Farmers Hopes: వర్షాలతో ఏరువాకకు అన్నదాతలు సిద్ధం
కరవు ప్రాంతమైన అనంతపురం జిల్లాలో ఈసారి ఆశించిన స్థాయిలో వర్షం కురవకపోయినా.. రైతులు మాత్రం లక్షల ఎకరాల్లో ఆరుతడి పంటల సాగుకు సిద్ధమవుతున్నారు. అదెలా అంటే జిల్లాకు ప్రధాన నీటి వనరుగా అన్న తుంగభద్రకు గతంలో ఎప్పుడూ లేని విధంగా రికార్డు స్థాయిలో వరద నీరు రావడమే. జులై రెండవ వారంలోనే గేట్లు ఎత్తివేయడం.. హెచ్చెల్సీకి నీరు విడుదల చేయడంతో రైతుల్లో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. దేశంలో అత్యల్ప వర్షపాతం కురిసే ప్రాంతంలో అనంతపురం జిల్లా కూడా ఒకటి. ఇక్కడ వర్షాలు ఎప్పుడొస్తాయో తెలియదు. రైతులు ఆకాశం వైపు చూడటం తప్ప చినుకు కిందకు రాలే పరిస్థితి ఉండదు. ఇలాంటి పరిస్థితుల్లో జిల్లాకు ప్రధాన సాగు, తాగునీటి వనరు తుంగభద్ర జలాశయం. ఏపీ, కర్ణాటక ఉమ్మడి ప్రాజెక్ట్ అయిన తుంగభద్ర నుంచి అనంతపురం జిల్లాకు నికర వాటా ఉంది.
అందుకే ఇక్కడ సుమారు రెండులక్షల ఎకరాల్లో వరి ఇతర పంటలు సాగవుతాయి. గత మూడేళ్లుగా వర్షాలు సంవృద్ధిగా కురుస్తుండటంతో ఆశించిన స్థాయిలో నీరు తుంగభద్రకు చేరుతోంది. అయితే గత పదేళ్లలో ఎప్పుడూ లేని విధంగా ఈసారి జులై నెలలోనే తుంగభద్ర జలాశయంకు నీరు చేరింది. అనంతపురం జిల్లాలో ఈ ఏడాది వర్షాలు కురవకపోయినా.. కర్ణాటక ప్రాంతంలో భారీ వర్షాల కారణంగా రికార్డు స్థాయిలో వరద వచ్చింది. అందుకే జులై రెండవ వారంలోనే జలాశయం పూర్తిగా నిండి గేట్లు ఎత్తివేసే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు దాదాపు వారం రోజులుగా లక్ష క్యూసెక్కులకు పైగా ఇన్ ఫ్లో ఉంది. దీంతో అనంతపురం జిల్లా నీరు సరఫరా అయ్యే హెచ్చెల్సీకి కూడా రెండవ వారంలోనే నీటి విడుదల చేశారు.
Also Read
- Instagram Reel Leads to Poisoning: ప్రాణం మీదకు తెచ్చిన ఇన్స్టా రీల్ వంటకం.. నలుగురి పరిస్థితి విషమం..
- South Coast Railway Zone: విశాఖ రైల్వే జోన్పై కేంద్రం సర్ప్రైజ్ గెజిట్..
- Minister Narayana : గోదావరి పుష్కరాలకు ముందస్తు ప్లాన్.. నిధుల కోసం ప్రధానితో సీఎం చర్చలు
- CM Chandrababu : గ్లోబల్ బ్రాండ్లుగా స్థానిక ఉత్పత్తులు.. ఏపీలో ప్రొడక్ట్ పర్ఫెక్షన్ క్లస్టర్లపై చంద్రబాబు సమీక్ష
Ramarao On Duty Trailer: ధర్మం కోసం రామారావు చేసిన డ్యూటీ ఏంటి..?
