Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story Former Minister Ambati Rambabu Responded On The Release Of Polavaram Funds

Ambati Rambabu: గతంలో జగన్ చేసిన కృషి వల్లే పోలవరానికి నిధులు..

Published Date :August 28, 2024 , 7:27 pm
By Rajesh Veeramalla
  • కేంద్రం నుండి విడుదలైన రూ.12 వేల కోట్లు గతంలో జగన్ చేసిన కృషి వల్లే వచ్చాయి- అంబటి రాంబాబు
  • పోలవరం ప్రాజెక్టు అంశంపై చంద్రబాబు రాష్ట్ర ప్రజలకు అసత్యాలను చెప్తున్నారు- అంబటి
  • పోలవరం విషయంలో చంద్రబాబు కమీషన్లకు కక్కుర్తి పడ్డారు..
  • అందుకే ప్రాజెక్ట్ ప్రమాదంలో పడింది- అంబటి రాంబాబు.
Ambati Rambabu: గతంలో జగన్ చేసిన కృషి వల్లే పోలవరానికి నిధులు..
  • Follow Us :
  • google news
  • dailyhunt

ఈ రోజు కేంద్రం నుండి విడుదలైన రూ.12 వేల కోట్లు గతంలో వైఎస్ జగన్ చేసిన కృషి వల్లే వచ్చాయని మాజీ మంత్రి అంబటి రాంబాబు తెలిపారు. పోలవరం ప్రాజెక్టు అంశంపై చంద్రబాబు రాష్ట్ర ప్రజలకు అసత్యాలను చెప్తున్నారన్నారు. పోలవరం విషయంలో చంద్రబాబు కమీషన్లకు కక్కుర్తి పడ్డారని.. అందుకే ప్రాజెక్ట్ ప్రమాదంలో పడిందని పేర్కొన్నారు. 2024లో చంద్రబాబు సీఎం అయిన తర్వాత విదేశీ నిపుణులు వచ్చి పరిశీలించారని.. వాళ్ళు ఇచ్చిన నివేదిక ప్రకారం ప్రాజెక్ట్ లో అన్ని కట్టడాలు ఒక్కసారే కట్టడం వల్లే ప్రాజెక్ట్ ప్రమాదంలో పడింది… ఇది నిపుణులు చెప్పిన మాట అని అంబటి రాంబాబు తెలిపారు. నది డైవర్షన్ పూర్తి కాకుండా.. డయాఫ్రమ్ వాల్, కాఫర్ డ్యాంలు వేయకూడదని చెప్పారన్నారు. అలాంటి తప్పే గతంలో టీడీపీ ప్రభుత్వం చేసిందని ఆరోపించారు.

Post Office Scheme: పోస్ట్ ఆఫీస్ సూపర్‌హిట్ పథకం..115 నెలల్లో మీ డబ్బు రెట్టింపు

Also Read

  • Ambati Rambabu Hunger Strike: నిరాహార దీక్ష చేపట్టిన అంబటి.. ప్రాణాలకు తెగించైనా మీ సంగతి తేలుస్తా..!
  • Ambati Rambabu: పోలీసులకు ఫిర్యాదు చేసిన అంబటి రాంబాబు.. న్యాయం జరగకపోతే సుప్రీంకోర్టుకు వెళ్తా..
  • Divyang Shakti Scheme: దివ్యాంగుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం.. వారికోసం మరింత ఆలోచన చేస్తాం..
  • Vegetable Market: మరోసారి తెరపైకి కూరగాయల హోల్ సేల్ మార్కెట్ వివాదం

