Gudivada Amarnath: అప్పుడు లేవని నోరు, ఇప్పుడెందుకు లేస్తోంది పవన్?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gudivada Amarnath Fires On Pawan Kalyan Over Volunteers Issue: విజయవాడలోని సర్క్యూట్ హౌస్లో నిర్వహించిన ప్రెస్మీట్లో ఏపీ మంత్రి గుడివాడ అమర్నాథ్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్పై ధ్వజమెత్తారు. వాలంటీర్లపై పవన్ చేసిన వ్యాఖ్యలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. వాలేంటీర్లు హ్యూమన్ ట్రాఫికింగ్కు పాల్పడుతున్నారని పవన్ చేసిన వ్యాఖ్యలు అభ్యంతరకరమని మండిపడ్డారు. సినిమా పరిశ్రమలో ఉన్న మహిళల గురించి విమర్శలు చేసినప్పుడు నోరు మెదపని పవన్.. రాష్ట్రంలో మహిళల రక్షణ గురించి మాట్లాడుతున్నారని వ్యాఖ్యానించారు. జగన్ సైన్యంగా అపారమైన సేవలు అందిస్తున్న వాలంటీర్ వ్యవస్థను దూరం చేసే ప్రయత్నం జరుగుతోందని అనుమానం వ్యక్తం చేశారు. ముద్రగడ భార్య, కోడలి విషయంలో తలెత్తిన ఇబ్బందులుపై పవన్ కళ్యాణ్ ఎందుకు నోరెత్తలేదని ప్రశ్నించారు.
Pawan Kalyan: రుషికొండ, ఎర్రమట్టి దిబ్బల పరిశీలనకు పవన్.. పోలీసులు పర్మిషన్ ఇచ్చేనా..?
Also Read
- IMD Rain Alert: తెలుగు రాష్ట్రాలపై మళ్లీ వాన గండం.. ఈ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు..
- Vijayawada to Amaravati: విజయవాడ నుంచి అమరావతికి రాజబాట.. రూ.1000 కోట్లతో మరో బ్రిడ్జి..
- CM Chandrababu: ‘పునాది వేశా.. ప్రాజెక్ట్ పూర్తి చేశా’.. వెలిగొండ ప్రాజెక్టును ప్రారంభించిన సీఎం చంద్రబాబు..
- Veligonda Project Phase 1: వెలిగొండ ఫేజ్-1 ప్రారంభం.. 10.70 టీఎంసీల కృష్ణా జలాలు విడుదల చేసిన సీఎం చంద్రబాబు
పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు చూస్తే.. గంజాయి మత్తులో మాట్లాడుతున్నట్టు అనిపిస్తోందని గుడివాడ అమర్నాథ్ పేర్కొన్నారు. విశాఖలో భూ దోపిడీ, గంజాయి మీద టీడీపీ హయాంలో అప్పటి మంత్రులు అయ్యన్న, గంటాలు చెప్పినప్పుడు పవన్ ఎక్కడ దాక్కున్నాడని నిలదీశారు. టీడీపీ మాజీ ఎమ్మెల్యే, గీతం సంస్థ అధీనంలో అత్యంత ఖరీదైన ప్రభుత్వ భూములు ఉంటే.. పవన్ ఎందుకు నోరు మెదపలేదని అడిగారు. నూటికి 95శాతం పథకాలు మహిళలకు ఇస్తుంటే.. దాన్ని పవన్ వక్రీకరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మద్యం ఆదాయం సంక్షేమం కోసమంటే.. పవన్ మహిళల్ని కించపరుస్తున్నారని ఫైర్ అయ్యారు. ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరనేది పవన్, చంద్రబాబు తేల్చుకోవాలే తప్ప.. ఎవరిని సీఎం చేయాలో నిర్ణయించేది జనమని ఉద్ఘాటించారు. పవన్ కళ్యాణ్ ఓ బాబా అని.. బాబా అంటే బాబుగారి బానిస అని వర్ణించారు.
Gudivada Amarnath: సంసారం బీజేపీతో, సహజీవనం టీడీపీతో.. ఇదే పవన్ కళ్యాణ్ విధానం
రాష్ట్ర విభజన కోసం ముందుగా లేఖ ఇచ్చింది టీడీపీనే అని అమర్నాథ్ తెలిపారు. రాజకీయాన్ని వ్యాపారం చేసింది పవన్ కళ్యాణ్ అని తూర్పారపట్టారు. పవన్, చంద్రబాబులు కొండలు కొట్టకుండానే.. తమ ఇళ్లను నిర్మించుకున్నారా? అని నిలదీశారు. రాజధాని విశాఖపట్నం అయినప్పుడు.. పవన్ కళ్యాణ్ రాకుండా ఏం చేస్తాడు? అని అడిగారు. రాజకీయ పార్టీలో ఉండాలనుకునే వాళ్లు రాజధానిలోనే నివాసం ఉండాలని.. అందుకు తాను స్వాగతిస్తున్నానని చెప్పారు. ఆంధ్రా యూనివర్సిటీలో డిస్టన్స్ ఎడ్యుకేషన్ విభాగం నుంచి ఒక్క సెమిస్టర్ పాస్ అయితే.. పవన్ కళ్యాణ్కు విలువ తెలుస్తుందన్నారు.
తాజావార్తలు
-
Kalki 2 : కల్కి 2 అప్డేట్ ఇచ్చిన నాగ్ అశ్విన్
-
Sardar 2 : సర్దార్ ఆన్ యాక్షన్.. స్పై థ్రిల్లర్తో మళ్లీ రాబోతున్న కార్తీ
-
Cheyutha Pensions: చేయూత పెన్షన్ దరఖాస్తుల గడువు పెంపు.. చివరి తేదీ ఎప్పుడంటే..
-
Anna Hazare: అన్నా హజారేకు సీరియస్.. ముంబై ఆస్పత్రికి తరలింపు
-
Messi Retirement: హార్మోన్ లోపం నుంచి ప్రపంచకప్ కల వరకు.. మెస్సీ జీవిత ప్రయాణం సాగిందిలా..
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!