Call Money Danda: కాల్ మనీ దందా.. వేలల్లో అప్పులు ఇచ్చి లక్షల్లో వసూళ్లు.. ఊరు వీడుతున్న బాధితులు..!
- ఏలూరులో కాల్ మనీ దందాలు..
- తీసుకున్న అప్పుకి పదింతలు వసూలు..
- మహిళలకు లైంగిక వేధింపులు..
- భయంతో ఊరు వీడుతున్న బాధితులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Call Money Danda: ఏలూరులో కాల్ మనీ దందాలు వరుసగా వెలుగు చూస్తున్నాయి. ఒక్కొక్కరిగా బయటికి వస్తున్న బాధితులు తమ గోడు వెళ్ళబోసుకుంటున్నారు. తీసుకున్న అప్పుకి పదింతలు చెల్లించినా మహిళలకు లైంగిక వేధింపులు ఆగడంలేదని ఆవేదన చెందుతున్నారు.అధిక వడ్డీలు చెల్లించలేక, అప్పులు తీర్చలేక ఊరు వదిలి వెళ్ళిపోతున్న బాధితులు గతంలో పోలీసులను ఆశ్రయించినా న్యాయం జరగలేదని బాధితుల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లా ఎస్పీకి పిర్యాదు చేసేందుకు సిద్ధం అయిన బాధితులు ప్రజా ప్రతినిధులను కలుస్తూ తమగోడు వెళ్ళపోసుకుంటున్నారు. ఏలూరులో అధిక వడ్డీలు చెల్లించలేక ఇబ్బందులు పడుతున్న బాధితులు ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణను కలిసి తమకు జరిగిన అన్యాయాన్ని చెప్పుకొచ్చారు. దీనిపై స్పందించిన ఎమ్మెల్యే పేదల రక్తాన్ని పీల్చుకు తినే కాల్ మనీ గ్యాంగ్ లకు తమ ప్రభుత్వం బుద్ధి చెబుతుందని స్పష్టం చేశారు.
Read Also: Mthun Chakraborty : లెజండరీ యాక్టర్.. మిథున్ చక్రవర్తికి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు
Also Read
- Lemon Prices: అమాంతం పెరిగిన నిమ్మకాయల ధరలు.. రూ.30 నుంచి రూ.130కి..!
- Home Minister Anitha: 'మావిగన్' పేరు ఎత్తితే జనం నవ్వుకుంటున్నారు.. అనిత సెటైర్లు
- Nimmala Ramanaidu: కేంద్ర జలశక్తి కార్యదర్శికి మంత్రి నిమ్మల కీలక సూచనలు..
- CM Chandrababu: నిర్వాసితుల త్యాగానికి ప్రతిఫలం పోలవరం ప్రాజెక్టు.. మీరు ప్రజల హృదయాల్లో నిలిచిపోతారు..
ఏలూరు పవర్పేటలోని ఎమ్మెల్యే కార్యాలయానికి కాల్ మనీ బాధితులు సుమారు 60 మంది వరకు చేరుకుని తమకు జరిగిన అన్యాయాన్ని ఎమ్మెల్యే బడేటి చంటి కి వివరించారు. 2021 నుంచి జరుగుతున్న అక్రమాలపై ఎన్నిసార్లు పోలీసులకు ఫిర్యాదు చేసిన వారు పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై స్పందించిన ఎమ్మెల్యే బడేటి బాధితులు అందరికీ న్యాయం జరిగే విధంగా సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. పేదల అవసరాలను ఆసరాగా చేసుకుని అధిక వడ్డీలు వసూలు చేసే గ్యాంగ్ లపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. బడేటి క్యాంప్ ఆఫీసులో ఎమ్మెల్యే బడేటి చంటి ని కలిసిన కాల్ మనీ బాధితులు, తమకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని..కాల్ మనీ పేరుతో మేడపాటి సుధాకర్ రెడ్డి అరాచకాలు ఇప్పుడిప్పుడే వెలుగు చూస్తున్నాయని ..మధ్యతరగతి కుటుంబాలనే టార్గెట్గా చేసుకుని కాల్ మనీ వేధింపులకు పాల్పడుతున్న మేడపాటి సుధాకర్ రెడ్డి, అతని అనుచరులపై చర్యలు ఉండేలాగా కృషి చేస్తామన్నారు.కాల్ మనీ బాధితులకు న్యాయం జరిగేలాగా తగు చర్యలు తీసుకొని, కాల్ మనీకి పాల్పడిన వారికి శిక్షపడేలా చూస్తామని హామీ ఇచ్చిన ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి ఈ వ్యవహారంలో బాధితులకు న్యాయం చేయడంతో పాటు, చేసిన వారిని కఠినంగా శిక్షిస్తామని హామీ ఇచ్చారు. కాల్ మనీ వ్యవహారంలో ఇప్పటికే బాధితులుగా మారిన వారంతా జిల్లా ఎస్పీ తో పాటు కలెక్టర్ ను కలిసి తమ గోడు వెళ్ళబోసుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే కాల్ మనీ గ్యాంగ్ అరాచకాలు తట్టుకోలేక ఊరు వదిలి వలసపోయిన బాధితులు తిరిగివచ్చి ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఏలూరు చుట్టుపక్కల ప్రాంతాల్లో ఇంకా ఎంతమంది బాధితులు బయటికి వస్తారు.. ఇంకెన్ని అన్యాయాలు వెలుగు చూస్తాయి అనేది సస్పెన్స్ గా మారింది.
తాజావార్తలు
-
GT vs CSK : గుజరాత్ టైటాన్స్ ఘన విజయం.. టాప్లో GT.. CSK అవుట్..!
-
OTR : TPCC కి కొత్త హంగులు రాబోతున్నాయా..?
-
Maoists Surrender : జార్ఖండ్లో మావోయిస్టులకు భారీ దెబ్బ.. ఒకేసారి 27 మంది లొంగుబాటు..!
-
Storyboard : ఏపీలో కూటమి పాలన ఎలా ఉంది..? సూపర్ సిక్స్ హామీల స్థితిగతులేంటి..?
-
Off The Record : కోనసీమ జిల్లా వైసీపీలో అసంతృప్తి రాగాలు
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!