Chintamaneni: సీఎం చంద్రబాబుతో చింతమనేని భేటీ.. తాజా పరిణామాలపై కీలక చర్చ
- సీఎం చంద్రబాబును కలిసిన దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని..
- తాజాగా పరిణామలను సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లిన చింతమనేని..
- తప్పు చేసిన వారు శిక్ష అనుభవించాల్సిందే: ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Chintamaneni: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబును దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కలిశారు. ఈ సందర్భంగా ఇటీవల దెందులూరులో చోటు చేసుకున్న ఘటనలను సీఎం దృష్టికి తీసుకు వెళ్లారు చింతమనేని.. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన.. ఇవాళ వంశీ లోనికి వెళ్ళాడు, రేపు కొడాలి నాని వెళ్తాడు, ఎల్లుండి మరో నేత వెళ్తాడు అని పేర్కొన్నారు. గన్నవరం తర్వాత గుడివాడ, బందరు ఇలా చాలా నియోజకవర్గాల్లో తప్పులు జరిగాయి.. వారి సంగతి ఎప్పుడు అని ప్రజలు కోరుతున్నారు.. తప్పు చేసిన వారి పట్ల చట్టం అమలు కాస్త ఆలస్యం అవుతుందేమో కానీ.. చేసిన తప్పుల నుంచి ఎవరూ తప్పించుకోలేరు.. వంశీ ఏ తప్పూ చేయకుండానే గన్నవరం తెలుగుదేశం కార్యాలయం ధ్వంసం అయిందా అని చింతమనేని ప్రభాకర్ ప్రశ్నించారు.
Read Also: Pawan Kalyan: పళని నుంచి తిరుమలకు వచ్చే భక్తులకు రవాణా సౌకర్యంపై దృష్టి పెడతాం
Also Read
- Polavaram Agency: ఏజెన్సీలో ఇంకా డోలీ మోతలే.. 4 కొండలు దాటి బాలికను మోసుకెళ్లిన గిరిజనులు
- Papikondalu Boat Tour: పాపికొండల విహారయాత్రకు గ్రీన్ సిగ్నల్.. 18 రోజుల తర్వాత మళ్లీ బోటు షికారు
- MLA Chirri Balaraju: పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు కార్యాలయంలో ఉద్రిక్తత..
- Lemon Prices: అమాంతం పెరిగిన నిమ్మకాయల ధరలు.. రూ.30 నుంచి రూ.130కి..!
ఇక, అక్రమ కేసులు, కక్షసాధింపు రాజకీయాలు, అధికార దుర్వినియోగం వైసీపీకే సాధ్యం అని దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ఆరోపించారు. పగటిపూట రాంబాబు, రాత్రులు కాంబాబు అయిన అంబటికి డీజీపీ ఎదురొచ్చి స్వాగతం పలకాలా అని అడిగారు. అబ్బయ్య చౌదరి పేరుకి సాఫ్ట్ వేర్, మనిషి హార్డ్వేర్ అంటూ మండిపడ్డారు. అలాంటి క్రిమినల్ అయిన అబ్బయ్య చౌదరికి అంబటి వత్తాసు ఏంటి? అని క్వశ్చన్ చేశారు. తన పొలంలో తాను వ్యవసాయం చేయలేని పరిస్థితికి ఎందుకు దిగజారాడో అబ్బయ్య చౌదరి సమాధానం చెప్పగలడా? అని ఆయన అన్నారు. దెందులూరు ఘర్షణలో నా తప్పు ఉందని రుజువైతే రాజీనామాకు సిద్ధమని చింతమనేని ప్రభాకర్ పేర్కొన్నాడు.
Read Also: Madhu Yashki Goud: గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో బీజేపీ, బీఆర్ఎస్ కలిసి పని చేస్తున్నాయి..
అయితే, నా గురించి గంటా అరగంటా అంటూ మాట్లాడే అంబటి సర్టిఫికెట్ ఇస్తాడా?.. అని ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ప్రశ్నించారు. సుకన్య, సంజనల సర్దిఫికేట్ పొందిన అంబటి స్థాయి అందరికీ తెలుసు.. నోరు ఉంది కదా అని ఆంబోతులా రంకెలు వేయటం ఇకనైనా మానుకోవాలి అని సూచించారు. ఇలా రంకెలేస్తేనే ప్రజలు కాల్చి పెట్టిన వాతలు చూపించుకోలేని దుస్థితిలో వైసీపీ నేతలు ఉన్నారంటూ మండిపడ్డారు. ఉద్దేశపూర్వకంగా నాతో గొడవ పెట్టుకుందామని అబ్బయ్య చౌదరి చేసిన ట్రాప్ లో నేను పడలేదు.. పోలవరం కాల్వ బాధితులకు చెల్లించాల్సిన రూ.6 కోట్లు ఎగ్గొట్టే కుట్రలో భాగంగానే నాతో గొడవకు ప్లాన్ చేశాడని చింతమనేని చెప్పుకొచ్చాడు.
తాజావార్తలు
-
VIDA VX2 Plus: 187KM రేంజ్తో హీరో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. ఫాస్ట్ ఛార్జింగ్, రిమూవబుల్ బ్యాటరీ
-
Vinayakan: చిన్నారి ఫోటో పోస్ట్ వివాదం.. ‘జైలర్’ విలన్ వినాయకన్పై మరో కేసు
-
BCCI: టీమ్ ఇండియా కోచింగ్ టీమ్లో మార్పులు..! గంభీర్ సహాయకుల్లో ఇద్దరిని తొలగిస్తారా..?
-
Virat Kohli: లండన్లో ఆ ప్లేయర్తో విరాట్ సీక్రెట్ మీటింగ్.. రెండు గంటల్లోనే వైరల్ ఫొటోలు చూసి కోహ్లీ షాక్!
-
Wedding Fight: మటన్ పెడతామని ఒప్పుకొని.. చికెన్ పెడతారా?.. పెళ్లి విందులో పొట్టు పొట్టు తన్నుకున్న వైనం
ట్రెండింగ్
-
New Car Features: మైలేజ్ రోజులు పోయాయి.. ఇప్పుడు కార్లలో ఈ ఫీచర్లకే భారీ క్రేజ్.!
-
మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, HD+ డిస్ప్లే, IR బ్లాస్టర్తో రాబోతున్న Itel Zeno 100 Pro.!
-
డాల్బీ ఆటమ్స్ సపోర్ట్, AI కెమెరా ఫీచర్లతో గ్రాండ్ ఎంట్రీకి సిద్దమైన TECNO CAMON 50 Ultra 5G..!
-
IND vs ENG: భారత్తో సిరీస్లో మజా లేదు.. మేమే ప్రపంచ నంబర్-1.. బ్రూక్ సంచలన వ్యాఖ్యలు!
-
Australia-IPL Match: ఆస్ట్రేలియాలో ఐపీఎల్ మ్యాచ్.. బీసీసీఐతో క్రికెట్ ఆస్ట్రేలియా రహస్య చర్చలు!