చంద్రబాబు తొందర పాటుతో పోలవరాన్ని ఆరేళ్ళు వెనక్కు నెట్టారని అంబటి రాంబాబు తెలిపారు. చేసిందంతా చేసి చంద్రబాబు ఇప్పుడు మీడియా ముందు ఆవేశపడుతున్నాడని పేర్కొన్నారు. 2019లో వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత పోలవరం ప్రాజెక్ట్ వేగం పెరిగిందని అంబటి రాంబాబు చెప్పారు. 2016లో కమీషన్ల కోసం కక్కుర్తి పడి పోలవరాన్ని రాష్ట్ర ప్రభుత్వం కడుతుందని చంద్రబాబు ఒప్పుకున్నాడన్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి పోలవరంకు ఏమి చేయలేదని చెప్పడం దుర్మార్గమని దుయ్యబట్టారు. 13, 14 సంవత్సరాలలో ఉన్న రేట్లకు పూర్తి చేస్తాం అని.. 2016లో కేంద్రం దగ్గర ఒప్పుకుని వచ్చారని తెలిపారు. రూ. 20,398 కోట్లకు నిర్మాణం చేస్తామని చంద్రబాబు ఒప్పుకున్నాడని.. రూ.4,000 కోట్లు పైగా అప్పటికే రాష్ట్ర ప్రభుత్వాలు ఖర్చు చేశారన్నారు. మరోవైపు.. రివర్స్ టెండరింగ్ విధానం వల్ల ప్రజలకు మేలు చేయాలని జగన్ ప్రయత్నించారని అంబటి రాంబాబు తెలిపారు. రివర్స్ టెండరింగ్ ద్వారా ఇరిగేషన్ ప్రాజెక్టులలో రూ. 2400 కోట్లు ప్రభుత్వానికి లబ్ధి చేకూరిందని చెప్పారు. మిగిలిన ప్రాజెక్ట్ లలో కూడా వేల కోట్ల ప్రభుత్వ ధనం మిగిల్చామన్నారు. జగన్ చేసిన మంచి పనులను కూడా బూచిగా చూపిస్తున్నారని అంబటి రాంబాబు మండిపడ్డారు.

Delhi: రెస్టారెంట్‌లో దారుణం.. ఫుడ్ ఆర్డర్‌పై ఘర్షణ.. కస్టమర్‌ హత్య

పార్టీ మార్పులపై అంబటి రాంబాబు స్పందించారు. ప్రస్తుత రాజకీయాలలో విలువలు తగ్గాయి అనుకుంటున్నా.. మోపిదేవి వైఎస్ రాజశేఖర్ రెడ్డి క్యాబినెట్ లో కూడా పని చేసిన వ్యక్తి అని అన్నారు. అలాగే.. వైఎస్ జగన్ క్యాబినెట్ లో కూడా పని చేశారని తెలిపారు. తాను గెలిచినా తనకు మంత్రి పదవి ఇవ్వలేదని.. కానీ, 2019 ఎన్నికల్లో ఓడిపోయినా మోపిదేవికి మంత్రి పదవి ఇచ్చారని అంబటి పేర్కొన్నారు. మోపిదేవి పార్టీ నుండి వెళ్తారని అనుకోవడం లేదు.. ఏదైనా బాధ కలిగినా వెనక్కు రమ్మని కోరుతున్నట్లు చెప్పారు. అధికారం ఎవరికీ శాశ్వతం కాదు.. ఎవరు పార్టీలు మారి చంద్రబాబుతో వెళ్తే.. కాల గర్భంలో కలసి పోవడమేనని విమర్శించారు. త్వరలోనే జిల్లా కమిటీలు వేస్తామని అంబటి రాంబాబు చెప్పారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Ambati Rambabu
  • cm chandrababu
  • jagan
  • Polavaram funds
  • release

తాజావార్తలు

  • LRS Fee : తెలంగాణ ప్రజలకు భారీ ఊరట.. LRS ఫీజుపై ప్రభుత్వం నిర్ణయం..!

  • Story Board : ఇరాన్ యుద్ధం.. గల్ఫ్ భారీ మూల్యం చెల్లించుకోక తప్పదా?

  • Suvendu adhikari: 180 గెలుస్తున్నాం.. మమతా బెనర్జీ ఇక రెస్ట్ తీసుకో..

  • Weight Loss Mistakes: బాబోయ్ బరువు తగ్గడానికి ఈ పని మాత్రం చస్తే చేయకండి..!

  • MI vs SRH: సెంచరీతో రఫ్ఫాడించిన ‘ర్యాన్‌ రికెల్టన్‌’.. SRH ముందు భారీ టార్గెట్.!

ట్రెండింగ్‌

  • Raw Mango Tomato Roti Pachadi: వేడివేడి అన్నానికి సూపర్ కాంబో “మామిడికాయ టమాటా రోటి పచ్చడి”.!

  • Open AI Financial Crisis : ఆర్థిక సంక్షోభంలో చాట్ జీపీటీ.?

  • Viral Wedding: పెళ్లి పీటలపై ఊహించని ట్విస్ట్.. వధువు ముందు వింత షరతు పెట్టిన పెళ్లి కొడుకు.. షాక్‌లో బంధువులు!

  • 50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్‌తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!

  • 13 అంగుళాల 3.5K PureSight Pro డిస్‌ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions