Shaharyar Khan: పాక్ క్రికెట్ బోర్డు మాజీ ఛైర్మన్ కన్నుమూత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Shaharyar Khan: పాకిస్థాన్ క్రికెట్ బోర్డు మాజీ ఛైర్మన్ షహర్యార్ ఖాన్ (89) నేడు(మార్చి 23) లాహోర్లో కన్నుమూశారు. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) ఓ పత్రికా ప్రకటన ద్వారా ఈ సమాచారాన్ని తెలిపింది. షహర్యార్ ఖాన్ మరణం పాక్ క్రికెట్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. షహర్యార్ ఖాన్ రెండు వేర్వేరు పర్యాయాల్లో పీసీబీ చైర్మన్గా పనిచేశారు. ఆయన 1999, ఐసీసీ ప్రపంచ కప్ 2003 సమయంలో భారత పర్యటనలో పాకిస్తాన్ పురుషుల జట్టుకు మేనేజర్గా పనిచేశారు.
ఈ విషాద వార్తను పీసీబీ శనివారం ఓ పత్రికా ప్రకటనలో వెల్లడించింది. ఈ ఉదయం లాహోర్లో మాజీ చైర్మన్ పీసీబీ షహర్యార్ ఖాన్ మృతి పట్ల పాకిస్థాన్ క్రికెట్ బోర్డు, దాని ఛైర్మన్, గవర్నర్ల బోర్డు, సిబ్బంది తమ ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నట్లు పీసీబీ ఒక ప్రకటనలో తెలిపింది. షహర్యార్ కుటుంబానికి మా ప్రగాఢ సానుభూతి అంటూ ఖాన్ మరణంపై హార్దిక్ తన సంతాపాన్ని తెలియజేసాడు. గత దశాబ్దంలో పాకిస్థాన్కు క్రికెట్ను తిరిగి తీసుకురావడంలో కీలక పాత్రధారిగా అతనిని ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలని ఆకాంక్షించాడు.
Also Read
- Hyderabad: ACBకి చిక్కిన మరో అవినీతి అధికారి.. భారీ మొత్తంలో ఆస్తులు గుర్తింపు.!
- David Warner: డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరికిన స్టార్ క్రికెటర్.. నేరం అంగీకారం.. శిక్షపై ఉత్కంఠ..!
- CJP Protest: ఉద్యమం ఆగదు.. 4 ప్రధాన డిమాండ్లను ప్రకటించిన సీజేపీ!
- Karimnagar: అర్ధరాత్రి దొంగల బీభత్సం.. కత్తులు, తుపాకులతో బెదిరించి.. రూ. 50 లక్షలు అపహరణ.!
Read Also: PBKS vs DC: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న పంజాబ్
ఫిబ్రవరి నెలలో పీసీబీ మొహ్సిన్ నఖ్వీని ఛైర్మన్గా చేసి, 3 సంవత్సరాల పదవీకాలానికి నియమించింది.మొహ్సిన్ నఖ్వీ 37వ పీసీబి ఛైర్మన్గా ఉన్నారు. పీసీబీ మాజీ చైర్మన్ షహర్యార్ ఖాన్ మృతి పట్ల తన ప్రగాఢ సంతాపాన్ని, విచారాన్ని వ్యక్తం చేస్తున్నాను అని నఖ్వీ తెలిపారు. ఆయన మంచి అడ్మినిస్ట్రేటర్, పాకిస్తాన్ క్రికెట్కు అత్యంత అంకితభావంతో సేవలందించారని గుర్తు చేశారు.
ప్రస్తుతం, అందరూ ఐపీఎల్ ఆడుతూ బిజీగా ఉన్నారు. అయితే పాకిస్తాన్ 5 మ్యాచ్ల T20 సిరీస్లో న్యూజిలాండ్కు ఆతిథ్యం ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. తొలి మూడు టీ20 మ్యాచ్లు ఏప్రిల్ 18, 20, 21 తేదీల్లో రావల్పిండి క్రికెట్ స్టేడియంలో జరగనున్నాయి. దీని తర్వాత మిగిలిన 2 మ్యాచ్లు ఏప్రిల్ 25, 27 తేదీల్లో లాహోర్లోని గడాఫీ స్టేడియంలో జరగనున్నాయి.
తాజావార్తలు
-
Hyderabad: ACBకి చిక్కిన మరో అవినీతి అధికారి.. భారీ మొత్తంలో ఆస్తులు గుర్తింపు.!
-
David Warner: డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరికిన స్టార్ క్రికెటర్.. నేరం అంగీకారం.. శిక్షపై ఉత్కంఠ..!
-
CJP Protest: ఉద్యమం ఆగదు.. 4 ప్రధాన డిమాండ్లను ప్రకటించిన సీజేపీ!
-
Karimnagar: అర్ధరాత్రి దొంగల బీభత్సం.. కత్తులు, తుపాకులతో బెదిరించి.. రూ. 50 లక్షలు అపహరణ.!
-
Maruti Suzuki: బిగ్ అలర్ట్.. కారు కొనాలనుకుంటే ఇప్పుడే కొనేయండి.. భారీగా పెరగనున్న ధరలు..
ట్రెండింగ్
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!
-
Light Flip 5G Phone: సోషల్ మీడియా లేని 5G ఫోన్.. 50MP కెమెరాతో Light Flip కొత్త కాన్సెప్ట్.!
-
10 రోజుల బ్యాటరీ, 80+ స్పోర్ట్స్ మోడ్లు.! స్క్రీన్ లేకుండానే హెల్త్ ట్రాకింగ్.. Garmin CIRQA స్మార్ట్ బ్యాండ్ లాంచ్.!
-
OLED డిస్ప్లే, RTX 5090 GPUతో పవర్ఫుల్ పనితీరుతో Dell కొత్త Alienware గేమింగ్ ల్యాప్టాప్లు లాంచ్..! ఫీచర్స్, ధరలు ఇలా..!
-
Best Camera Phones: DSLRకు పోటీగా ఫొటోగ్రఫీ అనుభవం..! బెస్ట్ కెమెరా ఫోన్ల లిస్ట్ ఇదిగో..!