Nara Bhuvaneswari: రాజమండ్రి ప్రజలను నేను మర్చిపోలేను.. వారికి పాదాభివందనాలు.. భువనేశ్వరి భావోద్వేగం..
- రాజమండ్రి ప్రజలను నేను ఎప్పటికీ మర్చిపోలేను..
- రాజమండ్రివారి గురించి ఎంత చెప్పినా నా మనసుకు తృప్తి ఉండదు..
- ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు..
- అందరికీ పాదాభివందనాలు అంటూ భావోద్వేగానికి గురైన నారా భువనేశ్వరి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nara Bhuvaneswari: రాజమండ్రి ప్రజలను నేను ఎప్పటికీ మర్చిపోలేను అన్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీమణి, ఎన్టీఆర్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి.. రాజమండ్రివారి గురించి ఎంత చెప్పినా నా మనసుకు తృప్తి ఉండదన్న ఆమె.. ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు.. అందరికీ పాదాభివందనాలు అంటూ భావోద్వేగానికి గురయ్యారు నారా భువనేశ్వరి..
Read Also: Akira: మెగా ఫ్యాన్స్ కి పూనకాలే.. విశ్వంభరలో చిరంజీవితో అకీరా ?
Also Read
- Jakkampudi Raja Protest: పీఎస్ ఎదుట ఆందోళనకు దిగిన జక్కంపూడి..
- Anantha Babu Case: జైల్లో ఇంటి భోజనం కోరిన అనంతబాబు.. కోర్టు కీలక ఆదేశాలు
- Minister Nimmala Ramanaidu: జగన్ పాలనపై మంత్రి నిమ్మల రామానాయుడు తీవ్ర విమర్శలు.. మేనమామనని చెప్పి మోసం చేశారు..!
- Deputy CM Pawan Kalyan: గోదావరి కాలుష్యంపై పవన్ కల్యాణ్.. రెండో రోజు కూడా క్షేత్రస్థాయిలో తనిఖీలు
తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో పర్యటిస్తున్నారు ఎన్టీఆర్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి.. బ్లడ్ బ్యాంక్ను ప్రారంభించారామె.. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ.. 53 రోజులు టీడీపీ అధినేత చంద్రబాబును రాజమండ్రి సెంట్రల్ జైల్లో పెట్టినప్పుడు.. ఈ ప్రాంత దాతలు, ప్రజలు అందించిన సహకారం మరువలేనిది అన్నారు.. రాజమండ్రి ప్రజల రుణం తీర్చుకోవడానికే బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు చేశామన్నారు.. రాష్ట్రంలో ఇది నాలుగోవ బ్లడ్ బ్యాంక్.. ఎన్టీఆర్ ట్రస్ట్ బ్లడ్ బ్యాంకుల ద్వారా 4 లక్షల 8 వేల మందికి రక్తదానం చేసిందని వెల్లడించారు.. ఎన్టీఆర్ సృజల ద్వారా రక్షిత మంచినీటిని అందిస్తున్నాం అన్నారు.. ఇక, రాజమండ్రి ప్రజలను నేను ఎప్పుడూ మర్చిపోలేను.. రాజమండ్రివారి గురించి ఎంత చెప్పినా నా మనసుకు తృప్తి ఉండదు.. ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు.. అందరికీ పాదాభివందనాలు అని వ్యాఖ్యానించారు నారా భువనేశ్వరి..
Read Also: Call Money Danda: కాల్ మనీ దందా.. వేలల్లో అప్పులు ఇచ్చి లక్షల్లో వసూళ్లు.. ఊరు వీడుతున్న బాధితులు..!
ఇక, వెంకటేశ్వర స్వామి భక్తురాలుగా తిరుమలలో లడ్డు వివాదం బాధాకరం అంటూ నారా భువనేశ్వరి విచారం వ్యక్తంచేశారు. లడ్డూలో కల్తీ నెయ్యి వాడకం. వంటి ఘటనలు జరగకూడదని కోరుకుంటున్నానని అన్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రాజమండ్రిలో ఏర్పాటుచేసిన బ్లడ్ బ్యాంకు, ఉచిత మొబైల్ క్లినిక్ లను. భువనేశ్వరి ప్రారంభించారు. ఈ సందర్భంగా. భువనేశ్వరి మీడియాతో మాట్లాడుతూ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు అన్నింటిని నా భర్త ముఖ్యమంత్రి చంద్రబాబు పరిష్కారిస్తారని అన్నారు. నిజం గెలవాలని నేను ప్రచారం చేసినప్పుడు ప్రజల సమస్యలు చూశానని తెలిపారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత గాంధీజీ స్వాతంత్రం తీసుకొచ్చినంత ఆనందంగా ప్రజలు సంతోషపడ్డారని అన్నారు. వందరోజుల పాలన సమర్థవంతంగా నిర్వహించారని కితాబు ఇచ్చారు. తన కోడలు నారా బ్రాహ్మణి రాజకీయాల్లోకి రారని. వెల్లడించారు . ఎన్టీఆర్ ట్రస్ట్ డైరెక్టర్గ్ గా. బ్రాహ్మణి సేవలందిస్తున్నారని తెలిపారు.
తాజావార్తలు
-
Rajasthan: బాలికపై అత్యాచార ఘటనలో బుల్డోజర్ యాక్షన్.. 4 హోటళ్లు ధ్వంసం
-
Nabha Natesh: పాములు మా ఇంట్లో కాపురం ఉంటాయి.. వాటిని చూస్తూ టిఫిన్ చేస్తా: నభా నటేష్ షాకింగ్ కామెంట్స్!
-
CM Revanth Reddy: ఆదాయ పెంపుపై ఫోకస్.. అధికారులకు సీఎం రేవంత్ కీలక ఆదేశాలు.!
-
Netanyahu: నెతన్యాహు పీఠం కదులుతోంది.. ఇజ్రాయెల్ ప్రధానిని గద్దె దించేందుకు రంగంలోకి దిగిన మాజీ సైన్యాధిపతి!
-
PKCW : పవన్ కళ్యాణ్ తో కలిసి పని చేయాలనుకుంటున్నారా? ఆ క్రియేటివ్ వరల్డ్లోకి మీకూ ఎంట్రీ!
ట్రెండింగ్
-
అందుబాటులోకి Aadhaar App కొత్త వెర్షన్..ఫేస్ ఆథెంటికేషన్, మొబైల్ నంబర్ అప్డేట్లతో పాటు మరిన్ని సేవలు.!
-
185Hz OLED డిస్ప్లే, 8300mAh బ్యాటరీ, ట్రాన్స్పరెంట్ డిజైన్తో REDMAGIC Gaming Tablet 5 Pro లాంచ్.!
-
How to Kill Men: మెట్రోలో యువతి చేతిలో ‘మగాళ్లను చంపడం ఎలా’ పుస్తకం.. షాక్ అవుతున్న నెటిజన్లు!
-
Harry Brook: మా ప్లాన్స్ మాకున్నాయి.. దాచాం చాలా.. వైభవ్ను ఈజీగా బుట్టలో వేస్తాం!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీకి ఛాన్స్ రాకపోవడమే మంచిది.. అసలు కారణం..!