Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Andhra Pradesh News Minister Kakani Govardhan Reddy Challenges Chandrababu Naidu

Kakani Govardhan Reddy: చంద్రబాబుకు మంత్రి కాకాణి సవాల్.. చర్చకు సిద్ధమా?

Published Date :March 26, 2023 , 4:49 pm
By NTV WebDesk
Kakani Govardhan Reddy: చంద్రబాబుకు మంత్రి కాకాణి సవాల్.. చర్చకు సిద్ధమా?
  • Follow Us :
  • google news
  • dailyhunt

Minister Kakani Govardhan Reddy Challenges Chandrababu Naidu: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి సవాల్ విసిరారు. సీఎం జగన్ హయాంలో రైతులకు ఇచ్చిన పరిహారంపై చర్చకు సిద్ధమా అని ఛాలెంజ్ చేశారు. రైతులకు పరిహారంపై టీడీపీ, పచ్చ మీడియా తప్పుడు ప్రచారం చేస్తున్నారని.. ఇది ఏమాత్రం సరికాదని హెచ్చరించారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిబంధనలకు అనుగుణంగానే ప్రభుత్వం ఉత్తర్వులు ఇస్తుందన్నారు. ఇదే విషయాన్ని తాము అసెంబ్లీలో కూడా స్పష్టం చేశామని, అప్పుడు అసెంబ్లీలో టీడీపీ నేతలు ఏమీ మాట్లాడలేదని అన్నారు. అయితే.. ఇప్పుడు అదే విషయాన్ని పచ్చ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. వర్షాలు పడిన వెంటనే సీఎం జగన్ అధికారులతో సమీక్షించి, రైతుల పట్ల ఉదారంగా వ్యవహరించాలని కోరారని మంత్రి కాకాణి తెలిపారు. ఈ-క్రాప్ నమోదు చేయని రైతులకు కూడా ఇన్‌పుట్ సబ్సిడీ ఇవ్వాలని ఆదేశించినట్టు గుర్తు చేశారు. అయితే.. పచ్చ మీడియా మాత్రం రెండు తెలుగు రాష్ట్రాల మధ్య విభేదాలు సృష్టించేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపణలు చేశారు. తెలంగాణ, ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వాలకు.. పరిస్థితులకు అనుగుణంగా ప్రాధాన్యాలు వేరుగా ఉంటాయని వివరించారు. తిత్లీ తుఫాన్ వచ్చినపుడు చంద్రబాబు పరిహారం ప్రకటించారే తప్ప.. డబ్బులు ఇవ్వలేదని పేర్కొన్నారు. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాతే పరిహారం ఇచ్చామని మంత్రి కాకాణి వెల్లడించారు.

Gudivada Amarnath: ఉండవల్లి కాదు, ఊసరవెల్లి శ్రీదేవి.. నటి శ్రీదేవి కంటే అద్భుతంగా నటిస్తున్నారు

Also Read

  • Seshachalam Forest : శేషాచలం అడవుల్లో కార్చిచ్చు.. జీవకోన ప్రాంతంలో ఎగిసిపడుతున్న మంటలు.!
  • Nadendla Manohar : డీజిల్ కొరతకు కారణం ఇదే.. రేపు ఉదయం కల్లా బంకులకు స్టాక్.. మంత్రి కీలక ప్రకటన..!
  • Vizag ROB Collapse: విశాఖలో ప్రమాదం.. కూలిన నిర్మాణంలో ఉన్న రైల్వే బ్రిడ్జి
  • CM Chandrabbau: రాష్ట్రంలో డీజిల్, పెట్రోల్ కొరత.. బంకుల మూసివేతపై సీఎం సమీక్ష!

అంతకుముందు.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్‌పై మంత్రి కాకాణి స్పందిస్తూ, సస్పెండ్ అయిన వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీ నుంచి కోట్లాది రూపాయలు తీసుకున్నారనే నిర్దిష్టమైన ఆధారాలు అధిష్టానం వద్ద ఉన్నాయని కుండబద్దలు కొట్టారు. ఆ సాక్ష్యాలు ఉన్నాయి కాబట్టే.. ఆ ఎమ్మెల్యేలు డబ్బులు తీసుకున్నారని సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యానించారని స్పష్టం చేశారు. పార్టీ నుంచి సస్పెండ్ అయిన ఆ ఎమ్మెల్యేలు ఎవరికి ఓటు వేశామనే విషయంపై ఆత్మ పరిశీలన చేసుకోవాలని సూచించారు. జిల్లాలో ముగ్గురు ఎమ్మెల్యేలు పార్టీని వీడినా.. ఎలాంటి ఇబ్బంది లేదన్నారు. పార్టీ కేడర్ మొత్తం తమవైపే ఉందని ధీమా వ్యక్తం చేశారు. జిల్లాలో పార్టీ ప్రక్షాళనపై దృష్టి సారిస్తామన్నారు. ఇష్టారీతిలో ఓటు వేసుకుంటామంటే కుదరదని.. ప్రజల్లో మరింత బలహీన పడతారని అన్నారు. పార్టీకి వ్యతిరేకంగా ఓటువేసిన వారిని సస్పెండ్ చేసిన వెంటనే ప్రజలు సంబరాలు చేసుకున్నారన్నారు. నెల్లూరు జిల్లాలో ప్రజలు జగన్ వెంటే ఉన్నారన్నారు. వచ్చే ఎన్నికల్లో ప్రజల ఆశీస్సులు ఎవరికుంటే వాళ్ళే అధికారంలోకి వస్తారన్న ఆయన.. 2024 ఎన్నికల్లో జగన్ మళ్లీ సీఎం అవుతారని ధీమా వ్యక్తం చేశారు.

Sayyesha Saigal: స్టార్ హీరో భార్యవి..ఒక బిడ్డ తల్లివి.. ఇలా ఐటెంసాంగ్ చేయడం ఏంటి అమ్మడు

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • 2024 AP Elections
  • Chandrababu Naidu
  • Farmers Compensation
  • Minister Kakani Govardhan Reddy
  • YS Jagan Mohan Reddy

తాజావార్తలు

  • Dhanush : వెంకీ అట్లూరితో ధనుష్ సినిమా.. ఓపెన్ ఆఫర్ ఇచ్చిన సార్

  • Stock Market: కోలుకున్న మార్కెట్.. భారీ లాభాల్లో సూచీలు

  • Dhanush: ఆ మాటలు అక్కర్లేదేమో!

  • BYD Unveils Denza Z: 2 సెకన్లలో 100 కి.మీ వేగం.. BYD Denza Z కన్వర్టిబుల్ ఆవిష్కరణ

  • Mojtaba Khamenei: ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ మోజ్తాబా కన్నుమూత! కుడ్యచిత్రం ఆవిష్కరణ

ట్రెండింగ్‌

  • Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్‌వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!

  • 7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!

  • 165Hz రిఫ్రెష్ రేట్‌, 12.3 అంగుళాల డిస్‌ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!

  • వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!

  • రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions