CM Chandrababu: వైఎస్ జగన్ అక్రమాలు విచారించాలంటే 30 ఏళ్లు పడుతుంది.. చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Chandrababu: మరోసారి వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. పోలవరం పర్యటనలో మీడియాతో మాట్లాడిన ఆయన.. వైఎస్ జగన్ పాలనలో జరిగిన వివిధ అక్రమాలపై విచారణకు సుదీర్ఘ సమయం పడుతుంది.. దీనికి సుమారు 30 సంవత్సరాలు పట్టే అవకాశం ఉన్నట్లు పేర్కొన్నారు. వైఎ్ జగన్ అక్రమాలు ఒకటి, రెండు కాదు.. ఆయన పాలనలో వ్యవస్థలన్నింటినీ కుప్పకూల్చేశారని వ్యాఖ్యానించారు.. అయితే, ఈ కేసులను విచారిస్తూ కాలయాపన చేయలేం అని స్పష్టం చేశారు చంద్రబాబు..
Also Read
- AP High Court: కోర్టు ఆదేశాలను తేలిగ్గా తీసుకోవద్దు.. అధికారులకు హైకోర్టు వార్నింగ్..
- AP Local Body Elections: స్థానిక ఎన్నికలకు డెడ్లైన్.. హైకోర్టుకు ఏపీ ప్రభుత్వం కీలక సమాచారం
- AP Municipal Elections: ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్.. కీలక ఉత్తర్వులు
- CM Chandrababu: గ్రూప్-1 నియామకాల్లో భయంకరమైన అక్రమాలు.. గత ప్రభుత్వంపై సీఎం చంద్రబాబు విమర్శలు
2019లో ప్రభుత్వం మారిన నాటి నుంచి పోలవరం ప్రాజెక్టుకు అన్ని నష్టాలే జరిగాయి.. ప్రాజెక్ట్ డయాఫ్రమ్ వాల్ కాపాడుకోవడానికి కనీస జాగ్రత్తలు తీసుకోలేకపోయారు అని మండిపడ్డారు సీఎం చంద్రబాబు.. ఆరు సంవత్సరాల కంటే ముందే ప్రారంభం కావాల్సిన ప్రాజెక్ట్ గత ప్రభుత్వ తప్పిదాలతో మరొక 6 ఏళ్లు ఆలస్యం అవుతుందన్న ఆయన.. బట్రెస్ డ్యామ్ పూర్తయ్యింది.. గ్యాప్ 1 జూన్ కి పూర్తి కావాలని లక్ష్యం పెట్టుకున్నాం.. గ్యాప్ 2 పనులు 2027 జూన్ నాటికి పూర్తి అవుతాయి.. 41.15 మీటర్ల వరకు ప్రాజెక్ట్ జనవరి 2027 నాటికి పూర్తి చేయాలనే లక్ష్యంతో ఉన్నాం అని వెల్లడించారు
మరోవైపు, ప్రాజెక్టులపై అన్యాయం జరుగుతుందని పర్యటనలు చేస్తే నన్ను గతంలో అరెస్ట్ చేశారని గుర్తు చేసుకున్నారు చంద్రబాబు.. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత నాకంటే గౌరవం పొందినవాళ్లు లేరన్నారు చంద్రబాబు.. ఇంకుడు గుంతలు తవ్విస్తే నన్ను ఎగతాళి చేశారు.. కానీ, గ్రౌండ్ వాటర్ రీచార్జ్ కోసం ఎన్నో ప్రయత్నాలు చేశాం.. ఇపుడు గ్రౌండ్ వాటర్ పెరగం చూస్తుంటే ఎంతో సంతృప్తిగా ఉంది అన్నారు.. భూమినే జలాశయంగా చేసుకోవాలి అని సూచించారు.. రైతుల ఆత్మహత్యల విషయానికీ చంద్రబాబు స్పష్టం చేశారు.. ఈ రాష్ట్రంలో రైతు ఆత్మహత్య చేసుకోవడం కరెక్ట్ కాదు. సమస్యలను తగిన విధంగా పరిష్కరించడం అవసరం అని అన్నారు సీఎం చంద్రబాబు..
తాజావార్తలు
-
Telangana Congress : కొండా సురేఖ, చిన్నారెడ్డికి షోకాజ్ నోటీసులు.!
-
AP High Court: కోర్టు ఆదేశాలను తేలిగ్గా తీసుకోవద్దు.. అధికారులకు హైకోర్టు వార్నింగ్..
-
OTR : అమరావతిలో MLA క్వార్టర్స్ రెడీ..వైసీపీ ఎమ్మెల్యేలు తీసుకుంటారా?
-
AP Local Body Elections: స్థానిక ఎన్నికలకు డెడ్లైన్.. హైకోర్టుకు ఏపీ ప్రభుత్వం కీలక సమాచారం
-
Star Couple: బిగ్ డెసిషన్ తీసుకున్న బాలీవుడ్ స్టార్ కపుల్.. నిర్మాతలుగా మారుతున్న సిద్ధార్థ్ మల్హోత్రా, కియారా!
ట్రెండింగ్
-
Shubman Gill: విజయం సాధిస్తామా లేదా అని చాలా టెన్షన్ పడ్డా.. ఆ ఇద్దరి వల్లే ఈ గెలుపు సాధ్యమైంది!
-
7900mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Redmi M100 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
MS Dhoni-CSK: సీఎస్కే అభిమానులకు శుభవార్త.. ఇక అంతా ఎంఎస్ ధోనీనే!
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో ఆగస్టు 26న వచ్చేస్తోన్న Realme P4s 5G..!
-
Green Chillies at Home: మార్కెట్ మిరపకాయలకు బై.. బై.. ఇంటి కుండీలోనే తాజా పచ్చిమిరపకాయలు పెంచండి ఇలా.!