Flood Loss Estimations: భారీగా పంట నష్టం.. అంచనాల్లో అధికారగణం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎన్నడూ లేనివిధంగా తుపానుతో వచ్చే వర్షాల కంటే ఈసారి వానలు కుమ్మేశాయి. గోదావరి ఉగ్ర రూపానికి ఊళ్ళు ఏరులైపోయాయి. భారీ ఎత్తున వరద పోటెత్తడంతో ఏపీలో మొత్తంగా ఆరు జిల్లాలు అతలాకుతలంగా మారాయి. భారీ ఎత్తున పంట, ఆస్తి నష్టం వచ్చి ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. వరద నష్టం అంచనా అనేది ఇప్పటికిప్పుడే సాధ్యం కాకున్నా.. ప్రాథమిక స్థాయిలో వరద నష్టాన్ని అంచనా వేసి నివేదిక సమర్పించారు. ఎల్లుండి నుంచి పంట నష్టం అంచనా పనులను అధికార యంత్రాంగం ముమ్మరంగా చేపట్టనుంది.
గోదావరి మహోగ్ర రూపం చూపిస్తోంది. గత 36 ఏళ్లల్లో ఎన్నడూ లేనంతగా వరద సంభవించింది. ఏపీలో మొత్తంగా ఐదు జిల్లాల్లో వరద ముంచెత్తింది. అల్లూరి సీతారామ రాజు, ఏలూరు, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, అంబేద్కర్ కోనసీమ జిల్లాల్లో ఎంత మేర పంట నష్టం సంభవించిందనే దానిపై అధికార యంత్రాంగం కసరత్తు చేస్తోంది. ప్రస్తుతం అటు ఊళ్లన్నీ ఇంకా ముంపులోనే ఉండడంతో పూర్తి స్థాయిలో నష్టం అంచనా వేయడం సాధ్యం కాదను. ఈ క్రమంలో ప్రాథమికంగా నష్టం ఎంత జరిగి ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
Also Read
- YS Jagan: డీఎస్సీ నిరసనలపై దాడులు దారుణం.. Gen Z గొంతును మూయలేరు..
- CM Chandrababu: వారికి ఎంతైనా ఖర్చు పెట్టాలనుంది.. కానీ ఖజానా ఖాళీగా ఉంది!
- Vijaya Dairy Election: విజయ డెయిరీ ఎన్నికపై టీడీపీలో హైడ్రామా.. ఆస్పత్రిలో చైర్మన్ చలసాని!
- Rentachintala-Kurnool Murders: రెంటచింతలలో వైసీపీ నేత.. కర్నూలులో టీడీపీ కార్యకర్త హత్య!
వరదల వ్యవసాయ పంటలకు సుమారు 7842 ఎకరాల్లో పంట నష్టం సంభవించింది. అలాగే హర్టికల్చర్కు సంబంధించి 14650 ఎకరాల్లో పంట నష్టం జరిగిందని ప్రాథమిక అంచనా వేశారు అధికారులు. ఇదే సందర్భంలో 1100 కిలో మీటర్ల మేర రహదారులు దెబ్బతిన్నాయి. అయితే ఇదంతా ప్రాథమికంగా వేసిన అంచనా మాత్రమే. ఇవే కాకుండా.. ఇంకొన్ని చోట్ల విద్యుత్ స్థంభాలు ఒరిగిపోవడం.. ట్రాన్స్ఫార్మర్లు దెబ్బ తినడం వంటివి కూడా జరిగాయి. అయితే ప్రస్తుతం వ్యవసాయ సీజన్ తొలి నాళ్లల్లోనే ఉండడంతో వ్యవసాయ పంటలకు నష్టం కొంత మేరకే ఉండొచ్చని.. కానీ హర్టికల్చర్కు మాత్రం భారీగానే నష్టం జరిగే సూచనలు కన్పిస్తోంది.
Farmers Hopes: వర్షాలతో ఏరువాకకు అన్నదాతలు సిద్ధం
గత రెండు మూడేళ్ల నుంచి వరదలు ఏపీని ఏదోక చోట ఇబ్బంది పెడుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో నష్టం కూడా భారీగానే సంభవిస్తోంది. ఈ క్రమంలో ప్రస్తుతం వరదలు భారీగా వచ్చిన సందర్భంలో నష్టం కూడా భారీగానే ఉంటుందని అంచనా వేస్తున్న సర్కార్.. ఆ మేరకు నివేదికలను సిద్దం చేసి కేంద్రానికి సమర్పించేందుకు కసరత్తు చేస్తోంది. సోమవారం నాటికల్ల వరద తీవ్రత చాలా వరకు తగ్గుతుందని అంచనా వేస్తున్న అధికారులు.. సోమవారం నుంచి నష్టం అంచనా పనులను మరింత ముమ్మరంగా చేపట్టనున్నారు.
తాజావార్తలు
-
Supreme Court: ‘గుడ్లకు భయమెందుకు?’.. మహువా మొయిత్రాకు సుప్రీంకోర్టు చురకలు
-
CM Vijay : విజయ్కు కోర్టులో బిగ్ రిలీఫ్.. సంగీత సంచలన నిర్ణయం, విడాకుల పిటిషన్ వెనక్కి.!
-
Minister Kishan Reddy: 5 కోట్ల మందికి పైగా ఉపాధి.. చేనేత కార్మికులకు ప్రభుత్వం అందిస్తున్న కానుక..
-
First Salary Investment Guide: మొదటి జీతమే భవిష్యత్తుకు పునాది.. SIP, FD, RD.. మీ లక్ష్యానికి ఏది సరిపోతుంది? పూర్తి గైడ్..
-
Mumbai: సునేత్ర పవార్తో ప్రశాంత్ కిషోర్ భేటీ.. మహారాష్ట్రలో కొత్త ఊహాగానాలు
ట్రెండింగ్
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్తో REDMI 17 5G లాంచ్..!
-
Will Jacks: సూపర్మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్కు గుడ్బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!