Rajnath Singh: మీ ఉత్సాహం చూస్తుంటే ఏపీలో అధికారంలో వచ్చే నమ్మకం కలుగుతుంది..
ఏలూరులో కేంద్ర రక్షణ శాఖమంత్రి రాజ్నాథ్ సింగ్ పర్యటించారు. నర్సాపురం, ఏలూరు, అమలాపురం, కాకినాడ, రాజమండ్రి పార్లమెంట్ బీజేపీ బూత్ స్థాయి కార్యకర్తల సమ్మేళనంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కార్యకర్తల ఉత్సాహం చూస్తుంటే ఏపీలో బీజేపీ అధికారంలో వస్తుంది అనే నమ్మకం కలుగుతుందని అన్నారు. ఇదిలా ఉంటే.. పోలవరం కోసం కేంద్రం నిధులు ఇస్తున్న ప్రాజెక్ట్ పూర్తి చేసే ఆలోచనలో ఇక్కడి రాష్ట్ర ప్రభుత్వాలు లేవని ఆరోపించారు. పోలవరం ప్రాజెక్ట్ మోడీ చేతుల్లోకి తీసుకుని పూర్తి చేస్తామని హామీ ఇచ్చారని తెలిపారు.
CM Jagan: 175 నియోజకవర్గాల్లో వైసీపీ జెండా ఎగురవేయాలి.. నేతలకు దిశానిర్దేశం
Also Read
- Lemon Prices: అమాంతం పెరిగిన నిమ్మకాయల ధరలు.. రూ.30 నుంచి రూ.130కి..!
- Home Minister Anitha: 'మావిగన్' పేరు ఎత్తితే జనం నవ్వుకుంటున్నారు.. అనిత సెటైర్లు
- Nimmala Ramanaidu: కేంద్ర జలశక్తి కార్యదర్శికి మంత్రి నిమ్మల కీలక సూచనలు..
- CM Chandrababu: నిర్వాసితుల త్యాగానికి ప్రతిఫలం పోలవరం ప్రాజెక్టు.. మీరు ప్రజల హృదయాల్లో నిలిచిపోతారు..
రాష్ట్రాన్ని వైసీపీ అభివృద్ధి చేయాలనే ఆలోచన లేదని అన్నారు. పెద్ద ఎత్తున నిధులు ఇస్తుంటే ఆ డబ్బు ఎక్కడికి పోతుందని రాజ్నాథ్ సింగ్ ప్రశ్నించారు. శాండ్, మైనింగ్ మాఫియా, మద్యం మాఫియా రాష్ట్రాన్ని దోచేసే విధంగా ఇక్కడి ప్రభుత్వం పని చేస్తుందని దుయ్యబట్టారు. తెలుగు బిడ్డ పీవీ నరసింహారావుకి భారతరత్న ఇచ్చి గౌరవించిన ఘనత బీజేపీకి దక్కుతుందని తెలిపారు. కేంద్రం నుంచి జలజీవన్ మిషన్ నిధులు రాష్ట్రానికి ఇస్తుంటే.. వైసీపీ ప్రభుత్వం పేదలకు మంచినీళ్లు ఇవ్వలేకపోతుందని వ్యాఖ్యానించారు. అవినీతిలో కూరుకుపోయిన ప్రభుత్వం వైసీపీ.. కుటుంబ పాలన బీజేపీ సహించదని అని పేర్కొన్నారు.
Kotamreddy Sridhar Reddy: వాళ్లు సాధించిందేమీ లేదు.. మాకొచ్చిన నష్టం కూడా ఏమీ లేదు
దేశం పేరు చెబితే గతంలో అంతర్జాతీయ వేదికలపై ఎవరు పట్టించుకునే వారు కాదని… కానీ ఇపుడు మోడీ పేరు చెబితే ప్రపంచ దేశాలు అలెర్ట్ అవుతున్నాయని తెలిపారు. గత ప్రభుత్వాలపై అవినీతి ఆరోపణలు ఉండేవి.. బీజేపీ పై ఒక్క అవినీతి ఆరోపణ లేదని పేర్కొన్నారు. దేశంలో మూడోసారి బీజేపీ 370కి పైగా సీట్లు సాధిస్తుందని రాజ్నాథ్ సింగ్ తెలిపారు. విరోధులు, ప్రత్యర్థులు మూడోసారి బీజేపీ రాదు అంటున్నారు.. నాలుగోసారి కూడా బీజేపీ వస్తుందని కార్యకర్తలు, ప్రజలు అంటున్నారని పేర్కొన్నారు.
తాజావార్తలు
-
RCB vs GT : బెంగళూరును చిత్తు చేసిన టైటాన్స్.. గిల్ మెరుపులు
-
Screen Time Effects : స్క్రీన్ సమయం పెరగడం వల్ల మైగ్రేన్లు వస్తాయా.?
-
Off The Record : సీఎం సరికొత్త టార్గెట్ ఫిక్స్ చేసుకున్నారా? బీజేపీ టార్గెట్ గా వ్యూహాలు?
-
AP Local Body Elections: స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు కీలక నిర్ణయం..
-
Off The Record : ఉమ్మడి కర్నూలులో తమ్ముళ్ల సెగ.. సీనియర్ నేతలు అసంతృప్తితో రగిలిపోవడానికి కారణమేంటి?
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!