Nara Bhuvaneswari: రాజమండ్రి ప్రజలను నేను మర్చిపోలేను.. వారికి పాదాభివందనాలు.. భువనేశ్వరి భావోద్వేగం..
- రాజమండ్రి ప్రజలను నేను ఎప్పటికీ మర్చిపోలేను..
- రాజమండ్రివారి గురించి ఎంత చెప్పినా నా మనసుకు తృప్తి ఉండదు..
- ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు..
- అందరికీ పాదాభివందనాలు అంటూ భావోద్వేగానికి గురైన నారా భువనేశ్వరి..
Nara Bhuvaneswari: రాజమండ్రి ప్రజలను నేను ఎప్పటికీ మర్చిపోలేను అన్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీమణి, ఎన్టీఆర్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి.. రాజమండ్రివారి గురించి ఎంత చెప్పినా నా మనసుకు తృప్తి ఉండదన్న ఆమె.. ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు.. అందరికీ పాదాభివందనాలు అంటూ భావోద్వేగానికి గురయ్యారు నారా భువనేశ్వరి..
Read Also: Akira: మెగా ఫ్యాన్స్ కి పూనకాలే.. విశ్వంభరలో చిరంజీవితో అకీరా ?
Also Read
- CM Chandrababu: మహిళా బిల్లును అడ్డుకోవడం పెద్ద విద్రోహం..
- Dead Body Door Delivery Case: ఎమ్మెల్సీ అనంతబాబు భార్యకు షాక్.. పిటిషన్ కొట్టివేసిన కోర్టు..
- Governor Abdul Nazeer: నేడు ఆదికవి నన్నయ్య వర్సిటీ స్నాతకోత్సవం.. ముఖ్య అతిథిగా గవర్నర్
- Rabi Paddy Procurement: రైతులకు గుడ్న్యూస్.. రేపటి నుంచి రబీ ధాన్యం కొనుగోళ్లు ప్రారంభం
తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో పర్యటిస్తున్నారు ఎన్టీఆర్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి.. బ్లడ్ బ్యాంక్ను ప్రారంభించారామె.. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ.. 53 రోజులు టీడీపీ అధినేత చంద్రబాబును రాజమండ్రి సెంట్రల్ జైల్లో పెట్టినప్పుడు.. ఈ ప్రాంత దాతలు, ప్రజలు అందించిన సహకారం మరువలేనిది అన్నారు.. రాజమండ్రి ప్రజల రుణం తీర్చుకోవడానికే బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు చేశామన్నారు.. రాష్ట్రంలో ఇది నాలుగోవ బ్లడ్ బ్యాంక్.. ఎన్టీఆర్ ట్రస్ట్ బ్లడ్ బ్యాంకుల ద్వారా 4 లక్షల 8 వేల మందికి రక్తదానం చేసిందని వెల్లడించారు.. ఎన్టీఆర్ సృజల ద్వారా రక్షిత మంచినీటిని అందిస్తున్నాం అన్నారు.. ఇక, రాజమండ్రి ప్రజలను నేను ఎప్పుడూ మర్చిపోలేను.. రాజమండ్రివారి గురించి ఎంత చెప్పినా నా మనసుకు తృప్తి ఉండదు.. ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు.. అందరికీ పాదాభివందనాలు అని వ్యాఖ్యానించారు నారా భువనేశ్వరి..
Read Also: Call Money Danda: కాల్ మనీ దందా.. వేలల్లో అప్పులు ఇచ్చి లక్షల్లో వసూళ్లు.. ఊరు వీడుతున్న బాధితులు..!
ఇక, వెంకటేశ్వర స్వామి భక్తురాలుగా తిరుమలలో లడ్డు వివాదం బాధాకరం అంటూ నారా భువనేశ్వరి విచారం వ్యక్తంచేశారు. లడ్డూలో కల్తీ నెయ్యి వాడకం. వంటి ఘటనలు జరగకూడదని కోరుకుంటున్నానని అన్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రాజమండ్రిలో ఏర్పాటుచేసిన బ్లడ్ బ్యాంకు, ఉచిత మొబైల్ క్లినిక్ లను. భువనేశ్వరి ప్రారంభించారు. ఈ సందర్భంగా. భువనేశ్వరి మీడియాతో మాట్లాడుతూ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు అన్నింటిని నా భర్త ముఖ్యమంత్రి చంద్రబాబు పరిష్కారిస్తారని అన్నారు. నిజం గెలవాలని నేను ప్రచారం చేసినప్పుడు ప్రజల సమస్యలు చూశానని తెలిపారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత గాంధీజీ స్వాతంత్రం తీసుకొచ్చినంత ఆనందంగా ప్రజలు సంతోషపడ్డారని అన్నారు. వందరోజుల పాలన సమర్థవంతంగా నిర్వహించారని కితాబు ఇచ్చారు. తన కోడలు నారా బ్రాహ్మణి రాజకీయాల్లోకి రారని. వెల్లడించారు . ఎన్టీఆర్ ట్రస్ట్ డైరెక్టర్గ్ గా. బ్రాహ్మణి సేవలందిస్తున్నారని తెలిపారు.
తాజావార్తలు
-
Off The Record : ఉమ్మడి కృష్ణా జిల్లా వైసీపీలో నిర్లిప్తత పెరుగుతోందా?
-
Axar Patel: ఢిల్లీ ఘోర పరాజయంపై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. పెదవి విప్పిన చేదు నిజం..
-
Off The Record : ఉమ్మడి రంగారెడ్డి కాంగ్రెస్లో వలస నేతల డామినేషన్
-
Anganwadi Jobs: అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. 2,645 కేంద్రాల్లో ఖాళీలు..
-
RCB vs DC: వార్ వన్ సైడ్.. ఢిల్లీపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం.!
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!