AP Politics: ఏలూరు ఎంపీ అభ్యర్థి ప్రకటనతో బీజేపీ, టీడీపీలో ముసలం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ ఏపీ రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ఈ క్రమంలో.. ఏలూరు ఎంపీ అభ్యర్థి ప్రకటనతో బీజేపీ, టీడీపీలో ముసలం ఏర్పడింది. టీడీపీ నేత పుట్టా మహేష్ యాదవ్ కు టికెట్ కేటాయించడంపై పార్టీ నేతల్లో అసంతృప్తి నెలకొంది. ఈ క్రమంలో.. టీడీపీని వీడేందుకు గోపాల్ యాదవ్ సిద్ధమయ్యారు. ఆయన ఎంపీ టికెట్ ఆశించగా నిరాశ ఎదురైంది.
Shaharyar Khan: పాక్ క్రికెట్ బోర్డు మాజీ ఛైర్మన్ కన్నుమూత
Also Read
- Chandrababu on Mega DSC: డీఎస్సీపై వైసీపీ ఆందోళనలకు చంద్రబాబు కౌంటర్.. కీలక వ్యాఖ్యలు
- CM Chandrababu: వైసీపీపై సీఎం చంద్రబాబు ఫైర్.. గంజాయి, రౌడీయిజంపై సంచలన వ్యాఖ్యలు
- Nuzvid Love Marriage Twist: ప్రేమ వివాహం తర్వాత ట్విస్ట్.. భార్యను అప్పగించేందుకు రూ.12 లక్షలు డిమాండ్?
- Polavaram Agency: ఏజెన్సీలో ఇంకా డోలీ మోతలే.. 4 కొండలు దాటి బాలికను మోసుకెళ్లిన గిరిజనులు
కొన్ని రోజులుగా ఏలూరు సీటు తనదేనని ప్రచారం చేసుకున్న గోపాల్ యాదవ్.. ఇప్పుడు టికెట్ దక్కకపోవడంతో అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. చివరి నిమిషంలో గోపాల్ యాదవ్ కు టీడీపీ అధిష్టానం హ్యాండిచ్చింది. దీంతో.. రేపు ఆత్మీయ సమావేశానికి గోపాల్ యాదవ్ పిలుపునిచ్చారు. మరోవైపు.. అటు టీడీపీకి టికెట్ కేటాయించడంపై బీజేపీలో అసమ్మతి గళం వినిపిస్తోంది. పదేళ్లుగా బీజేపీ కోసం పనిచేస్తున్న గారపాటి చౌదరికి టికెట్ ఇవ్వకపోవడంపై బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. స్థానికులను కాదని కడప జిల్లాకు చెందిన వ్యక్తికి ఎలా టికెట్ ఇస్తారంటుూ బీజేపీ క్యాడర్ ప్రశ్నిస్తోంది.
AAP Office: ఢిల్లీ ఆప్ కార్యాలయానికి సీల్.. నేతల మండిపాటు
గతేడాది కాలంగా.. టీడీపీ నుంచి గోపాల్ యాదవ్ ఎంపీ అభ్యర్థిగా ప్రచారం చేసుకుంటూ.. అనేక పార్టీ కార్యక్రమాలను కూడా నిర్వహిస్తున్నారు. ఈ సమయంలో తెలుగుదేశం పార్టీ స్థానికుడుకి కాకుండా.. వేరే వ్యక్తికి సీటు కేటాయించడంతో గోపాల్ యాదవ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రేపు ఆత్మీయ సమావేశానికి పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో టీడీపీతో కొనసాగాలా.. పార్టీని వీడాలన్న నిర్ణయంపై క్లారిటీ రానుంది. మరోపక్క బీజేపీ కోసం 16 ఏళ్ల పాటు పనిచేసిన గారపాటి చౌదరిని పక్కకు పెట్టడంపై బీజేపీ కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. స్థానిక సమస్యలు తెలిసినటువంటి వారికి సీటు కల్పించాలని వారు కోరుతున్నారు. ఈ క్రమంలో.. బీజేపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు.
తాజావార్తలు
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..