జగన్ రాక్షస మనస్తత్వాన్ని బయట పెట్టాడు : మాజీ మంత్రి జవహార్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీలో రాజకీయం రాజుకుంది. అటు టీడీపీ కార్యాలయంపై దాడికి నిరసనగా టీడీపీ ఈ రోజు ఏపీ బంద్ కు పిలుపునిస్తే.. కౌంటర్ గా వైసీపీ కూడా టీడీపీ నేతల వ్యాఖ్యలపై నిరసనలకు తెరలేపింది. ఈ నేపథ్యంలో టీడీపీ నేత, మాజీ మంత్రి జవహార్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో టీడీపీ కార్యాలయాలు, పార్టీ నాయకులపై దాడులు ద్వారా అంతర యుద్ధం జరగాలని జగన్ కోరుకున్నాడని ఆరోపణలు చేశారు. జగన్ తన రాక్షస మనస్తత్వాన్ని బయట పెట్టాడని విమర్శించారు.
అంతేకాకుండా రాష్ట్రవ్యాప్తంగా శాంతియుతంగా బందుకు టీడీపీ పిలుపునిస్తే పెద్ద ఎత్తున పోలీసులతో హౌస్ అరెస్ట్ లు చేసి అడ్డుకున్నారన్నారు. ప్రజాస్వామ్యంలో ఈ రోజు జరిగిన దాడిని అందరూ ఖండించాలని పిలుపునిచ్చారు. పోలీసులను అడ్డుపెట్టు కొని ఈ ప్రభుత్వం పిరికిపంది చర్య లు చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ నాయకులకు మందు పోయించి టీడీపీ కార్యాలయాలపై, నాయకులపై దాడి చేయించారన్నారు.
Also Read
ఇదిలా ఉంటే.. ఇప్పటికే టీడీపీ నేతల అరెస్టులతో రాష్ట్రం వ్యాప్తంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో పాటు వైసీపీ శ్రేణులు సైతం టీడీపీ నేతలు చేసిన వ్యాఖ్యలను ముందుకు తెస్తూ.. నిరసనలు చేపడుతున్నారు. చంద్రబాబు వైసీపీకి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.
తాజావార్తలు
-
Mecca Pact Explained: పాకిస్థాన్ పాచికలు చెల్లవు.. మక్కా ఒప్పందం వెనుక ఉన్న అసలు రహస్యం ఇదే!
-
Explainer: టాటా నానో రీఎంట్రీ..!? ఆటోమొబైల్ ఇండస్ట్రీలో మరో అద్భుతం!
-
Tabu AI Deepfake Case: ఏఐ వీడియోలపై కోర్టుకెక్కిన టబు.. 150 లింకులపై కీలక ఆదేశాలు!
-
Explainer: రెస్టారెంట్ కిచెన్లో బొద్దింకల కాపురం..ఈగల సంసారం.. మీరు తింటున్నది ఇదే!
-
Toxic – Ramayana : సినిమా ఎలా ఉన్నా హైప్ మాత్రం భారీగా ఉండాలి.. ఇప్పుడిదే ట్రెండ్
ట్రెండింగ్
-
4K 180Hz డిస్ప్లేతో 55, 65, 75 అంగుళాల్లో Hisense UR8S MiniLED TVలు లాంచ్..!
-
9,070mAh బ్యాటరీ, IP69 రేటింగ్, AMOLED డిస్ప్లేతో REDMI K100 Pro Max లాంచ్..!
-
200MP ట్రిపుల్ కెమెరా సెటప్, 8,580mAh బ్యాటరీ, 185Hz డిస్ప్లేతో REDMI K100 Pro లాంచ్.. ధర ఎంతంటే?
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!