎవరు పార్టీని వీడినా ఇబ్బంది లేదని.. పార్టీ పటిష్టంగానే ఉందని, కొత్త నేతలు చాలామంది ఉన్నారని పేర్కొన్నారు. సస్పెండ్ అయిన ఎమ్మెల్యేలు టీడీపీ నుంచి డబ్బులు తీసుకున్నారని నిర్దిష్టమైన ఆధారాలు పార్టీ అధిష్టానం వద్ద ఉన్నాయని, ఆ సాక్ష్యాలున్నాయి కాబట్టి వైసీపీ హైకమాండ్ వారిని సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకుందని చెప్పుకొచ్చారు.
Kakani Govardhan Reddy: చంద్రబాబుకు మంత్రి కాకాణి సవాల్.. చర్చకు సిద్ధమా?
అంతకుముందు కూడా.. సస్పెండ్ అయిన ఆ ఎమ్మెల్యేలు ఎవరికి ఓటు వేశామనే విషయంపై ఆత్మ పరిశీలన చేసుకోవాలని మంత్రి కాకాణి సూచించారు. పార్టీ కేడర్ మొత్తం తమవైపే ఉందన్న ఆయన.. నెల్లూరు జిల్లాలో పార్టీ ప్రక్షాళనపై దృష్టి సారిస్తామన్నారు. ఇష్టారీతిలో ఓటు వేస్తే కుదరదని, ప్రజల్లో మరింత బలహీన పడతారని అన్నారు. పార్టీకి వ్యతిరేకంగా ఓటువేసిన వారిని సస్పెండ్ చేసిన వెంటనే ప్రజలు సంబరాలు చేసుకున్నారన్నారు. నెల్లూరు జిల్లాలో ప్రజలు జగన్ వెంటే ఉన్నారన్నారు. 2024 ఎన్నికల్లో జగన్ మళ్లీ సీఎం అవుతారని ఆశాభావం వ్యక్తం చేశారు.
తాజావార్తలు
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
PBKS Captain Shreyas Iyer: చాలా బాధగా ఉంది.. మా విజయాన్ని ఆ ‘ఒక్కడు’ లాగేసుకున్నాడు!
-
Google Free Storage: గూగుల్ షాకింగ్ డెసిషన్.. ఫ్రీ స్టోరేజ్లో భారీ మార్పు.. కొత్త అకౌంట్లకు 5GB మాత్రమే!
-
Kerala: “ఇక కేరళలో చట్టాలను నిర్ణయించేది మేమే”.. ఊరేగింపులో రెచ్చిపోయిన ముస్లిం లీగ్ నేతలు..
-
RRB ALP Recruitment 2026: 11,127 అసిస్టెంట్ లోకో పైలట్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ రిలీజ్.. ఈ అర్హతలుండాలి
ట్రెండింగ్
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!
-
WhatsAppలో ‘Incognito AI Chat’.. యూజర్లకు మెటా బిగ్ అప్డేట్.!