CM Chandrababu: నీటిపై రాజకీయాలొద్దు.. మేం గోదావరి వాడుకుంటే.. మీరు శ్రీశైలం, సాగర్ నీళ్లు కూడా వాడుకోవచ్చు..!
- నీళ్లపై రాజకీయాలు చేయడం సరికాదు..
- పోలవరం నుంచి నీళ్లు తీసుకుంటాం అంటే అభ్యంతరం ఎలా?..
- గోదావరిలో పుష్కలంగా నీళ్లున్నాయి..
- గోదావరిలో మిగిలే నీళ్లతో రాయలసీమకు నీళ్లు ఇవ్వొచ్చు..
- గోదావరి నీళ్లు ఆంధ్రప్రదేశ్ వాడుకుంటే..
- శ్రీశైలం, సాగర్లో నీళ్లను తెలంగాణ కూడా వాడుకోవచ్చు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Chandrababu: తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదం.. రెండు రాష్ట్రాల నేతలు, పాలక ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలు, విమర్శలపై స్పందించిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. ఆసక్తికర వ్యాఖ్యలుచేశారు.. నీళ్లపై రాజకీయాలు చేయడం సరికాదు అని హితవు పలికారు… దేవాదుల కట్టాం.. అది గోదావరి పైన ఉంది.. అక్కడి నుంచి పోలవరానికి నీళ్లు వస్తాయి.. పోలవరం నుంచి నీళ్లు తీసుకుంటాం అంటే అభ్యంతరం పెడితే ఎలా? అని ప్రశ్నించారు.. గోదావరిలో పుష్కలంగా నీళ్లున్నాయి.. గోదావరిలో మిగిలే నీళ్లతో రాయలసీమకు నీళ్లు ఇవ్వొచ్చన్న చంద్రబాబు.. గోదావరి నీళ్లు ఆంధ్రప్రదేశ్ వాడుకుంటే.. శ్రీశైలం, నాగార్జున సాగర్లో నీళ్లను తెలంగాణ కూడా వాడుకోవచ్చు అని వ్యాఖ్యానించారు.
Read Also: CM Chandrababu: వైఎస్ జగన్ అక్రమాలు విచారించాలంటే 30 ఏళ్లు పడుతుంది.. చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
Also Read
- Polavaram Agency: ఏజెన్సీలో ఇంకా డోలీ మోతలే.. 4 కొండలు దాటి బాలికను మోసుకెళ్లిన గిరిజనులు
- Papikondalu Boat Tour: పాపికొండల విహారయాత్రకు గ్రీన్ సిగ్నల్.. 18 రోజుల తర్వాత మళ్లీ బోటు షికారు
- MLA Chirri Balaraju: పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు కార్యాలయంలో ఉద్రిక్తత..
- Lemon Prices: అమాంతం పెరిగిన నిమ్మకాయల ధరలు.. రూ.30 నుంచి రూ.130కి..!
మేం గోదావరి నీళ్లు వాడుకుంటే, తెలంగాణ వారు శ్రీశైలం, నాగార్జున సాగర్ నీళ్లు కూడా వాడుకోవచ్చు. నీటిపై చిల్లర రాజకీయాలు చేయడం సరి కాదు అన్నారు చంద్రబాబు. గోదావరిలో పుష్కలంగా నీళ్లు ఉన్నాయి. మనం వాడుకున్నాక మిగతా వారికి ఇవ్వడంలో తప్పేమీ లేదు అన్నారు.. రాయలసీమలో అన్ని ప్రాజెక్టులు కళకళ లాడుతున్నాయి. పంట పండని ప్రాంతాల్లో ఇపుడు వరి పంట సాగు కి సిద్ధం అవుతున్నారు. ప్రజల కోసం నిజమైన రాజకీయం చేస్తే మాత్రమే మంచి ఫలితాలు వస్తాయి. కేవలం రాజకీయాల్లో ఉండటానికి మాత్రమే రాజకీయాలు చేయడం సరి కాదు అన్నారు..
ఇక, 2019లో ప్రభుత్వం మారిన తర్వాత ప్రాజెక్టుకు అన్ని నష్టాలు ఎదురయ్యాయి. డయాఫ్రమ్ వాల్ కాపాడుకోవడానికి కనీస జాగ్రత్తలు కూడా తీసుకోలేకపోయారు. ఆరు సంవత్సరాలకంటే ముందే ప్రారంభం కావాల్సిన ప్రాజెక్ట్, గత ప్రభుత్వ తప్పిదాల కారణంగా మరో 6 ఏళ్లు ఆలస్యం అవుతుంది అన్నారు చంద్రబాబు.. గ్యాప్ 1 పనులు జూన్ 2026కి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం.. గ్యాప్ 2 పనులు జూన్ 2027కి పూర్తి చేస్తామని.. మొత్తం ప్రాజెక్ట్ 41.15 మీటర్ల వరకు జనవరి 2027 నాటికి పూర్తి చేయాలనే లక్ష్యం అన్నారు చంద్రబాబు.. పోలవరం రాష్ట్రానికి ఒక వరం, జీవనాధి. పట్టిసీమ లిఫ్ట్ పూర్తి చేసి పదేళ్లు దాటినా, కృష్ణ డెల్టాకు పూర్తి స్థాయిలో సాగు నీరు అందించాము. గ్లోబల్ హబ్గా రాయలసీమని తయారు చేయాలనే లక్ష్యంతో ఉన్నాం. గోదావరి జిల్లాలకంటే రాయలసీమ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని తెలిపారు..
తాజావార్తలు
-
2027 World Cup: ఓపెనర్లుగా రోహిత్ శర్మ, వైభవ్ సూర్యవంశీ.. నాలుగో స్థానంలో శుభ్మన్ గిల్!
-
Bihar Bandh AK-47 Firing: విద్యార్థుల నిరసనలో.. ఏకే-47తో కాల్పులు జరిపిన కానిస్టేబుల్ సస్పెండ్..
-
Mahendragiri Varahi: ‘మహేంద్రగిరి వారాహి’లో ఓ బిగ్ హీరో సర్ప్రైజ్ రోల్.. రిలీజ్ డేట్ ప్రెస్మీట్లో నిర్మాత రివీల్
-
రూ.1,449కే 700GB డేటా, అన్లిమిటెడ్ కాలింగ్.. BSNL బ్రాడ్బ్యాండ్ ప్లాన్ అదిరిపోయింది..!
-
Public Examinations Act Amendment Bill 2026: లోక్సభలో యాంటీ- పేపర్ లీక్ బిల్లును ప్రవేశపెట్టిన కేంద్రం..
ట్రెండింగ్
-
15 నెలల వ్యాలిడిటీతో Jio ‘Freedom Pack’.. 1000+ టీవీ ఛానళ్లు, 12 OTTలు ఫ్రీ.!
-
Samsung Galaxy Z Fold 8 Ultra vs Galaxy Z Fold 7: ఏ ఫోల్డబుల్ ఫోన్ బెస్ట్.?
-
Vaibhav Sooryavanshi: నా కల నిజమైంది.. ఇక మరింత రెచ్చిపోతా.. వైభవ్ సూర్యవంశీ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Vaibhav Sooryavanshi Record: జింబాబ్వేపై తుఫాన్ హాఫ్ సెంచరీ.. వైభవ్ సూర్యవంశీ మరో వరల్డ్ రికార్డు!
-
iPhone 18 Pro, Pro Max ఫుల్ డీటెయిల్స్ లీక్.. లాంచ్ అప్పుడే.!