Swati Maliwal: దోపిడీ కోసం కేజ్రీవాల్ తన ‘‘గుండా’’ని పంజాబ్ పంపాడు..
- కేజ్రీవాల్పై విరుచుకుపడిన స్వాతి మలివాల్..
- దోపిడి కోసం తన గుండాని పంజాబ్ పంపాడు..
- సీఎం మాన్ ముఖ్య సలహాదారుగా బిభవ్ కుమార్..
- బిభవ్ కుమార్ని ఉద్దేశించి మలివాల్ ఆరోపణలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Swati Maliwal: ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) అధినేత అరవింద్ కేజ్రీవాల్పై రాజ్యసభ ఎంపీ స్వాతి మలివాల్ సంచలన ఆరోపణలు చేశారు. పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్కి ముఖ్య సలహాదారుడిగా తన గుండా బిభవ్ కుమార్ని కేజ్రీవాల్ నియమించారని, పంజాబ్ నుంచి దోచుకున్న డబ్బుని ఢిల్లీకి తీసుకువస్తున్నడని మంగళవారం ఆమె సంచలన ఆరోపణలు చేశారు. కేజ్రీవాల్ తనను తాను సరిదిద్దుకోవాలని లేకపోతే ఢిల్లీలో జరిగిందే పంజాబ్లో జరుగుతుందని హెచ్చరించారు.
Read Also: Agatya Trailer: “120 ఏళ్ల క్రితం ఆత్మలని కలవాలనుకుంటున్నారా?” ‘అగత్యా’ ట్రైలర్ చూసేయండి..
Also Read
- NEET-UG 2026 paper leak: నీట్ పేపర్ లీక్ను ఛేదించిన సీబీఐ.. అసలు సూత్రధారి కెమిస్ట్రీ లెక్చరర్..
- Chennai: టెక్ మహీంద్రా కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం.. మంటల్లో ఆఫీస్ దగ్ధం
- FSSAI : పామాయిల్పై కీలక ప్రకటన.. అపోహలు వద్దు.. అది సురక్షితం..!
- Pakistan: అజ్ఞాత వ్యక్తుల చేతిలో లష్కరే తోయిబా టాప్ కమాండర్ హతం..
పంజాబ్ ఇసుక మాఫియా గుప్పట ఉందని, రాష్ట్ర ప్రభుత్వ విభాగాల్లో బదిలీ పోస్టింగుల్లో ప్రతీ చోట అవినీతి జరుగుతోందని ఆమె ఆరోపించారు. రియల్ ఎస్టేట్ డెవలపర్ల నుంచి విస్తృతంగా దోపిడీ జరుగుతోందని ఆమె ఆరోపించారు. ఢిల్లీకి డబ్బు తిరిగి పంపే ప్రయత్నంలో కేజ్రీవాల్ కొన్ని నెలల క్రితం తన “గూండా” బిభవ్ కుమార్ను పంజాబ్కు పంపించాడా అని మలివాల్ ప్రశ్నించారు. కొంత మంది పంజాబ్ని తమ సొంత ఏటీఎంగా వాడుకుంటున్నారని ఆరోపించారు. కేజ్రీవాల్ పార్టీకి అధికారం ఇచ్చినప్పటికీ ఏమీ చేయలేదని ఎమ్మెల్యేలు, ప్రజలు చాలా కోపంగా ఉన్నానని, పంజాబ్కి కేజ్రీవాల్ ఏం చేశానని మలివాల్ ప్రశ్నించారు.
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ ఘోర పరాజయం తర్వాత పంజాబ్ ఆప్ ప్రభుత్వంపై ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. పంజాబ్ సీఎం భగవంత్ మాన్ని మారుస్తారనే చర్చ నడుస్తోంది. ఆప్ ఎమ్మెల్యేలు 30 మంది తమతో టచ్లో ఉన్నారని కాంగ్రెస్ పేర్కొంది. ఇక బిభవ్ కుమార్ విషయానికి వస్తే, స్వాతి మలివాల్పై భౌతిక దాడి చేసింది ఇతడే. గతేడాది మేలో కేజ్రీవాల్ ఇంటికి వెళ్లిన సందర్భంలో దాడి చేశాడు. ప్రస్తుతం ఇతడినే పంజాబ్ సీఎంకి ముఖ్య సలహాదారుగా నియమించారు. ఇతడికి Z+ భద్రత లభించడం పలువురిని ఆశ్చర్యపరిచింది.
తాజావార్తలు
-
NEET-UG 2026 paper leak: నీట్ పేపర్ లీక్ను ఛేదించిన సీబీఐ.. అసలు సూత్రధారి కెమిస్ట్రీ లెక్చరర్..
-
Viral Suit Chef: రోడ్డు పక్కన ఫ్రైడ్ రైస్ అమ్ముతూ నెల రూ.7 లక్షలు సంపాదిస్తున్న 19 ఏళ్ల కుర్రాడు..
-
Chennai: టెక్ మహీంద్రా కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం.. మంటల్లో ఆఫీస్ దగ్ధం
-
Pawan Kalyan : ఒక్కడిగా మొదలై.. లక్షలాది మంది సైన్యంగా.. జనసేన విస్తరణపై పవన్ కీలక వ్యాఖ్యలు.!
-
FSSAI : పామాయిల్పై కీలక ప్రకటన.. అపోహలు వద్దు.. అది సురక్షితం..!
ట్రెండింగ్
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!