Bapatla: అద్దంకి వైసీపీలో మారుతున్న పొలిటికల్ సీన్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాపట్ల జిల్లా అద్దంకిలో పొలిటికల్ సీన్ మారుతుంది. నియోజకవర్గంలో మొన్నటి వరకు ఒక లెక్క.. ఇప్పుడో లెక్క అన్నట్లు పరిస్థితులు మారిపోయాయి. పాత కొత్త ఇంఛార్జ్ లను సమన్వయం చేయకపోవడంతో అద్దంకి వైసీపీ వ్యవహారాలు ఎవరికి వారే.. యమునా తీరే అన్నట్లుగా మారిపోతున్నాయి. కొత్త ఇంఛార్జ్ వైసీపీ నేతలను కలిసేందుకు ఊరురా తిరుగుతూ ఉంటే.. పాత ఇంఛార్జ్ ఆ ఊరి నేతలతో కలిసి మీటింగ్ పెట్టి సమాలోచనలు చేయడం హాట్ టాపిక్ గా మారింది. అయితే ఇంఛార్జ్ మార్పు వైసీపీకి కలిసొస్తుందా..? కొండ నాలుకకు మందేస్తే.. ఉన్న నాలుక పోయింది అన్న చందంగా మారుతుందా..? అన్నది చర్చనీయాంశంగా మారింది.
Also Read
- Vinukonda: అత్యాచారం చేశాడంటూ ఫిర్యాదు.. పోలీస్ స్టేషన్ లో లొంగిపోయిన మాజీ సీఐ చినమల్లయ్య.!
- Tenali: మహిళ సెల్ఫీ సూసైడ్ కలకలం.. పోలీసుల వేధింపులే కారణమంటూ ఆవేదన.!
- Ambati Rambabu: పెట్రో ధరలపై రిక్షా తొక్కి అంబటి నిరసన.. రెడ్ బుక్ నా మీదే కాదు.. జనసేన వాళ్లపై కూడా అమలు..!
- Guntur Job Fraud: ఉద్యోగాల పేరుతో విద్యార్థులకు భారీ మోసం.. కోట్లు నొక్కేశాడు..
అద్దంకి నియోజకవర్గం ఇంఛార్జ్ గా పల్నాడు జిల్లా క్రోసూరు మండలం దొడ్లేరుకు చెందిన పాణెం హనిమిరెడ్డిని హైకమాండ్ నియమించింది. వైసీపీ కీలక నేత వైవీ సుబ్బారెడ్డి అండదండలతో ఇంఛార్జ్ గా అవకాశం దక్కించుకున్నారు. అద్దంకి నియోజకవర్గం ఇంఛార్జ్ గా హనిమిరెడ్డి బాధ్యతలు స్వీకరించిన వెంటనే.. అన్ని మండలాల్లో పర్యటిస్తున్నారు. మండలాల నేతలను కలుస్తూ పార్టీ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇక వైవీ సుబ్బారెడ్డి సోదరుడు వైవీ భద్రారెడ్డి హనిమిరెడ్డి వెన్నంటే చేదోడు వాదోడుగా ఉంటున్నారు. గతంలో ఇంఛార్జ్ గా ఉన్న కృష్ణచైతన్యకు ద్వితీయ శ్రేణి నేతలతో కొంత గ్యాప్ ఏర్పడటం.. కొందరు అసమ్మతి నేతలు అద్దంకి వైసీపీ పరిరక్షణ పేరిట ఇంఛార్జ్ కృష్ణచైతన్యకు వ్యతిరేకంగా పార్టీ కార్యక్రమాలు నిర్వహించడం.. చైతన్యకు వ్యతిరేకంగా తాడిపల్లి సెంట్రల్ ఆఫీస్ దగ్గర ఆందోళనలు చేశారు.
Chandrababu: వైసీపీ ఎమ్మెల్యేలపై పేరు పేరునా చంద్రబాబు ఘాటు విమర్శలు.. ఆ ఎమ్మెల్యేపై తప్ప..!
నియోజకవర్గంలో తన పట్టును పెంచుకోవడంతో పాటు పార్టీ బలాన్ని పెంచడంతో కృష్ణచైతన్య సక్సెస్ అయ్యారు. పార్టీ సర్వే ఫలితాలు కూడా కృష్ణచైతన్యకు జైకొట్టాయి. అయితే సామాజిక సమీకరణాలతో అనూహ్య పరిణామాలు జరిగాయి. దీంతో అదృష్టం హనిమిరెడ్డికి దక్కింది. సిట్టింగ్ టీడీపీ ఎమ్మెల్యే కమ్మ సామాజిక వర్గానికి చెందిన గొట్టిపాటి రవికుమార్ కు చెక్ పెట్టాలంటే.. రెడ్డి సామాజిక వర్గాన్ని తీసుకొచ్చారు. ఇతర సామాజిక వర్గాలను ఏకం చేసి కమ్మకు చెక్ పెట్టాలనే స్ట్రాటజీతో ఈ మార్పు జరిగిందని టాక్. అయితే ఈ పరిణామాలు మాజీ ఇంఛార్జ్ కృష్ణచైతన్యకు ఇబ్బందికరంగా మారాయి. నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి నాలుగున్నరేళ్లుగా ఎంతో కష్టపడి చేశానని అన్నారు. తనను హఠాత్తుగా తొలగించడంపై ఆవేదన వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు తనకు అవకాశమిస్తే కచ్చితంగా గెలిచి చూపిస్తానని హైకమాండ్ ను కోరారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో పార్టీ మారేదిలేదని, చివరి నిమిషం వరకు టికెట్ ప్రయత్నాలు చేస్తానని చెప్పారు.
తాజావార్తలు
-
CM Revanth Reddy Flight Diverted: హైదరాబాద్లో భారీ వర్షాలు.. సీఎం రేవంత్ రెడ్డి విమానం బెంగళూరుకు డైవర్ట్
-
Family Suicide: ఇంత ఘోరమా? ముక్కుపచ్చలారని పసిబిడ్డల పట్ల విలన్గా మారిన తండ్రి
-
TCS Engineer Suicide: TCSలో సీనియర్ల వేధింపులు.. ఉద్యోగి ఆత్మహత్య..
-
Fenya: ‘అమమ్మ’ అంటే డబ్బు, ‘చెత్త’ అంటే పోలీసులు..! దొంగలకు ఆయుధంగా మారిన రహస్య భాష..
-
Netanyahu: నేను ప్రధానిగా ఉన్నంత కాలం ఇరాన్ అణ్వస్త్రంగా మారదు.. నెతన్యాహు సంచలన వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Sachin Tendulkar: “ఎత్తు ఎంతైనా సరే.. ఆటిట్యూడ్ మారకూడదు.!” ఆకాశంలోనూ క్రికెట్ ఆడిన సచిన్.!
-
Indian Railways: రైలు ఆలస్యమైనా ప్రయాణికుడి తప్పేనా..? ప్లాట్ఫామ్ టికెట్ సమయం ముగిసిందంటూ రూ.520 జరిమానా.! వీడియో వైరల్..
-
Mahabharata Lessons: కురుక్షేత్రం vs ఆధునిక వార్స్.. యుద్ధం కంటే ధర్మమే గొప్పది.. మహాభారతం నేర్పిన సత్యం ఇదే!
-
iQOO Flagship Days Sale ప్రారంభం.. iQOO 15, iQOO 15R, Neo 10పై భారీ తగ్గింపులు.!
-
Bangladesh History: ఆస్ట్రేలియాపై చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్.. క్రికెట్ చరిత్రలోనే మొదటిసారి!