Swati Maliwal: దోపిడీ కోసం కేజ్రీవాల్ తన ‘‘గుండా’’ని పంజాబ్ పంపాడు..
- కేజ్రీవాల్పై విరుచుకుపడిన స్వాతి మలివాల్..
- దోపిడి కోసం తన గుండాని పంజాబ్ పంపాడు..
- సీఎం మాన్ ముఖ్య సలహాదారుగా బిభవ్ కుమార్..
- బిభవ్ కుమార్ని ఉద్దేశించి మలివాల్ ఆరోపణలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Swati Maliwal: ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) అధినేత అరవింద్ కేజ్రీవాల్పై రాజ్యసభ ఎంపీ స్వాతి మలివాల్ సంచలన ఆరోపణలు చేశారు. పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్కి ముఖ్య సలహాదారుడిగా తన గుండా బిభవ్ కుమార్ని కేజ్రీవాల్ నియమించారని, పంజాబ్ నుంచి దోచుకున్న డబ్బుని ఢిల్లీకి తీసుకువస్తున్నడని మంగళవారం ఆమె సంచలన ఆరోపణలు చేశారు. కేజ్రీవాల్ తనను తాను సరిదిద్దుకోవాలని లేకపోతే ఢిల్లీలో జరిగిందే పంజాబ్లో జరుగుతుందని హెచ్చరించారు.
Read Also: Agatya Trailer: “120 ఏళ్ల క్రితం ఆత్మలని కలవాలనుకుంటున్నారా?” ‘అగత్యా’ ట్రైలర్ చూసేయండి..
Also Read
- Train Ticket Booking: ప్రయాణికులకు శుభవార్త.. మరింత ఈజీగా బుకింగ్లు.. ఎప్పటి నుంచంటే..!
- Mahua Moitra: అమిత్ షా పిలవగానే వెళ్తావా సిగ్గు లేదా.? యూసుఫ్ పఠాన్పై మహువా మోయిత్రా ఫైర్..
- UP: ‘నాకు విడాకులు ఇచ్చేయండి’.. ఓ వింతైన కారణంతో కోర్టుకెళ్లిన నూతన వధువు
- INIDIA alliance: ఇండియా కూటమి సమావేశానికి విజయ్ పార్టీకి నో ఎంట్రీ.. కాంగ్రెస్ చెప్పిన కారణం ఇదే!
పంజాబ్ ఇసుక మాఫియా గుప్పట ఉందని, రాష్ట్ర ప్రభుత్వ విభాగాల్లో బదిలీ పోస్టింగుల్లో ప్రతీ చోట అవినీతి జరుగుతోందని ఆమె ఆరోపించారు. రియల్ ఎస్టేట్ డెవలపర్ల నుంచి విస్తృతంగా దోపిడీ జరుగుతోందని ఆమె ఆరోపించారు. ఢిల్లీకి డబ్బు తిరిగి పంపే ప్రయత్నంలో కేజ్రీవాల్ కొన్ని నెలల క్రితం తన “గూండా” బిభవ్ కుమార్ను పంజాబ్కు పంపించాడా అని మలివాల్ ప్రశ్నించారు. కొంత మంది పంజాబ్ని తమ సొంత ఏటీఎంగా వాడుకుంటున్నారని ఆరోపించారు. కేజ్రీవాల్ పార్టీకి అధికారం ఇచ్చినప్పటికీ ఏమీ చేయలేదని ఎమ్మెల్యేలు, ప్రజలు చాలా కోపంగా ఉన్నానని, పంజాబ్కి కేజ్రీవాల్ ఏం చేశానని మలివాల్ ప్రశ్నించారు.
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ ఘోర పరాజయం తర్వాత పంజాబ్ ఆప్ ప్రభుత్వంపై ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. పంజాబ్ సీఎం భగవంత్ మాన్ని మారుస్తారనే చర్చ నడుస్తోంది. ఆప్ ఎమ్మెల్యేలు 30 మంది తమతో టచ్లో ఉన్నారని కాంగ్రెస్ పేర్కొంది. ఇక బిభవ్ కుమార్ విషయానికి వస్తే, స్వాతి మలివాల్పై భౌతిక దాడి చేసింది ఇతడే. గతేడాది మేలో కేజ్రీవాల్ ఇంటికి వెళ్లిన సందర్భంలో దాడి చేశాడు. ప్రస్తుతం ఇతడినే పంజాబ్ సీఎంకి ముఖ్య సలహాదారుగా నియమించారు. ఇతడికి Z+ భద్రత లభించడం పలువురిని ఆశ్చర్యపరిచింది.
తాజావార్తలు
-
Train Ticket Booking: ప్రయాణికులకు శుభవార్త.. మరింత ఈజీగా బుకింగ్లు.. ఎప్పటి నుంచంటే..!
-
Israel-Iran: ఇరాన్ సీజ్ఫైర్పై ఇజ్రాయెల్ మౌనం.. సర్వత్రా ఉత్కంఠ!
-
Vaibhav: 15 ఏళ్ల వండర్ కిడ్ ‘వైభవ్ సూర్యవంశీ’పైనే అందరి కళ్ళు.. లంక పిచ్లపై భారత్ ‘ఎ’ ట్రై-సిరీస్ పోరు..
-
Mahua Moitra: అమిత్ షా పిలవగానే వెళ్తావా సిగ్గు లేదా.? యూసుఫ్ పఠాన్పై మహువా మోయిత్రా ఫైర్..
-
Kitchen Hacks: వంటగదిలో ఈ చిన్న ట్రిక్స్ తెలిస్తే.. మీ పని సగం తగ్గుతుంది!
ట్రెండింగ్
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!