Gudivada Amarnath: అప్పుడు లేవని నోరు, ఇప్పుడెందుకు లేస్తోంది పవన్?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gudivada Amarnath Fires On Pawan Kalyan Over Volunteers Issue: విజయవాడలోని సర్క్యూట్ హౌస్లో నిర్వహించిన ప్రెస్మీట్లో ఏపీ మంత్రి గుడివాడ అమర్నాథ్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్పై ధ్వజమెత్తారు. వాలంటీర్లపై పవన్ చేసిన వ్యాఖ్యలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. వాలేంటీర్లు హ్యూమన్ ట్రాఫికింగ్కు పాల్పడుతున్నారని పవన్ చేసిన వ్యాఖ్యలు అభ్యంతరకరమని మండిపడ్డారు. సినిమా పరిశ్రమలో ఉన్న మహిళల గురించి విమర్శలు చేసినప్పుడు నోరు మెదపని పవన్.. రాష్ట్రంలో మహిళల రక్షణ గురించి మాట్లాడుతున్నారని వ్యాఖ్యానించారు. జగన్ సైన్యంగా అపారమైన సేవలు అందిస్తున్న వాలంటీర్ వ్యవస్థను దూరం చేసే ప్రయత్నం జరుగుతోందని అనుమానం వ్యక్తం చేశారు. ముద్రగడ భార్య, కోడలి విషయంలో తలెత్తిన ఇబ్బందులుపై పవన్ కళ్యాణ్ ఎందుకు నోరెత్తలేదని ప్రశ్నించారు.
Pawan Kalyan: రుషికొండ, ఎర్రమట్టి దిబ్బల పరిశీలనకు పవన్.. పోలీసులు పర్మిషన్ ఇచ్చేనా..?
Also Read
- APL 2026: బోణీ కొట్టిన అమరావతి రాయల్స్.. 6 వికెట్ల తేడాతో విజయం
- Pawan Kalyan: ‘ఇది ఎవరి జాగీరు కాదు.. నా మాతృభూమి’.. మీ అయ్య జాగీరా అనొద్దా?
- Home Minister Anitha: విశాఖలో జగన్ పర్యటనపై హోంమంత్రి కౌంటర్.. మీకు ఆ హక్కు లేదు..!
- Amaravati Development: అమరావతికి కేంద్రం భారీ శుభవార్త.. రాజధాని రూపురేఖలు మారనున్నాయా..?
పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు చూస్తే.. గంజాయి మత్తులో మాట్లాడుతున్నట్టు అనిపిస్తోందని గుడివాడ అమర్నాథ్ పేర్కొన్నారు. విశాఖలో భూ దోపిడీ, గంజాయి మీద టీడీపీ హయాంలో అప్పటి మంత్రులు అయ్యన్న, గంటాలు చెప్పినప్పుడు పవన్ ఎక్కడ దాక్కున్నాడని నిలదీశారు. టీడీపీ మాజీ ఎమ్మెల్యే, గీతం సంస్థ అధీనంలో అత్యంత ఖరీదైన ప్రభుత్వ భూములు ఉంటే.. పవన్ ఎందుకు నోరు మెదపలేదని అడిగారు. నూటికి 95శాతం పథకాలు మహిళలకు ఇస్తుంటే.. దాన్ని పవన్ వక్రీకరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మద్యం ఆదాయం సంక్షేమం కోసమంటే.. పవన్ మహిళల్ని కించపరుస్తున్నారని ఫైర్ అయ్యారు. ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరనేది పవన్, చంద్రబాబు తేల్చుకోవాలే తప్ప.. ఎవరిని సీఎం చేయాలో నిర్ణయించేది జనమని ఉద్ఘాటించారు. పవన్ కళ్యాణ్ ఓ బాబా అని.. బాబా అంటే బాబుగారి బానిస అని వర్ణించారు.
Gudivada Amarnath: సంసారం బీజేపీతో, సహజీవనం టీడీపీతో.. ఇదే పవన్ కళ్యాణ్ విధానం
రాష్ట్ర విభజన కోసం ముందుగా లేఖ ఇచ్చింది టీడీపీనే అని అమర్నాథ్ తెలిపారు. రాజకీయాన్ని వ్యాపారం చేసింది పవన్ కళ్యాణ్ అని తూర్పారపట్టారు. పవన్, చంద్రబాబులు కొండలు కొట్టకుండానే.. తమ ఇళ్లను నిర్మించుకున్నారా? అని నిలదీశారు. రాజధాని విశాఖపట్నం అయినప్పుడు.. పవన్ కళ్యాణ్ రాకుండా ఏం చేస్తాడు? అని అడిగారు. రాజకీయ పార్టీలో ఉండాలనుకునే వాళ్లు రాజధానిలోనే నివాసం ఉండాలని.. అందుకు తాను స్వాగతిస్తున్నానని చెప్పారు. ఆంధ్రా యూనివర్సిటీలో డిస్టన్స్ ఎడ్యుకేషన్ విభాగం నుంచి ఒక్క సెమిస్టర్ పాస్ అయితే.. పవన్ కళ్యాణ్కు విలువ తెలుస్తుందన్నారు.
తాజావార్తలు
-
Story Board: హైదరాబాద్లో చినుకు పడితే చిత్తడేనా..? వర్షాకాలం అంతా బిక్కుబిక్కుమనాల్సిందేనా?
-
RBI: క్రెడిట్ రిస్క్ నిబంధనల్లో కీలక మార్పులు.. ఆర్బీఐ ముసాయిదా విడుదల
-
Off The Record: BRSలో భారీ ప్రక్షాళన ఉండబోతుందా? కాస్త తేడాగా ఉన్న నాయకులకు ఫైనల్ వార్నింగ్?
-
Trump-Iran: ఈరోజే భారీగా విరుచుకుపడతాం.. ఇరాన్కు ట్రంప్ తాజా హెచ్చరిక
-
Whats App: వాట్సాప్లో అద్బుత ఫీచర్.. ఫార్వార్డెడ్ మెసేజ్ మొదట ఎక్కడ నుంచి వచ్చిందో కనిపెట్టడం చాలా ఈజీ..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!