MP Balashowry: జనసేనలో చేరిన ఎంపీ బాలశౌరి.. పార్టీలోకి ఆహ్వానించిన పవన్ కల్యాణ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మచిలీపట్నం ఎంపీ బాలశౌరి జనసేన తీర్థం పుచ్చుకున్నారు. గుంటూరు నుంచి భారీ ర్యాలీగా జనసేన కార్యాలయానికి వచ్చారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ సమక్షంలో ఆయన పార్టీ కండువా కప్పుకున్నారు. ఎంపీతో పాటు ఆయన కుమారుడు అనుదీప్ కూడా జనసేనలో చేరారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు నాదెండ్ల మనోహర్, నాగబాబు పాల్గొన్నారు.
PM Modi: గత పాలకులు రాజకీయ ప్రయోజనాల కోసం దేశ చరిత్రను నిర్లక్ష్యం చేశారు..
Also Read
- Venkaiah Naidu: ‘ఇష్టపడి పని చేయండి.. నష్టపోవడం ఉండదు’.. పట్టభద్రులకు వెంకయ్య సందేశం
- Ambati Rambabu: ఏఐ వీడియో వివాదంలో అంబటి రాంబాబు.. కేసు నమోదు..
- Mudragada Padmanabham సంతాప సభలో ఆసక్తికర దృశ్యం.. ఆలింగనం చేసుకున్న బోండా ఉమ, అంబటి రాంబాబు.!
- Nadendla Manohar: స్థానిక ఎన్నికల్లో కొత్త వ్యూహం.. మంత్రి నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు..
ఈ సందర్భంగా బాలశౌారి మాట్లాడుతూ.. పవన్ కల్యాణ్ సమక్షంలో జనసేనలో చేరడం ఎంతో గర్వకారణంగా ఉందని అన్నారు. రాజకీయ పార్టీల కంటే అభివృద్ధి ముఖ్యమని.. ఐదేళ్లుగా అభివృద్ధి జరిగిందేమీ లేదన్నారు. సాగునీటి ప్రాజెక్టులు అటుకెక్కాయని బాలశౌరి ఆరోపించారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని, ఎన్నిసార్లు చెప్పినా అభివృద్ధిపై స్పందించడం లేదన్నారు. రాష్ట్రంను అభివృద్ధి చేస్తారన్న ఆలోచనతోనే జనసేనతో కలిసి నడుస్తున్నానని వల్లభనేని బాలశౌరి స్పష్టం చేశారు.
Minister Kakani: చంద్రబాబు, లోకేష్, సోమిరెడ్డి నాపై నిందలు వేశారు..
భవిష్యత్ లో జనసేన ప్రభుత్వం ఏర్పడుతుందని బాలశౌరి తెలిపారు. రాష్ట్ర అభివృధ్ధిలో తాను కీలక పాత్ర పోషించనున్నట్లు పేర్కొన్నారు. 2004లో వైఎస్ శిష్యుడిగా రాజకీయాల్లోకి వచ్చానని, గత ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా బందర్ నుంచి పోటీ చేసి గెలిచానన్నారు. కాగా.. బాలశౌరి ఎక్కడినుంచి పోటీ చేస్తానన్నది సందిగ్థత నెలకొంది. బాలశౌరి ఉమ్మడి గుంటూరు జిల్లా పల్నాడు ప్రాంతానికి చెందిన నేత కాగా.. గుంటూరు నుంచే పోటీ చేస్తాడని తన అనుచరులు చెబుతున్నారు. అయితే గుంటూరు ఎంపీ స్థానం టీడీపీకి సంబంధించినది కాగా.. అక్కడి టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ పోటీ నుంచి విరమించారు. ఈ నేపథ్యంలో ఆ స్థానాన్ని బాలశౌరికే కేటాయిస్తారని తన అనుచరులు చెబుతున్నారు. కాగా, అక్కడి నుంచి టీడీపీ పోటీ చేస్తుందా.. లేదంటే జనసేన పోటీ చేస్తుందా అనేది సందిగ్థత నెలకొంది. మరోవైపు.. బాలశౌరి మాత్రం అధిష్టానం ఏది నిర్ణయిస్తే అదే శిరోధార్యం అని అంటున్నారు.
తాజావార్తలు
-
Massive Accidents : NH-65పై మృత్యుఘోష.. ఒకే రోజు 9 మంది బలి.!
-
Ind Vs SL: లంక టీమ్కు చుక్కలే.. రిషభ్ పంత్కు భయపడుతున్న లంక ప్లేయర్లు.. కారణం ఇదే..
-
Chiranjeevi: ఈ కొరియన్ కనకరాజు సక్సెస్ కి కారణం మా వరుణ్ తేజ్ కొడుకే
-
Petrol Bunk: నమ్మి బాధ్యతలు ఇస్తే షాకిచ్చాడు.. పెట్రోల్ బంక్ నుంచి ఖైదీ పరార్..
-
Telangana Public Schools : తెలంగాణ పబ్లిక్ స్కూళ్లకు డెడ్లైన్.. డిసెంబర్లోనే రెడీ.!
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..