Gudivada Amarnath: రాష్ట్రంలో కుల రాజకీయాలకు ఆద్యుడు చంద్రబాబు..
- ముఖ్యమంత్రి చంద్రబాబుపై మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ తీవ్ర విమర్శలు
- లడ్డూ వివాదంలో చంద్రబాబు తప్పు దొరికిపోయింది కనుకే రాజకీయాలు మొదలు పెట్టారు
- రాష్ట్రంలో కుల రాజకీయాలకు ఆద్యుడు చంద్రబాబు- గుడివాడ అమర్నాథ్
- విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణ అడ్డుకోవడానికి టీడీపీ అల్టిమేటం ఇవ్వాలి.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ముఖ్యమంత్రి చంద్రబాబుపై మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఆదివారం విశాఖలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. లడ్డూ వివాదంలో చంద్రబాబు తప్పు దొరికిపోయింది కనుకే రాజకీయాలు మొదలు పెట్టారని ఆరోపించారు. రాష్ట్రంలో కుల రాజకీయాలకు ఆద్యుడైన చంద్రబాబు.. ఇప్పుడు మత రాజకీయాలకు పునాదులు వేసి చిచ్చు పెట్టేందుకు ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణ అడ్డుకోవడానికి టీడీపీ అల్టిమేటం ఇవ్వాలి.. టీడీపీ మద్దతుతో నడుస్తున్న కేంద్ర ప్రభుత్వానికి మద్దతు ఉప సంహరించుకుంటామని ప్రకటించాలని అన్నారు.
Heart disease: స్త్రీల కన్నా పురుషులకే ఎక్కువ గుండె జబ్బులు..ఎందుకు..?
Also Read
- Uday Krishna Reddy: అనాథగా పెరిగి ఐపీఎస్ దాకా.. ముఖ్యమంత్రిచే ప్రశంసలు.. ఉదయ్ కృష్ణారెడ్డి బ్యాగ్రౌండ్ తెలిస్తే కన్నీళ్లు ఆగవు!
- CM Chandrababu: ఢిల్లీలో సీఎం చంద్రబాబు మార్క్ రాజకీయం.. భోగాపురం ఎయిర్పోర్ట్, విశాఖ మెట్రోపై స్పీడ్..
- Schools Closed: విద్యార్థులకు బిగ్ అలర్ట్.. ఎల్లుండి స్కూల్స్, కాలేజీలు బంద్..
- AP Govt: రైతులకు, భూ యజమానులకు బిగ్ రిలీఫ్.. మరో కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన ఏపీ ప్రభుత్వం..
తిరుపతి, తిరుమల పవిత్ర మీద రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధి ఏ పాటిదో ఎక్సయిజ్ షాపులు కేటాయింపు చూస్తే అర్ధం అవుతుందని విమర్శించారు. ఒక్క తిరుపతి జిల్లాలో అత్యధికంగా 264 షాపులు ఇచ్చారని అమర్నాథ్ పేర్కొన్నారు. నిత్యావసరాల ధరల నియంత్రణలో ప్రభుత్వం విఫలం అయ్యింది.. వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు ఉద్యోగుల బదిలీలపై ఉన్న ఫోకస్ పేదవాడి కష్టాల మీద లేదని దుయ్యబట్టారు. తిరుపతి లడ్డు వివాదంపై సీబీఐ విచారణ చేయాల్సిందేనని అన్నారు. మరోవైపు.. రాష్ట్రంలో హామీలు అమలులో ప్రభుత్వం వైఫల్యం అయినందుకే పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష చేస్తున్నారని పేర్కొన్నారు. లడ్డుపై ఆరోపణలు చేసిన ముఖ్యమంత్రే దానిని నిరూపించేందుకు చొరవ తీసుకోవాలని తెలిపారు.
Vijayawada: ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రి ఉత్సవాలకు ఏర్పాట్లు.. మూల నక్షత్ర సమయంలో సీఎం దర్శనం
రాష్ట్రంలో సినిమా పోలీసింగ్ నడుస్తోంది.. ప్రభుత్వం చెప్పిన మాట తప్ప లా & ఆర్డర్ వైఫల్యం జరిగిందని చెప్పిన పట్టించుకునే పరిస్థితి లేదని గుడివాడ అమర్నాథ్ అన్నారు. సిట్ చీఫ్, ఆయన ఆధీనంలో జరిగే దర్యాప్తుపై తమకు నమ్మకం లేదని తెలిపారు. పల్నాడులో లా& ఆర్దర్ మెయింటేన్ చేయడంలో ఐజీగా ఏ విధంగా సిట్ చీఫ్ వ్యవహరించారో అందరికీ తెలుసని చెప్పారు. ప్రభుత్వాలు వేసిన సిట్లు ఎలా పనిచేస్తాయో తమకు తెలుసన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి ధైర్యం లేకనే సీబీఐ లేదా సుప్రీంకోర్టు జడ్జితో విచారణ జరిపించాలని కోరారు. కల్తీ నెయ్యి వాడారు కానీ.. ఎక్కడో తెలియదని సీఎం చెప్పడంలో అంతర్యం దాగి ఉందని గుడివాడ అమర్నాథ్ చెప్పారు.
తాజావార్తలు
-
Chiranjeevi: నా అభిమానులు ఎస్కేఎన్, సాయి రాజేష్లను చూసి గర్వపడుతున్నా..
-
Delhi Protest : దేశ రాజధానిలో మళ్లీ రగిలిన ఉద్రిక్తతలు.. జంతర్ మంతర్ వద్ద రణరంగం.!
-
CM Revanth Reddy : మున్సిపల్ అధికారులకు సీఎం రేవంత్ అల్టిమేటం..
-
Vaibhav Sooryavanshi: జింబాబ్వే సిరీస్పై కన్నేసిన వైభవ్ సూర్యవంశీ.. ‘ఈ సిరీస్ వదిలే ప్రసక్తే లేదు’..
-
HYDRA Ranganath: రూ.1.5 లక్షల కోట్ల ప్రభుత్వ భూములు కాపాడాం
ట్రెండింగ్
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!