Gudivada Amarnath: రాష్ట్రంలో కుల రాజకీయాలకు ఆద్యుడు చంద్రబాబు..
- ముఖ్యమంత్రి చంద్రబాబుపై మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ తీవ్ర విమర్శలు
- లడ్డూ వివాదంలో చంద్రబాబు తప్పు దొరికిపోయింది కనుకే రాజకీయాలు మొదలు పెట్టారు
- రాష్ట్రంలో కుల రాజకీయాలకు ఆద్యుడు చంద్రబాబు- గుడివాడ అమర్నాథ్
- విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణ అడ్డుకోవడానికి టీడీపీ అల్టిమేటం ఇవ్వాలి.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ముఖ్యమంత్రి చంద్రబాబుపై మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఆదివారం విశాఖలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. లడ్డూ వివాదంలో చంద్రబాబు తప్పు దొరికిపోయింది కనుకే రాజకీయాలు మొదలు పెట్టారని ఆరోపించారు. రాష్ట్రంలో కుల రాజకీయాలకు ఆద్యుడైన చంద్రబాబు.. ఇప్పుడు మత రాజకీయాలకు పునాదులు వేసి చిచ్చు పెట్టేందుకు ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణ అడ్డుకోవడానికి టీడీపీ అల్టిమేటం ఇవ్వాలి.. టీడీపీ మద్దతుతో నడుస్తున్న కేంద్ర ప్రభుత్వానికి మద్దతు ఉప సంహరించుకుంటామని ప్రకటించాలని అన్నారు.
Heart disease: స్త్రీల కన్నా పురుషులకే ఎక్కువ గుండె జబ్బులు..ఎందుకు..?
Also Read
- AP Weather Report Today: నేడు ఏపీలో పలు జిల్లాలకు భారీ వర్ష సూచన.. ఎల్లో అలర్ట్ జారీ!
- AP Schools Reopen: నేటి నుంచే బడి గంట.. 2026-27 అకడమిక్ క్యాలెండర్ విడుదల.. హాలిడేస్ లిస్ట్ ఇదే!
- Anantapur Murder: 20 రూపాయల కోసం గొడవ.. సర్ది చెప్పేందుకు వెళ్లిన వ్యక్తిని కొట్టి చంపిన మామా-అల్లుడు!
- APL 2026: ఉత్కంఠ పోరులో అమరావతి అద్భుత విజయం
తిరుపతి, తిరుమల పవిత్ర మీద రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధి ఏ పాటిదో ఎక్సయిజ్ షాపులు కేటాయింపు చూస్తే అర్ధం అవుతుందని విమర్శించారు. ఒక్క తిరుపతి జిల్లాలో అత్యధికంగా 264 షాపులు ఇచ్చారని అమర్నాథ్ పేర్కొన్నారు. నిత్యావసరాల ధరల నియంత్రణలో ప్రభుత్వం విఫలం అయ్యింది.. వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు ఉద్యోగుల బదిలీలపై ఉన్న ఫోకస్ పేదవాడి కష్టాల మీద లేదని దుయ్యబట్టారు. తిరుపతి లడ్డు వివాదంపై సీబీఐ విచారణ చేయాల్సిందేనని అన్నారు. మరోవైపు.. రాష్ట్రంలో హామీలు అమలులో ప్రభుత్వం వైఫల్యం అయినందుకే పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష చేస్తున్నారని పేర్కొన్నారు. లడ్డుపై ఆరోపణలు చేసిన ముఖ్యమంత్రే దానిని నిరూపించేందుకు చొరవ తీసుకోవాలని తెలిపారు.
Vijayawada: ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రి ఉత్సవాలకు ఏర్పాట్లు.. మూల నక్షత్ర సమయంలో సీఎం దర్శనం
రాష్ట్రంలో సినిమా పోలీసింగ్ నడుస్తోంది.. ప్రభుత్వం చెప్పిన మాట తప్ప లా & ఆర్డర్ వైఫల్యం జరిగిందని చెప్పిన పట్టించుకునే పరిస్థితి లేదని గుడివాడ అమర్నాథ్ అన్నారు. సిట్ చీఫ్, ఆయన ఆధీనంలో జరిగే దర్యాప్తుపై తమకు నమ్మకం లేదని తెలిపారు. పల్నాడులో లా& ఆర్దర్ మెయింటేన్ చేయడంలో ఐజీగా ఏ విధంగా సిట్ చీఫ్ వ్యవహరించారో అందరికీ తెలుసని చెప్పారు. ప్రభుత్వాలు వేసిన సిట్లు ఎలా పనిచేస్తాయో తమకు తెలుసన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి ధైర్యం లేకనే సీబీఐ లేదా సుప్రీంకోర్టు జడ్జితో విచారణ జరిపించాలని కోరారు. కల్తీ నెయ్యి వాడారు కానీ.. ఎక్కడో తెలియదని సీఎం చెప్పడంలో అంతర్యం దాగి ఉందని గుడివాడ అమర్నాథ్ చెప్పారు.
తాజావార్తలు
-
Gold Rate Today: భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు.. ఒక్కరోజులోనే షాకిచ్చిన బులియన్ మార్కెట్!
-
Cyber Crime: ఆన్లైన్ డేటింగ్ ఉచ్చులో మహిళా న్యాయమూర్తి.. జడ్జిగారి ‘రోమాన్స్ స్కామ్’ కథ వింటే నోరెళ్లబెడతారు!
-
Ben Stokes-ECB: పూర్తిస్థాయి నిషేధంపై ఆలోచిస్తున్నాం.. బాంబ్ పేల్చిన ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు!
-
The Odyssey : ‘ది ఒడిస్సీ’కి భయపడి ప్రీ పోన్ చేసుకుంటోన్న బాలీవుడ్ ఫిల్మ్స్
-
2027 ODI World Cup: హార్దిక్ పాండ్యా ఎందుకు.. ఆ తెలుగోడే ‘సరైనోడు’!
ట్రెండింగ్
-
Mahabharata Lessons: కురుక్షేత్రం vs ఆధునిక వార్స్.. యుద్ధం కంటే ధర్మమే గొప్పది.. మహాభారతం నేర్పిన సత్యం ఇదే!
-
iQOO Flagship Days Sale ప్రారంభం.. iQOO 15, iQOO 15R, Neo 10పై భారీ తగ్గింపులు.!
-
Bangladesh History: ఆస్ట్రేలియాపై చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్.. క్రికెట్ చరిత్రలోనే మొదటిసారి!
-
FIFA World Cup: రెండు గోల్స్, మూడు రెడ్ కార్డ్స్.. దక్షిణాఫ్రికాను చిత్తు చేసి బోణి కొట్టిన మెక్సికో.!
-
Parenting Tips: డిజిటల్ చెరలో బాల్యం.. రోబోలుగా మారుతున్న పిల్లలు! పేరెంట్స్ ఈ జాగ్రత్తలు తీసుకోండి..