CM Chandrababu: ఫైళ్ల క్లియరెన్స్ స్పీడ్ గా జరగాలి..
- డీఎస్సీ అభ్యర్థులకు గుడ్ న్యూస్ చెప్పిన సీఎం చంద్రబాబు..
- త్వరలోనే మెగా డీఎస్సీ వేస్తామని ప్రకటించిన ఏపీ సీఎం..
- ఫైళ్ల క్లియరెన్స్ స్పీడ్ గా జరగాలి.. వాట్సాప్ గవర్నెన్స్ లో అన్ని సర్వీసులు ఉండాలి..
- అర్చకులు సీఎస్ రంగరాజన్ పై దాడిని ఖండించిన సీఎం చంద్రబాబు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Chandrababu: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు ఆర్థిక శాఖపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఫైళ్ల క్లియరెన్స్ స్పీడ్ గా జరగాలని సీఎం చంద్రబాబు సూచించారు. జీఎస్డీపీ గ్రోత్ బాగా పెరగాలి.. ఈ విషయం సీరియస్ గా తీసుకోవాలి.. రాష్ట్రంలో ఏం జరిగిందో చెప్పడానికి ఇంటలిజెన్స్ ఉంది.. వాట్సాప్ గవర్నెన్స్ లో అన్ని సర్వీసులు ఉండాలి అని తెలిపారు. ఎన్నికల మ్యానిఫెస్టోలో ఆర్థిక సంబంధం లేని సమస్యలు పరిష్కరించాలి.. డబ్బులు లేవని పనులు ఆపొద్దని పేర్కొన్నారు. కార్యదర్శులు అప్పుడప్పుడు క్షేత్ర స్థాయిలోకి వెళ్ళాలి అని చెప్పారు. అధికారులు అందరూ గ్రామాల్లో పర్యటనలు చెయ్యాలి.. వచ్చే ఏడాది జరిగే కార్యక్రమాలపై దృష్టి పెట్టాలి అన్నారు. ఉగాది రోజు పీ4 ప్రారంభం అవుతుంది.. హ్యాపీ సండే ప్రోగ్రాం కూడా త్వరలో ప్రారంభిస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు.
Read Also: IPL 2025: ఐపీఎల్కి ముందు భారీ మార్పు.. మారనున్న ఆ జట్టు యజమాని..!
Also Read
- Firecracker Shop Fire: వ్యాపార ప్రచారం కోసం రీల్.. బాణసంచా దుకాణంలో మంటలు, యజమాని మృతి
- Amaravati: రాజధానికి మాస్ ట్రాన్స్పోర్టేషన్ ప్రణాళిక.. సీఆర్డీఏ కీలక నిర్ణయం
- CM Chandrababu: ఇక ఇంటిపై పూర్తి హక్కు.. విశాఖలో 28,445 కుటుంబాల కల సాకారం
- Botsa Anusha: భీమిలి YSRCP నియోజకవర్గ సమన్వయకర్తగా బొత్స అనూష
అలాగే, డీఎస్సీ అభ్యర్థులకు తీపి కబురు చెప్పారు సీఎం చంద్రబాబు. త్వరలోనే మెగా డీఎస్సీ నిర్వహిస్తామని తెలిపారు. అలాగే, 22 వేల కోట్ల రూపాయల పాత బకాయిలు చెల్లిస్తున్నామన్నారు. రాష్ట్రం బాధల్లో ఉన్న ముందుకు వెళ్తున్నాం.. బకాయిలు చెల్లిస్తున్నాం అన్నారు. ఇక, ఉద్యోగులకు ఒకటో తేదీన జీతాలు ఇవ్వాల్సిందేనని ఆయన చెప్పుకొచ్చారు. ఏపీలోని రోడ్లపై గుంతలు కనిపించకూడదు అని సూచనలు చేశారు. నాలుగేళ్లలో రహదారులు మొత్తం బాగు పడాలి.. గతంలో రోడ్లపై వెళ్లాలంటే భయం వేసేది.. త్వరలో గుంతలు రహితంగా రోడ్లు ఉండాలని సీఎం చంద్రబాబు అధికారులకు తెలిపారు.
Read Also: Swati Maliwal: దోపిడీ కోసం కేజ్రీవాల్ తన ‘‘గుండా’’ని పంజాబ్ పంపాడు..
ఇక, చిలూకురు బాలాజీ ఆలయంలోని ప్రధాన అర్చకులు సీఎస్ రంగరాజన్ పై జరిగిన దాడిని సీఎం చంద్రబాబు తీవ్రంగా ఖండించారు. ఆ దాడిని దారుణ సంఘటనగా పేర్కొన్నారు. నాగరిక సమాజంలో పరస్పర గౌరవంతో కూడిన సంభాషణకు, భిన్నాభిప్రాయాలకు స్థానం ఉండాలి అని పేర్కొన్నారు. హింసకు ఎప్పుడూ తావుండకూడదు అని చెప్పుకొచ్చారు. ఈ దాడిని ఖచ్చితంగా తిరస్కరించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు.
తాజావార్తలు
-
Sonu Sood: కొత్త ఐఫోన్ కోసం క్యూలో జనం.. యూజర్స్ కి సోనూ సూద్ చురకలు
-
Peddi – Irumudi: ‘పెద్ది’ ఓడిపోయింది.. ‘ఇరుముడి’ గెలవలేకపోయింది!
-
Ajit Agarkar: చీఫ్ సెలెక్టర్ పదవికి అజిత్ అగార్కర్ గుడ్బై? బీసీసీఐలో హాట్ టాపిక్
-
Lava Bold N4 Pro 5G: లావా Bold N4 Pro 5G లాంచ్.. Android 16, 6,000mAh బ్యాటరీ, 5Gతో కొత్త ఫోన్
-
Jailer 2: ‘జైలర్ 2’ నుంచి ఫస్ట్ ప్రోమో రిలీజ్.. సూరజ్ వెంజరమూడుకు అదిరిపోయే క్యారెక్టర్!
ట్రెండింగ్
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!