Delhi: రెస్టారెంట్లో దారుణం.. ఫుడ్ ఆర్డర్పై ఘర్షణ.. కస్టమర్ హత్య
- ఢిల్లీ రెస్టారెంట్లో దారుణం
- ఫుడ్ ఆర్డర్పై ఘర్షణ
- కస్టమర్ను చంపిన యజమానులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రెస్టారెంట్లో కడుపారా తిని ఆస్వాదిద్దామనుకుని వెళ్తే ఏకంగా ప్రాణాలే పోయాయి. ఆర్డర్ త్వరగా తీసుకురామని అడిగిన పాపానికి కస్టమర్ హత్యకు గురయ్యాడు. ఈ దారుణ ఘటన దేశ రాజధాని ఢిల్లీలో చోటుచేసుకుంది. బుధవారం తెల్లవారుజామున 3:30 గంటలకు ఈ ఘటన జరిగింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇది కూడా చదవండి: Kolkata Doctor case: కోల్కతా కాలేజ్ మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్పై ఐఎంఏ సస్పెన్షన్ వేటు..
Also Read
- POCSO Case : బ్లాక్మెయిల్ నుంచి పోక్సో కేసు వరకు.. తిరుపతిలో కలకలం రేపిన ఘటన.!
- Tiger Attack: ఘోరం.. తునికాకు కోసం అడవికి వెళ్లిన మహిళలపై పెద్దపులి దాడి.. నలుగురు మృతి
- Mule Account Scam : బ్యాంక్ అకౌంట్ అమ్ముకుంటే లైఫ్ క్లోజ్.. పోలీసుల సీరియస్ వార్నింగ్..!
- Honour killing: హిందూ యువకుడితో ప్రేమ.. కుమార్తెను ముక్కలుగా నరికి చంపిన తండ్రి..
ఢిల్లీలోని కేతన్స్ ఫుడ్ కోర్ట్ అనే రెస్టారెంట్ దగ్గర తెల్లవారుజామున 3:30 గంటలకు హర్నీత్ సింగ్ సచ్దేవా అనే కస్టమర్ ఆర్డర్ ఇచ్చాడు. అది వచ్చేందుకు ఆలస్యం కావడంతో ఘర్షణ చోటుచేసుకుంది. దీంతో రెస్టారెంట్ యజమాని దాడి చేయడంతో హర్నీత్ సింగ్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. ఆ సమయం వరకు రెస్టారెంట్ నిర్వహించడంపై పోలీసులు ఆరా తీశారు. సీసీటీవీ ఫుటేజీని స్వాధీనం చేసుకున్నారు. నిందితుల్లో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. విచారణ కొనసాగుతోందని చెప్పారు.
ఇది కూడా చదవండి: MLC Kavitha : హైదరాబాద్కు చేరుకున్న కవిత
పోలీసులు తెలిపిన ప్రకారం.. మృతుడు రెస్టారెంట్కు వెళ్లాక.. అతడిచ్చిన ఆర్డర్ ఆలస్యం కావడంతో సిబ్బందితో వాగ్వాదం జరిగిందని చెప్పారు. యజమానులు కేతన్ నరులా, అజయ్ నరులా కొంతమంది వ్యక్తులతో అక్కడికి వచ్చారని.. అనంతరం మృతుడు, అతని స్నేహితులు.. యజమానుల మధ్య గొడవ జరిగిందని పోలీసులు తెలిపారు. ఘర్షణలో గాయపడిన వ్యక్తిని అతని స్నేహితులు ఆసుపత్రికి తీసుకెళ్లారన్నారు. అక్కడికి వెళ్లాక అతడు చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారని తెలిపారు. నిందితుల్లో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. తదుపరి విచారణ కొనసాగుతోంది. ఆ సమయంలో రెస్టారెంట్ ఎందుకు నడుస్తుందనే దానిపై కూడా ఆరా తీస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
తాజావార్తలు
-
Off The Record : గుంటూరు జిల్లాలో ఆ ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు అందినకాడికి దోచేస్తున్నారా..?
-
Jitan Ram Manjhi: కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీపై రాళ్ల దాడి.. ఇద్దరు అరెస్ట్
-
Off The Record : అన్నిటికీ సీఎం మాత్రమేనా.. మంత్రులు స్పందించరా..?
-
Story Board: దొరికిపోయిన బ్లాక్ టిక్కెట్ల ముఠా..
-
RCB Vs SRH: దయాదాక్షిణ్యాలు చూపించలేదు.. ఆర్సీబీ బౌలర్లను ఆడుకున్న కాటేరమ్మ కొడుకులు..
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!