Rajnath Singh: మీ ఉత్సాహం చూస్తుంటే ఏపీలో అధికారంలో వచ్చే నమ్మకం కలుగుతుంది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏలూరులో కేంద్ర రక్షణ శాఖమంత్రి రాజ్నాథ్ సింగ్ పర్యటించారు. నర్సాపురం, ఏలూరు, అమలాపురం, కాకినాడ, రాజమండ్రి పార్లమెంట్ బీజేపీ బూత్ స్థాయి కార్యకర్తల సమ్మేళనంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కార్యకర్తల ఉత్సాహం చూస్తుంటే ఏపీలో బీజేపీ అధికారంలో వస్తుంది అనే నమ్మకం కలుగుతుందని అన్నారు. ఇదిలా ఉంటే.. పోలవరం కోసం కేంద్రం నిధులు ఇస్తున్న ప్రాజెక్ట్ పూర్తి చేసే ఆలోచనలో ఇక్కడి రాష్ట్ర ప్రభుత్వాలు లేవని ఆరోపించారు. పోలవరం ప్రాజెక్ట్ మోడీ చేతుల్లోకి తీసుకుని పూర్తి చేస్తామని హామీ ఇచ్చారని తెలిపారు.
CM Jagan: 175 నియోజకవర్గాల్లో వైసీపీ జెండా ఎగురవేయాలి.. నేతలకు దిశానిర్దేశం
Also Read
- Lemon Prices: అమాంతం పెరిగిన నిమ్మకాయల ధరలు.. రూ.30 నుంచి రూ.130కి..!
- Home Minister Anitha: 'మావిగన్' పేరు ఎత్తితే జనం నవ్వుకుంటున్నారు.. అనిత సెటైర్లు
- Nimmala Ramanaidu: కేంద్ర జలశక్తి కార్యదర్శికి మంత్రి నిమ్మల కీలక సూచనలు..
- CM Chandrababu: నిర్వాసితుల త్యాగానికి ప్రతిఫలం పోలవరం ప్రాజెక్టు.. మీరు ప్రజల హృదయాల్లో నిలిచిపోతారు..
రాష్ట్రాన్ని వైసీపీ అభివృద్ధి చేయాలనే ఆలోచన లేదని అన్నారు. పెద్ద ఎత్తున నిధులు ఇస్తుంటే ఆ డబ్బు ఎక్కడికి పోతుందని రాజ్నాథ్ సింగ్ ప్రశ్నించారు. శాండ్, మైనింగ్ మాఫియా, మద్యం మాఫియా రాష్ట్రాన్ని దోచేసే విధంగా ఇక్కడి ప్రభుత్వం పని చేస్తుందని దుయ్యబట్టారు. తెలుగు బిడ్డ పీవీ నరసింహారావుకి భారతరత్న ఇచ్చి గౌరవించిన ఘనత బీజేపీకి దక్కుతుందని తెలిపారు. కేంద్రం నుంచి జలజీవన్ మిషన్ నిధులు రాష్ట్రానికి ఇస్తుంటే.. వైసీపీ ప్రభుత్వం పేదలకు మంచినీళ్లు ఇవ్వలేకపోతుందని వ్యాఖ్యానించారు. అవినీతిలో కూరుకుపోయిన ప్రభుత్వం వైసీపీ.. కుటుంబ పాలన బీజేపీ సహించదని అని పేర్కొన్నారు.
Kotamreddy Sridhar Reddy: వాళ్లు సాధించిందేమీ లేదు.. మాకొచ్చిన నష్టం కూడా ఏమీ లేదు
దేశం పేరు చెబితే గతంలో అంతర్జాతీయ వేదికలపై ఎవరు పట్టించుకునే వారు కాదని… కానీ ఇపుడు మోడీ పేరు చెబితే ప్రపంచ దేశాలు అలెర్ట్ అవుతున్నాయని తెలిపారు. గత ప్రభుత్వాలపై అవినీతి ఆరోపణలు ఉండేవి.. బీజేపీ పై ఒక్క అవినీతి ఆరోపణ లేదని పేర్కొన్నారు. దేశంలో మూడోసారి బీజేపీ 370కి పైగా సీట్లు సాధిస్తుందని రాజ్నాథ్ సింగ్ తెలిపారు. విరోధులు, ప్రత్యర్థులు మూడోసారి బీజేపీ రాదు అంటున్నారు.. నాలుగోసారి కూడా బీజేపీ వస్తుందని కార్యకర్తలు, ప్రజలు అంటున్నారని పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Story Board: హైదరాబాద్లో చినుకు పడితే చిత్తడేనా..? వర్షాకాలం అంతా బిక్కుబిక్కుమనాల్సిందేనా?
-
RBI: క్రెడిట్ రిస్క్ నిబంధనల్లో కీలక మార్పులు.. ఆర్బీఐ ముసాయిదా విడుదల
-
Off The Record: BRSలో భారీ ప్రక్షాళన ఉండబోతుందా? కాస్త తేడాగా ఉన్న నాయకులకు ఫైనల్ వార్నింగ్?
-
Trump-Iran: ఈరోజే భారీగా విరుచుకుపడతాం.. ఇరాన్కు ట్రంప్ తాజా హెచ్చరిక
-
Whats App: వాట్సాప్లో అద్బుత ఫీచర్.. ఫార్వార్డెడ్ మెసేజ్ మొదట ఎక్కడ నుంచి వచ్చిందో కనిపెట్టడం చాలా ఈజీ..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!