ఇప్పటికే తుంగభద్ర జలాశయం నుంచి హెచ్చెల్సీకి విడుదల చేసిన వాటా నీరు జిల్లా సరిహద్దుకు చేరింది. ఈ నెల 12న టీబీపీ బోర్డు అధికారులు నీటిని విడుదల చేశారు. కర్ణాటకను దాటుకుని.. సరిహద్దులోని 105వ కి.మీ. వద్దకు బుధవారం అర్ధరాత్రి తుంగభద్ర జలాలు చేరుకున్నాయి. దీంతో బొమ్మనహాళ్, కణేకల్లు మండలాల్లోని ఆయకట్టు కింద వరి, మొక్కజొన్న, పత్తి, జొన్న తదితర పంటలను సాగు చేసేందుకు రైతులు సిద్ధమవుతున్నారు. వరి రైతులు ఇప్పటికే నారు పోశారు. సోనా మసూరీని వదిలి, తక్కువ రోజుల్లో దిగుబడి చేతికి వచ్చే వరి రకాలను వినియోగిస్తున్నారు. గతంలో ఏపీ వాటా 32టీఎంసీలు ఉండగా.. తుంగభద్రలో పూడిక కారణంగా అది క్రమంగా 24టీఎంసీలకు పడిపోయింది. మూడేళ్ల క్రితం వరకు పూర్తి నీరు తీసుకున్న సందర్భాలు లేవు. అయితే గత మూడేళ్లుగా వర్షాలు బాగా కురుస్తుండటంతో వాటా కంటే ఎక్కువగా నీరు తీసుకునే పరిస్థితి ఉంది. ఈసారి జులైలోనే నీటి రాకపై రైతుల్లో మరింత ఆశలు పెరిగాయి.
ప్రస్తుతం తుంగభద్ర జలాశాయం నుంచి లక్ష 30వేల క్యూసెక్కుల నీరు గేట్లు ఎత్తి దిగువకు నీరు విడుదల చేస్తున్నారు. కానీ మనం వాటిని వినియోగించుకోలేని దుస్థితి. దీనికి ప్రధానమైన కారణం.. హెచ్చెల్సీ కాలువ అధ్వాన్న స్థితికి చేరుకోవడం. అక్విటేడ్ లు, స్ట్రక్ఛర్లు ప్రమాదంగా మారాయి. కాల్వ గట్లు మొత్తం కంపచెట్ల పెరగిపోయాయి. ఏటా నీటి విడుదలకు ముందు జలవనరులశాఖ అధికారులు కంపచెట్లు తొలగించడం…పాడైన నిర్మాణాలను పునరుద్ధరించడం వంటి పనులు చేపట్టే వారు. ఈ సారి నీటి విడుదల తేదీ ఖరారైనా పనులు చేపట్టలేదు.
కర్ణాటకలోని హొసపేట వద్ద ఉన్న తుంగభద్ర డ్యాం నుంచి హెచ్ ఎల్సీ 105 కిలోమీటర్లు కర్ణాటకలో ఉంది. పొరుగు రాష్ట్రం సరిహద్దు 105 కిలోమీటరు నుంచి సుమారు 81 కిలోమీటర్లు అనంతపురం జిల్లాలో ఉంది. కర్ణాటకలో 105 కిలోమీటర్ల కాల్వ ఆధునికీకరణ పనులను అక్కడి ప్రభుత్వం ఇటీవల పూర్తిచేసింది. దాదాపు 4000 క్యూసెక్కుల నీరు పారే విధంగా కాల్వను వెడల్పు చేశారు. కానీ ఇక్కడ కాలువ వెడల్పు సంగతి పక్కన బెడితే అసలు మరమ్మతులు చేసే పరిస్థితి కూడా లేదు. అందుకే కనీసం 2వేల క్యూసెక్కుల సమార్థ్యంతో కూడా నీరు తీసుకోలేని పరిస్థితి ఉంది. నీరు ఏమాత్రం ఎక్కువగా విడుదల చేసినా కాలువ గట్లు తెగిపోతాయి. గతంలో ఇలాంటి పరిస్థితులు చూశారు కూడా. మొత్తం మీద జులై రెండవ వారంలో నీరు ఈస్థాయిలో రావడం సంతోషకరమైనా వాటిని పూర్తి స్థాయిలో వినియోగించు కోలేకపోతున్నాం.
తాజావార్తలు
-
Prabhas Fauj : ప్రభాస్ ఫౌజీ మూవీ షూటింగ్ కు వెళ్తున్న ప్రొడక్షన్ వాహనం కు యాక్సిడెంట్
-
West Bengal: బీజేపీ విజయం తర్వాత తెరుచుకున్న దుర్గా ఆలయం.. భక్తుల్లో ఆనందోత్సాహం
-
TVK : టీవీకే విజయకేతనం.. విజయ్ వెనుక అసలైన ‘చాణక్యుడు’ ఇతడే
-
Stock Market Crash: గల్ఫ్ ‘టెన్షన్’.. మార్కెట్ ‘డిప్రెషన్’.. భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్.. 500 పాయింట్లు పడిపోయిన సెన్సెక్స్!
-
Walking 10,000 Steps Daily: రోజుకు 10,000 అడుగులు నడవడం నిజంగా అవసరమా..? మోకాళ్లపై ప్రభావం ఏమిటి?
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!