Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home International News Indians Dominated Maldives Tourist Arrival Figures In 2023 Data Shows

India-Maldives: ప్రధాని లక్షద్వీప్ టూర్‌తో మాల్దీవుల్లో ఎందుకు కలవరం.? అదును చూసి దెబ్బకొట్టిన మోడీ..

Published Date :January 7, 2024 , 5:01 pm
By Venu Goapl Reddy
India-Maldives: ప్రధాని లక్షద్వీప్ టూర్‌తో మాల్దీవుల్లో ఎందుకు కలవరం.? అదును చూసి దెబ్బకొట్టిన మోడీ..
  • Follow Us :
  • google news
  • dailyhunt

India-Maldives: ప్రధాని నరేంద్రమోడీ లక్షద్వీప్ పర్యటనతో మాల్దీవులు వణికిపోతున్నాయి. ఇటీవల ఎన్నికల్లో అక్కడ అధ్యక్షుడిగా మహ్మద్ మయిజ్జూ గెలిచిన తర్వాత ఏర్పడిన ప్రభుత్వం భారత వ్యతిరేక ధోరణి ప్రదర్శిస్తోంది. ఎన్నికల వాగ్దానాల్లో ఎక్కువగా భారత వ్యతిరేకతను ప్రదర్శించి మయిజ్జూ గెలిచారు. చైనాకు అత్యంత అనుకూలుడని ఇతనికి పేరుంది. ఇప్పటికే ఆ దేశంలో ఉన్న 77 మంది భారత సైనికులను మీ దేశం వెళ్లాల్సిందిగా ఆదేశించాడు.

అయితే, మాల్దీవుల లాగే బీచులు, అందమైన సముద్రానికి ప్రసిద్ధి చెందిన మనదేశంలోని లక్షద్వీపాల్లో టూరిజాన్ని ప్రమోట్ చేసే ఉద్దేశంతో ఇటీవల ప్రధాని నరేంద్రమోడీ అక్కడికి వెళ్లడం మాల్దీవుల్లో కలవరాన్ని కలిగించింది. దీంతో ఇక అక్కడి నేతలు భారత్‌పై, భారత ప్రధాని మోడీపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ విషం కక్కుతున్నారు. దీనిపై భారత ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘‘బాయ్‌కాట్ మాల్దీవిస్’’ పేరుతో ట్విట్టర్‌లో హాష్‌ట్యాగ్ ట్రెండ్ అవుతోంది.

Also Read

  • RCB vs DC: వార్ వన్ సైడ్.. ఢిల్లీపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం.!
  • SAD: బిర్యానీ తిన్న తర్వాత పుచ్చకాయ తిని.. ఒకే కటుంబానికి చెందిన 4 గురు మృతి..
  • AP Govt: 99 పైసలకే ఎకరం భూమి కేటాయించిన ఏపీ.. మొత్తం 20 ఎకరాలు..
  • India Women vs SA Women: ఛేదనలో బొక్కబోర్లా పడ్డ టీమిండియా.. 4-1తో సిరీస్ ఓటమి.!

మోడీ దెబ్బకు మాల్దీవుల్లో కంగారు:

మాల్దీవులు భారత్ దిగువన దక్షిణ-నైరుతి భాగంలో ఉండే ద్వీప దేశం. ఈ దేశం ఎక్కువగా తన అవసరాల కోసం భారత్‌పై ఆధారపడుతుంది. ముఖ్యంగా ఈ దేశ ఆదాయవనరు టూరిజం. ప్రతీ ఏడాది భారత్ నుంచే ఎక్కువగా టూరిస్టులు మాల్దీవులు వెళ్తుంటారు. అయితే, ఒక్కసారి లక్షద్వీపాల్లో టూరిజం అభివృద్ధి జరిగితే మాల్దీవుల ఆదాయం గణనీయంగా పడిపోతుందనే భయంతో అక్కడి నాయకులు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు. గతంలో ఉన్న ప్రభుత్వం భారత అనుకూల వైఖరి అవలంభించేంది, అయితే ఇప్పుడున్న మయిజ్జూ ప్రభుత్వం చైనా అనుకూలంగా వ్యవహరిస్తోంది. ఈ నేపథ్యంలో ఎక్కడ దెబ్బకొడితే ఆ దేశానికి బుద్ది వస్తోందో చూసి, అక్కడే దెబ్బ కొట్టారు పీఎం మోడీ. లక్షద్వీపాల్లో టూరిజం డెవలప్మెంట్ అయితే మాల్దీవులు ఇబ్బందుల్లో పడ్డట్లే. ఇది ఆ దేశానికి మింగుడుపడటం లేదు.

