Gudivada Amarnath: అప్పుడు లేవని నోరు, ఇప్పుడెందుకు లేస్తోంది పవన్?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gudivada Amarnath Fires On Pawan Kalyan Over Volunteers Issue: విజయవాడలోని సర్క్యూట్ హౌస్లో నిర్వహించిన ప్రెస్మీట్లో ఏపీ మంత్రి గుడివాడ అమర్నాథ్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్పై ధ్వజమెత్తారు. వాలంటీర్లపై పవన్ చేసిన వ్యాఖ్యలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. వాలేంటీర్లు హ్యూమన్ ట్రాఫికింగ్కు పాల్పడుతున్నారని పవన్ చేసిన వ్యాఖ్యలు అభ్యంతరకరమని మండిపడ్డారు. సినిమా పరిశ్రమలో ఉన్న మహిళల గురించి విమర్శలు చేసినప్పుడు నోరు మెదపని పవన్.. రాష్ట్రంలో మహిళల రక్షణ గురించి మాట్లాడుతున్నారని వ్యాఖ్యానించారు. జగన్ సైన్యంగా అపారమైన సేవలు అందిస్తున్న వాలంటీర్ వ్యవస్థను దూరం చేసే ప్రయత్నం జరుగుతోందని అనుమానం వ్యక్తం చేశారు. ముద్రగడ భార్య, కోడలి విషయంలో తలెత్తిన ఇబ్బందులుపై పవన్ కళ్యాణ్ ఎందుకు నోరెత్తలేదని ప్రశ్నించారు.
Pawan Kalyan: రుషికొండ, ఎర్రమట్టి దిబ్బల పరిశీలనకు పవన్.. పోలీసులు పర్మిషన్ ఇచ్చేనా..?
Also Read
- TDP Mahanadu 2026: మహానాడులో 20 కీలక తీర్మానాలు.. తెలంగాణ నుంచి 4 ప్రత్యేక ప్రతిపాదనలు!
- CM Chandrababu: తీరం మనదే.. బోటు మనదే.. వేట కూడా మనదే.. ఎవరైనా వస్తే వేటాడుతాం.. వెంటాడుతాం..
- Vijayawada Municipal Corporation: బెజవాడ కార్పొరేషన్లో డివిజన్ల పెంపు.. 64 నుంచి 86కు విస్తరణ.. నోటిఫికేషన్ విడుదల
- Fake Liquor Case: నకిలీ మద్యం కేసులో భారీ చార్జ్షీట్ దాఖలు.. 25 మందిపై అభియోగాలు
పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు చూస్తే.. గంజాయి మత్తులో మాట్లాడుతున్నట్టు అనిపిస్తోందని గుడివాడ అమర్నాథ్ పేర్కొన్నారు. విశాఖలో భూ దోపిడీ, గంజాయి మీద టీడీపీ హయాంలో అప్పటి మంత్రులు అయ్యన్న, గంటాలు చెప్పినప్పుడు పవన్ ఎక్కడ దాక్కున్నాడని నిలదీశారు. టీడీపీ మాజీ ఎమ్మెల్యే, గీతం సంస్థ అధీనంలో అత్యంత ఖరీదైన ప్రభుత్వ భూములు ఉంటే.. పవన్ ఎందుకు నోరు మెదపలేదని అడిగారు. నూటికి 95శాతం పథకాలు మహిళలకు ఇస్తుంటే.. దాన్ని పవన్ వక్రీకరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మద్యం ఆదాయం సంక్షేమం కోసమంటే.. పవన్ మహిళల్ని కించపరుస్తున్నారని ఫైర్ అయ్యారు. ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరనేది పవన్, చంద్రబాబు తేల్చుకోవాలే తప్ప.. ఎవరిని సీఎం చేయాలో నిర్ణయించేది జనమని ఉద్ఘాటించారు. పవన్ కళ్యాణ్ ఓ బాబా అని.. బాబా అంటే బాబుగారి బానిస అని వర్ణించారు.
Gudivada Amarnath: సంసారం బీజేపీతో, సహజీవనం టీడీపీతో.. ఇదే పవన్ కళ్యాణ్ విధానం
రాష్ట్ర విభజన కోసం ముందుగా లేఖ ఇచ్చింది టీడీపీనే అని అమర్నాథ్ తెలిపారు. రాజకీయాన్ని వ్యాపారం చేసింది పవన్ కళ్యాణ్ అని తూర్పారపట్టారు. పవన్, చంద్రబాబులు కొండలు కొట్టకుండానే.. తమ ఇళ్లను నిర్మించుకున్నారా? అని నిలదీశారు. రాజధాని విశాఖపట్నం అయినప్పుడు.. పవన్ కళ్యాణ్ రాకుండా ఏం చేస్తాడు? అని అడిగారు. రాజకీయ పార్టీలో ఉండాలనుకునే వాళ్లు రాజధానిలోనే నివాసం ఉండాలని.. అందుకు తాను స్వాగతిస్తున్నానని చెప్పారు. ఆంధ్రా యూనివర్సిటీలో డిస్టన్స్ ఎడ్యుకేషన్ విభాగం నుంచి ఒక్క సెమిస్టర్ పాస్ అయితే.. పవన్ కళ్యాణ్కు విలువ తెలుస్తుందన్నారు.
తాజావార్తలు
-
RR vs LSG: ప్లేఆఫ్ స్థానం కోసం రాజస్థాన్.. పరువు కోసం లఖ్నవూ సూపర్ జెయింట్స్.. గెలిచేదెవరో.?
-
Donald Trump : ‘మేక్ అమెరికా క్రిస్టియన్’.. అమెరికా రాజకీయాల్లో కొత్త ట్రెండ్.?
-
Airtel: ఎయిర్టెల్ వినియోగదారులకు అదిరే న్యూస్.. కేవలం రూ.449లకే మరో కొత్త సర్వీస్ అందుబాటులోకి..
-
CM Vijay: రాజీవ్గాంధీ హంతకుడికి సీఎం విజయ్ నివాళి.. రాజకీయ దుమారం రేపుతోన్న వ్యవహారం
-
Dragon : 4 నిమిషాల రన్ టైంతో ఎన్టీఆర్ ‘డ్రాగన్’ గ్లింప్స్.. ప్రశాంత్ నీల్ మాస్టర్ ప్లాన్ ఇదే!
ట్రెండింగ్
-
Tree Trimming Job: చెట్లు కొడితే చాలు.. గంటకు రూ. 49,000.. ఎక్కడంటే.?
-
రూ.13,999కే 7000mAh భారీ బ్యాటరీ, 50MP కెమెరాతో Moto g37 సిరీస్ భారత్లో లాంచ్.. ధర ఎంతంటే.?
-
కేవలం రూ.8,999కే మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, 6.6 అంగుళాల భారీ స్క్రీన్ తో Itel A100 Pro లాంచ్..!
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!