Vallabhaneni Vamsi: గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత వల్లభనేని వంశీ మోహన్కు.. కొన్ని కేసుల్లో బెయిల్, ముందస్తు బెయిల్ వచ్చినా.. ఇంకా జైలులోనే మగ్గాల్సిన పరిస్థితి వచ్చింది.. అయితే, నకిలీ పట్టాల పంపిణీ కేసు వ్యవహారంలో వంశీ బెయిల్ పిటిషన్ పై నేడు ఏలూరు జిల్లా నూజివీడు కోర్టులో విచారణ జరిగింది.. నకిలీ పట్టాల పంపిణీ కేసులో తనకు బెయిల్ ఇవ్వాలంటూ వల్లభనేని వంశీ దాఖలు చేసిన పిటిషన్పై విచారణ చేపట్టింది.. కౌంటర్ దాఖలు చేయాలని పోలీసులను కీలక ఆదేశాలు జారీ చేసింది నూజివీడు రెండవ అదనపు జూనియర్ సివిల్ జడ్జీ కోర్టు.. ఆ తర్వాత వల్లభనేని వంశీ మోహన్ బెయిల్ పిటిషన్పై విచారణను రేపటికి వాయిదా వేసింది కోర్టు.. కాగా, ప్రస్తుతం గన్నవరం నియోజకవర్గంలో నకిలీ పట్టాల పంపిణీ వ్యవహారంలో విజయవాడ సబ్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు వల్లభనేని వంశీ మోహన్.. ఆయన్ని మొదట అరెస్ట్ చేసిన కిడ్నాప్ కేసు, ఆ తర్వాత గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసు.. ఇలా అన్ని కేసుల్లో బెయిల్, ముందస్తు బెయిల్ వచ్చినా.. ఇప్పుడు నకిలీ పట్టాల పంపిణీ కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు వల్లభనేని వంశీ మోహన్..
Read Also: Top Headlines @1PM : టాప్ న్యూస్