Gudivada Amarnath: అప్పుడు లేవని నోరు, ఇప్పుడెందుకు లేస్తోంది పవన్?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gudivada Amarnath Fires On Pawan Kalyan Over Volunteers Issue: విజయవాడలోని సర్క్యూట్ హౌస్లో నిర్వహించిన ప్రెస్మీట్లో ఏపీ మంత్రి గుడివాడ అమర్నాథ్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్పై ధ్వజమెత్తారు. వాలంటీర్లపై పవన్ చేసిన వ్యాఖ్యలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. వాలేంటీర్లు హ్యూమన్ ట్రాఫికింగ్కు పాల్పడుతున్నారని పవన్ చేసిన వ్యాఖ్యలు అభ్యంతరకరమని మండిపడ్డారు. సినిమా పరిశ్రమలో ఉన్న మహిళల గురించి విమర్శలు చేసినప్పుడు నోరు మెదపని పవన్.. రాష్ట్రంలో మహిళల రక్షణ గురించి మాట్లాడుతున్నారని వ్యాఖ్యానించారు. జగన్ సైన్యంగా అపారమైన సేవలు అందిస్తున్న వాలంటీర్ వ్యవస్థను దూరం చేసే ప్రయత్నం జరుగుతోందని అనుమానం వ్యక్తం చేశారు. ముద్రగడ భార్య, కోడలి విషయంలో తలెత్తిన ఇబ్బందులుపై పవన్ కళ్యాణ్ ఎందుకు నోరెత్తలేదని ప్రశ్నించారు.
Pawan Kalyan: రుషికొండ, ఎర్రమట్టి దిబ్బల పరిశీలనకు పవన్.. పోలీసులు పర్మిషన్ ఇచ్చేనా..?
Also Read
- Uday Krishna Reddy: అనాథగా పెరిగి ఐపీఎస్ దాకా.. ముఖ్యమంత్రిచే ప్రశంసలు.. ఉదయ్ కృష్ణారెడ్డి బ్యాగ్రౌండ్ తెలిస్తే కన్నీళ్లు ఆగవు!
- CM Chandrababu: ఢిల్లీలో సీఎం చంద్రబాబు మార్క్ రాజకీయం.. భోగాపురం ఎయిర్పోర్ట్, విశాఖ మెట్రోపై స్పీడ్..
- Schools Closed: విద్యార్థులకు బిగ్ అలర్ట్.. ఎల్లుండి స్కూల్స్, కాలేజీలు బంద్..
- AP Govt: రైతులకు, భూ యజమానులకు బిగ్ రిలీఫ్.. మరో కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన ఏపీ ప్రభుత్వం..
పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు చూస్తే.. గంజాయి మత్తులో మాట్లాడుతున్నట్టు అనిపిస్తోందని గుడివాడ అమర్నాథ్ పేర్కొన్నారు. విశాఖలో భూ దోపిడీ, గంజాయి మీద టీడీపీ హయాంలో అప్పటి మంత్రులు అయ్యన్న, గంటాలు చెప్పినప్పుడు పవన్ ఎక్కడ దాక్కున్నాడని నిలదీశారు. టీడీపీ మాజీ ఎమ్మెల్యే, గీతం సంస్థ అధీనంలో అత్యంత ఖరీదైన ప్రభుత్వ భూములు ఉంటే.. పవన్ ఎందుకు నోరు మెదపలేదని అడిగారు. నూటికి 95శాతం పథకాలు మహిళలకు ఇస్తుంటే.. దాన్ని పవన్ వక్రీకరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మద్యం ఆదాయం సంక్షేమం కోసమంటే.. పవన్ మహిళల్ని కించపరుస్తున్నారని ఫైర్ అయ్యారు. ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరనేది పవన్, చంద్రబాబు తేల్చుకోవాలే తప్ప.. ఎవరిని సీఎం చేయాలో నిర్ణయించేది జనమని ఉద్ఘాటించారు. పవన్ కళ్యాణ్ ఓ బాబా అని.. బాబా అంటే బాబుగారి బానిస అని వర్ణించారు.
Gudivada Amarnath: సంసారం బీజేపీతో, సహజీవనం టీడీపీతో.. ఇదే పవన్ కళ్యాణ్ విధానం
రాష్ట్ర విభజన కోసం ముందుగా లేఖ ఇచ్చింది టీడీపీనే అని అమర్నాథ్ తెలిపారు. రాజకీయాన్ని వ్యాపారం చేసింది పవన్ కళ్యాణ్ అని తూర్పారపట్టారు. పవన్, చంద్రబాబులు కొండలు కొట్టకుండానే.. తమ ఇళ్లను నిర్మించుకున్నారా? అని నిలదీశారు. రాజధాని విశాఖపట్నం అయినప్పుడు.. పవన్ కళ్యాణ్ రాకుండా ఏం చేస్తాడు? అని అడిగారు. రాజకీయ పార్టీలో ఉండాలనుకునే వాళ్లు రాజధానిలోనే నివాసం ఉండాలని.. అందుకు తాను స్వాగతిస్తున్నానని చెప్పారు. ఆంధ్రా యూనివర్సిటీలో డిస్టన్స్ ఎడ్యుకేషన్ విభాగం నుంచి ఒక్క సెమిస్టర్ పాస్ అయితే.. పవన్ కళ్యాణ్కు విలువ తెలుస్తుందన్నారు.
తాజావార్తలు
-
Chiranjeevi: నా అభిమానులు ఎస్కేఎన్, సాయి రాజేష్లను చూసి గర్వపడుతున్నా..
-
Delhi Protest : దేశ రాజధానిలో మళ్లీ రగిలిన ఉద్రిక్తతలు.. జంతర్ మంతర్ వద్ద రణరంగం.!
-
CM Revanth Reddy : మున్సిపల్ అధికారులకు సీఎం రేవంత్ అల్టిమేటం..
-
Vaibhav Sooryavanshi: జింబాబ్వే సిరీస్పై కన్నేసిన వైభవ్ సూర్యవంశీ.. ‘ఈ సిరీస్ వదిలే ప్రసక్తే లేదు’..
-
HYDRA Ranganath: రూ.1.5 లక్షల కోట్ల ప్రభుత్వ భూములు కాపాడాం
ట్రెండింగ్
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!