Malleshwari Case: పరాయి వ్యక్తితో ఎఫైర్ పెట్టుకుందని.. భర్త ఏం చేశాడంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Husband Killed His Wife Malleshwari For Having Affair With Fastfood Worker: రెండు వారాల నుంచి మిస్టరీగా మారిన ఓ కేసుని పోలీసులు ఎట్టకేలకు ఛేధించారు. పరాయి వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుందన్న అనుమానంతో.. మరో వ్యక్తి సహాయంతో స్వయంగా భర్తే ఆ మహిళని హతమార్చినట్టు పోలీసులు తేల్చారు. ఆ వివరాల్లోకి వెళ్తే.. గతంలో నాగబాబు, మల్లేశ్వరిలకు వేర్వేరుగా పెళ్లిళ్లు జరిగాయి. అయితే.. తమ భాగస్వామ్యులతో విభేదాలు ఏర్పడటంతో వాళ్లు విడాకులు తీసుకున్నారు. అనంతరం నాగబాబు, మల్లేశ్వరి దగ్గరయ్యారు. ఈ క్రమంలోనే వీరి మధ్య ప్రేమ చిగురించడంతో.. వీళ్లు సహజీవనం చేయడం మొదలుపెట్టారు. ఈ జంటకి రెండున్నరేళ్ల కుమార్తె కూడా ఉంది. కట్ చేస్తే.. గతంలో నాగబాబు అమలాపురంలో ఫాస్ట్ఫుడ్ సెంటర్ నిర్వహించినప్పుడు, అందులో పని చేసే వ్యక్తితో మల్లేశ్వరికి కూడా పరిచయం ఉండేది. వీళ్లిద్దరు స్నేహితుల్లాగే మెలిగే వారు. అయితే.. నాగబాబుకి మాత్రం మల్లేశ్వరిపై అనుమానం కలిగింది. ఆ వ్యక్తితో మరీ సన్నిహితంగా ఉండటంతో.. అతనితో వివాహేతర సంబంధం కొనసాగిస్తోందనే అనుమానం పెంచుకున్నాడు.
Manipur Violence: మణిపూర్లో ఆగని కాల్పుల మోత.. స్కూల్, ఇండ్లు దగ్ధం
Also Read
- Covid 19-AP: ఏపీలో అప్రమత్తం.. ప్రత్యేక కొవిడ్ వార్డు ఏర్పాటు!
- Story Board : ఇరాన్ యుద్ధం గల్ఫ్ కు చేసిన నష్టమేంటి..? దుబాయ్ గతానికి, ప్రస్తుతానికి తేడా ఏంటి..?
- YS Jagan : మహిళల భద్రత ఎక్కడ? చంద్రబాబుపై జగన్ తీవ్ర విమర్శలు
- CM Chandrababu : అమరావతి దేవతల రాజధాని.. నవ్యాంధ్రను నెంబర్ వన్ చేయడమే నా లక్ష్యం
ఇదిలావుండగా.. ఈ నెల 7వ తేదీ రాత్రి ఇంటి నుంచి వెళ్లిన మల్లేశ్వరి తిరిగి ఇంటికి రాకపోవడం, ఎక్కడా ఆచూకీ కనిపించకపోవడంతో.. ఆమె తండ్రి పోలీసులకు ఫిర్యాదు ఇచ్చాడు. మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఆమె కోసం గాలించడం మొదలుపెట్టారు. భర్త నాగబాబు కూడా పోలీసులతో కలిపి గాలించాడు. ఈ క్రమంలోనే 9వ తేదీన ఉదయం అమలాపురం బైపాస్ రోడ్డులో పంట కాలువ నీటి అంచున మల్లేశ్వరి మృతదేహం కనిపించింది. ఆమె మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించి, పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఎన్ని కోణాల్లో విచారించినా.. ఆమె మృతికి గల కారణాల్ని మాత్రం పోలీసులు తెలుసుకోలేకపోయారు. ఫైనల్గా పోస్టుమార్టం రిపోర్ట్లో ఆమెది హత్యేనని తేలడంతో.. పోలీసులు తమ విచారణని వేగవంతం చేశారు. భర్త పొంతనలేని సమాధానాలు ఇవ్వడంతో.. అతనిపై పోలీసులకు అనుమానం కలిగింది. దీంతో.. అతడ్ని అదుపులోకి తీసుకొని, తమదైన శైలిలో విచారించారు. అప్పుడు నాగబాబు అసలు నిజం కక్కాడు. తానే అనుమానంతో తన భార్యని హతమార్చినట్టు అంగీకరించాడు.
Health Tips : ఉసిరి పొడిని ఇలా తీసుకుంటే చాలు.. ఆ సమస్యలన్నీ మాయం..
మల్లేశ్వరి కనిపించకుపోయిన రోజే నాగబాబు ఆమెని హత్య చేసినట్టు తెలిపాడు. తాముంటున్న ఇంట్లోనే మల్లేశ్వరి మెడకు చీర బిగించి, ఆమెని హతమార్చాడు. అతనికి ఆ ఇంటి యాజమాని కుమారుడు కముజు నరసింహం కూడా సహకరించాడు. మల్లేశ్వరి చనిపోయాక.. ఆమె ఒంట్లో బాగోలేదని, ఆస్పత్రికి తీసుకువెళుతున్నామని ఇరుగుపొరుగు వారికి అబద్ధం చెప్పి.. మోటారు సైకిల్పై ఆమె మృతదేహాన్ని నాగబాబు, నరసింహం తీసుకువెళ్లారు. పంట కాలువ వద్దకు వెళ్లి మృతదేహాన్ని పడేశారు. కాలువ నుంచి సముద్రంలో కొట్టుకుపోతుందని వాళ్లు భావించారు కానీ, అది నీటి అంచునే ఆగిపోవడంతో వీరి బండారం బయటపడింది. పోలీసులు నిందితుల్ని అరెస్ట్ చేసి, కోర్టులో హాజరు పరిచారు. కోర్టు రిమాండ్ విధించడంతో వారిని సెంట్రల్ జైలుకు తరలించారు.
తాజావార్తలు
-
Rohit Sharma Retirement: నేటి మ్యాచ్కు రోహిత్ పేరెంట్స్.. హిట్మ్యాన్ రిటైర్మెంట్పై క్లారిటీ ఇదిగో..
-
Hyderabad: రైతుల దీక్షా శిబిరం తొలగించిన హైడ్రా.. బహదూర్గూడాలో హైటెన్షన్
-
Amarnath Yatra 2026: నేటి నుంచి అమర్నాథ్ యాత్ర తాత్కాలికంగా నిలిపివేత.. మళ్లీ ఎప్పుడంటే?
-
Rohit Sharma: టెన్షన్ అవసరం లేదు.. రోహిత్ శర్మ ఆడుతాడు: మోర్కెల్
-
Article 370: రెండు జాతీయ అవార్డులు గెలిచిన ‘ఆర్టికల్ 370’.. ఏ ఓటీటీలో చూడొచ్చో తెలుసా?
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!