భారత్ నుంచే ఎక్కువ మంది టూరిస్టులు:

మాల్దీవుల పర్యాటక మంత్రిత్వ శాఖ ప్రకారం.. ఆ దేశానికి వచ్చే టూరిస్టుల్లో ఇండియన్స్ అత్యధికం. డిసెంబర్ 13 వరకు ప్రపంచంలోని పలు దేశాల నుంచి మొత్తం 17, 57,939 మంది పర్యాటకులు ద్వీప దేశానికి వచ్చారు. ఇది 2022లో నమోదైన 15 లక్షల మంది కన్నా ఎక్కువ. మాల్దీవులను సందర్శించిన అత్యధిక పర్యాటకుల్లో భారతదేశం (2,09,198) మొదటిస్థానంలో ఉండగా.. రష్యా (2,09,146) మరియు చైనా (1,87,118) తర్వాతి స్థానాల్లో ఉన్నారు.

యునైటెడ్ కింగ్‌డమ్ నుండి సుమారు 1,55,730 మంది, జర్మనీ నుండి 1,18,412 మంది, ఇటలీ నుండి 1,18,412 మంది, యునైటెడ్ స్టేట్స్ నుండి 74,575 మంది, ఫ్రాన్స్ నుండి 49,199 మంది, స్పెయిన్ నుండి 40,462 మంది మరియు స్విట్జర్లాండ్ నుండి 37,260 మంది మాల్దీవులను పర్యాటకులు సందర్శించారు. ఆ దేశానికి ఎక్కువ విదేశీ మారక నిల్వల్ని భారతీయులే టూరిజం ద్వారా ఆర్జించి పెడుతున్నారు. ఈ నేపథ్యంలో లక్షదీవుల్లో మోడీ పర్యటన ఆ దేశానికి కంటగింపుగా మారింది. ఒక్కసారి మాల్దీవులకు సమానంగా లక్షదీవులు డెవలప్ అయితే ఇతర విదేశీ టూరిస్టులు కూడా లక్షదీవులకు వచ్చే అవకాశం పెరుగుతుంది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • India-Maldives row
  • Indian Tourists
  • Lakshadweep
  • Maldives
  • PM Modi

తాజావార్తలు

  • RCB vs DC: వార్ వన్ సైడ్.. ఢిల్లీపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం.!

  • India Defense Budget: సాహో భారత్.. పాకిస్థాన్‌ను గజగజలాడిస్తున్న ఇండియా రక్షణ బడ్జెట్.. చైనా సాయం ఉన్నా దాయాదికి వణుకు పుట్టాల్సిందే!

  • SAD: బిర్యానీ తిన్న తర్వాత పుచ్చకాయ తిని.. ఒకే కటుంబానికి చెందిన 4 గురు మృతి..

  • AP Govt: 99 పైసలకే ఎకరం భూమి కేటాయించిన ఏపీ.. మొత్తం 20 ఎకరాలు..

  • India Women vs SA Women: ఛేదనలో బొక్కబోర్లా పడ్డ టీమిండియా.. 4-1తో సిరీస్ ఓటమి.!

ట్రెండింగ్‌

  • 7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్‌ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!

  • 10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్‌, 120Hz AMOLED డిస్‌ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?

  • Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో

  • Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్‌వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!

  • 7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions