Shaharyar Khan: పాక్ క్రికెట్ బోర్డు మాజీ ఛైర్మన్ కన్నుమూత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Shaharyar Khan: పాకిస్థాన్ క్రికెట్ బోర్డు మాజీ ఛైర్మన్ షహర్యార్ ఖాన్ (89) నేడు(మార్చి 23) లాహోర్లో కన్నుమూశారు. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) ఓ పత్రికా ప్రకటన ద్వారా ఈ సమాచారాన్ని తెలిపింది. షహర్యార్ ఖాన్ మరణం పాక్ క్రికెట్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. షహర్యార్ ఖాన్ రెండు వేర్వేరు పర్యాయాల్లో పీసీబీ చైర్మన్గా పనిచేశారు. ఆయన 1999, ఐసీసీ ప్రపంచ కప్ 2003 సమయంలో భారత పర్యటనలో పాకిస్తాన్ పురుషుల జట్టుకు మేనేజర్గా పనిచేశారు.
ఈ విషాద వార్తను పీసీబీ శనివారం ఓ పత్రికా ప్రకటనలో వెల్లడించింది. ఈ ఉదయం లాహోర్లో మాజీ చైర్మన్ పీసీబీ షహర్యార్ ఖాన్ మృతి పట్ల పాకిస్థాన్ క్రికెట్ బోర్డు, దాని ఛైర్మన్, గవర్నర్ల బోర్డు, సిబ్బంది తమ ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నట్లు పీసీబీ ఒక ప్రకటనలో తెలిపింది. షహర్యార్ కుటుంబానికి మా ప్రగాఢ సానుభూతి అంటూ ఖాన్ మరణంపై హార్దిక్ తన సంతాపాన్ని తెలియజేసాడు. గత దశాబ్దంలో పాకిస్థాన్కు క్రికెట్ను తిరిగి తీసుకురావడంలో కీలక పాత్రధారిగా అతనిని ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలని ఆకాంక్షించాడు.
Also Read
- Coffee Mug Cleaning Tips: కాఫీ మగ్ క్లీనింగ్కు సూపర్ టిప్స్.. నిమిషాల్లో కొత్తదానిలా మెరిపించండి!
- Vaibhav Sooryavanshi: నాడు సంజూ.. నేడు వైభవ్.. టాలెంట్ ఒక్కటే సరిపోదు.. టీమిండియా సెలక్షన్ ఫార్ములా ఇదే..
- UP: లవర్ కోసం ముస్లింగా మారిన యువకుడు.. మళ్లీ హిందువు మతంలోకి వచ్చేశాడు!
- President Droupadi Murmu Vizag Visit: విశాఖకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. గిరిజన వర్సిటీ తొలి స్నాతకోత్సవానికి హాజరు..
Read Also: PBKS vs DC: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న పంజాబ్
ఫిబ్రవరి నెలలో పీసీబీ మొహ్సిన్ నఖ్వీని ఛైర్మన్గా చేసి, 3 సంవత్సరాల పదవీకాలానికి నియమించింది.మొహ్సిన్ నఖ్వీ 37వ పీసీబి ఛైర్మన్గా ఉన్నారు. పీసీబీ మాజీ చైర్మన్ షహర్యార్ ఖాన్ మృతి పట్ల తన ప్రగాఢ సంతాపాన్ని, విచారాన్ని వ్యక్తం చేస్తున్నాను అని నఖ్వీ తెలిపారు. ఆయన మంచి అడ్మినిస్ట్రేటర్, పాకిస్తాన్ క్రికెట్కు అత్యంత అంకితభావంతో సేవలందించారని గుర్తు చేశారు.
ప్రస్తుతం, అందరూ ఐపీఎల్ ఆడుతూ బిజీగా ఉన్నారు. అయితే పాకిస్తాన్ 5 మ్యాచ్ల T20 సిరీస్లో న్యూజిలాండ్కు ఆతిథ్యం ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. తొలి మూడు టీ20 మ్యాచ్లు ఏప్రిల్ 18, 20, 21 తేదీల్లో రావల్పిండి క్రికెట్ స్టేడియంలో జరగనున్నాయి. దీని తర్వాత మిగిలిన 2 మ్యాచ్లు ఏప్రిల్ 25, 27 తేదీల్లో లాహోర్లోని గడాఫీ స్టేడియంలో జరగనున్నాయి.
తాజావార్తలు
-
India External Debt 2026: 762.8 బిలియన్ డాలర్లకు పెరిగిన భారత విదేశీ రుణం..
-
Puri Jagannadh: ప్రభాస్ పేరు చెప్పగానే బ్యాంకాక్ హాస్పిటల్లో వీఐపీ ట్రీట్మెంట్.. పూరి చెప్పిన ఆసక్తికర ఘటన
-
Coffee Mug Cleaning Tips: కాఫీ మగ్ క్లీనింగ్కు సూపర్ టిప్స్.. నిమిషాల్లో కొత్తదానిలా మెరిపించండి!
-
Vaibhav Sooryavanshi: నాడు సంజూ.. నేడు వైభవ్.. టాలెంట్ ఒక్కటే సరిపోదు.. టీమిండియా సెలక్షన్ ఫార్ములా ఇదే..
-
UP: లవర్ కోసం ముస్లింగా మారిన యువకుడు.. మళ్లీ హిందువు మతంలోకి వచ్చేశాడు!
ట్రెండింగ్
-
PBKS Star: పంజాబ్ కింగ్స్ స్టార్ క్రికెటర్పై ఎఫ్ఐఆర్ నమోదు.. వంట మనిషిపై..!
-
Clean and Clutter Free Home: బిజీ లైఫ్లోనూ క్లీన్ హోమ్ సాధ్యం.. పరిశుభ్రమైన ఇంటి రహస్యం ఇదే.!
-
6000mAh భారీ బ్యాటరీ, Snapdragon 6 Gen 3 ప్రాసెసర్తో Samsung Galaxy M47 5G లాంచ్.! ధర ఎంతంటే.?
-
టీవీ కాదు భయ్యో.. అంతకు మించి.! AI పవర్, True RGB డిస్ప్లేతో Sony BRAVIA 9 II, BRAVIA 7 II భారత్లో లాంచ్.!
-
Ragi Milk: శరీరాన్ని సహజంగా చల్లగా ఉంచే సూపర్ డ్రింక్ ‘రాగి మిల్క్’.. ఇంట్లోనే చేసేయండి ఇలా.!