Cyber Fraud: తెలుగు అమ్మాయిలతో సైబర్ వల.. ఢిల్లీ ముఠా దందా బట్టబయలు
- తెలుగు మహిళలనే టెలీకాలర్లుగా నియమించిన ముఠా
- రుణాల పేరుతో ప్రాసెసింగ్ ఫీజుల వసూళ్లు
- బాధితులను బెదిరిస్తూ బ్లాక్మెయిలింగ్
- 22 సైబర్ క్రైమ్ కేసులతో ముఠాకు లింకులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలుగు మాట్లాడే మహిళలను టెలీకాలర్లుగా నియమించుకుని, తెలంగాణలోని అమాయక ప్రజలను లక్ష్యంగా చేసుకుని భారీగా సైబర్ మోసాలకు పాల్పడుతున్న ఢిల్లీ కేంద్రంగా పనిచేస్తున్న ముఠా గుట్టును తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (టీజీసీఎస్బీ) రట్టు చేసింది. ఢిల్లీలోని శివ మార్కెట్లో నిర్వహిస్తున్న మూడు మోసపూరిత కాల్ సెంటర్లపై సమన్వయంతో దాడులు నిర్వహించిన అధికారులు, 21 మంది మహిళా టెలీకాలర్లు , ఒక పురుష బ్యాంకు ఖాతాదారుడిని అదుపులోకి తీసుకున్నారు. లలిత్ సింగ్, కుల్దీప్ సింగ్, అనిల్ అనే ముగ్గురు ప్రధాన నిర్వాహకుల నేతృత్వంలో వేర్వేరు బృందాలుగా ఈ కాల్ సెంటర్లు గత ఏడాదిన్నర కాలంగా పనిచేస్తున్నట్లు విచారణలో వెల్లడైంది. అయితే ఈ ప్రధాన నిర్వాహకులు ప్రస్తుతం పరారీలో ఉన్నారు.
తెలుగు అమ్మాయిలే ఆయుధంగా.. రుణాల పేరుతో దారుణ దోపిడీ
మోసగాళ్లు ప్రత్యేకంగా 25 నుంచి 40 ఏళ్ల మధ్య వయసున్న, తెలుగు మాట్లాడే మహిళలను టెలీకాలర్లుగా నియమించుకున్నారు. జగిత్యాల జిల్లా కోరుట్ల, హైదరాబాద్లోని సైదాబాద్, బోరబండ, మహబూబ్నగర్ జిల్లాలకు చెందిన మహిళలు ఈ కాల్ సెంటర్లలో పనిచేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. తమ సొంత భాషలో అనర్గళంగా మాట్లాడటంతో బాధితులు సులభంగా వీరిని నమ్మేవారు. తాము బజాజ్ ఫైనాన్స్ ప్రతినిధులమని చెప్పి, ఆకర్షణీయమైన రుణ ఆఫర్లు ఉన్నాయంటూ వల వేసేవారు. రుణం మంజూరు కావాంటే ప్రాసెసింగ్ ఫీజు, వెరిఫికేషన్, డాక్యుమెంటేషన్ ఛార్జీలు, బీమా ప్రీమియంల పేరుతో విడతలవారీగా డబ్బులు వసూలు చేసి, ఆ తర్వాత సంభాషణలు నిలిపివేసేవారు.
Also Read
- Varuna Yagam : ముగిసిన వరుణయాగం.. పాల్గొన్న సీఎం రేవంత్ దంపతులు
- Palamuru Rangareddy Project: పాలమూరుకు కేంద్రం షాక్.. జాతీయ హోదాపై క్లారిటీ.!
- SIR: కొన్ని గంటల్లో ముగియనున్న SIR ఫారమ్ల సమర్పణ.. 60 శాతం నమోదు..
- TPCC Chief Mahesh Kumar Goud: పుట్టుకతో చక్రవర్తులు అవుతారు.. కానీ పాపన్న పోరాడి రాజయ్యాడు..
బెదిరింపులు, బ్లాక్మెయిలింగ్ – 22 కేసులతో లింకులు
తాము మోసపోయామని గ్రహించిన బాధితులు డబ్బులు తిరిగి ఇవ్వాలని కోరితే నిందితులు దారుణ బెదిరింపులకు దిగేవారు. పోలీసులకు ఫిర్యాదు చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని, వ్యక్తిగత సమాచారాన్ని, గుర్తింపు పత్రాలను దుర్వినియోగం చేసి పరువు తీస్తామని హెచ్చరిస్తూ భయభ్రాంతులకు గురిచేసేవారు. ఈ ఆపరేషన్లో భాగంగా అధికారులు 23 మొబైల్ ఫోన్లు, రెండు బ్యాంకు పాస్బుక్కులను స్వాధీనం చేసుకున్నారు. తెలంగాణ వ్యాప్తంగా నమోదైన 22 సైబర్ నేర కేసులతో ఈ ముఠాకు సంబంధాలు ఉన్నట్లు ప్రాథమికంగా నిర్ధారణ అయింది. పరారీలో ఉన్న ప్రధాన సూత్రధారుల కోసం పోలీసులు గాలింపు చర్యలు వేగవంతం చేశారు.
తాజావార్తలు
-
Cyber Fraud: తెలుగు అమ్మాయిలతో సైబర్ వల.. ఢిల్లీ ముఠా దందా బట్టబయలు
-
Kalki 2 Casting Call: డార్లింగ్ ప్రభాస్ సినిమాలో ఛాన్స్ కావాలా? ‘కల్కి 2’ కోసం మేకర్స్ బంపర్ ఆఫర్!
-
Ranabaali: రణబాలి రిలీజ్పై బిగ్ అప్డేట్! విజయ్ దేవరకొండ-రష్మిక సినిమా కొత్త డేట్ ఇదేనా?
-
JPSC: పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యుల రాజీనామా.. 13 పరీక్షల్లో అక్రమాలు.. రాంచీకి వేలాదిగా తరలి వెళ్లిన విద్యార్థులు..
-
Akhil Akkineni: అఖిల్-సాదినేని నిజం కాదట!
ట్రెండింగ్
-
Kitchen Hacks : నూనె సీసాల జిడ్డు పోవాలంటే.. ఈ 4 చిట్కాలు ట్రై చేయండి.!
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!