Call Money Danda: కాల్ మనీ దందా.. వేలల్లో అప్పులు ఇచ్చి లక్షల్లో వసూళ్లు.. ఊరు వీడుతున్న బాధితులు..!
- ఏలూరులో కాల్ మనీ దందాలు..
- తీసుకున్న అప్పుకి పదింతలు వసూలు..
- మహిళలకు లైంగిక వేధింపులు..
- భయంతో ఊరు వీడుతున్న బాధితులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Call Money Danda: ఏలూరులో కాల్ మనీ దందాలు వరుసగా వెలుగు చూస్తున్నాయి. ఒక్కొక్కరిగా బయటికి వస్తున్న బాధితులు తమ గోడు వెళ్ళబోసుకుంటున్నారు. తీసుకున్న అప్పుకి పదింతలు చెల్లించినా మహిళలకు లైంగిక వేధింపులు ఆగడంలేదని ఆవేదన చెందుతున్నారు.అధిక వడ్డీలు చెల్లించలేక, అప్పులు తీర్చలేక ఊరు వదిలి వెళ్ళిపోతున్న బాధితులు గతంలో పోలీసులను ఆశ్రయించినా న్యాయం జరగలేదని బాధితుల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లా ఎస్పీకి పిర్యాదు చేసేందుకు సిద్ధం అయిన బాధితులు ప్రజా ప్రతినిధులను కలుస్తూ తమగోడు వెళ్ళపోసుకుంటున్నారు. ఏలూరులో అధిక వడ్డీలు చెల్లించలేక ఇబ్బందులు పడుతున్న బాధితులు ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణను కలిసి తమకు జరిగిన అన్యాయాన్ని చెప్పుకొచ్చారు. దీనిపై స్పందించిన ఎమ్మెల్యే పేదల రక్తాన్ని పీల్చుకు తినే కాల్ మనీ గ్యాంగ్ లకు తమ ప్రభుత్వం బుద్ధి చెబుతుందని స్పష్టం చేశారు.
Read Also: Mthun Chakraborty : లెజండరీ యాక్టర్.. మిథున్ చక్రవర్తికి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు
Also Read
- Chandrababu on Mega DSC: డీఎస్సీపై వైసీపీ ఆందోళనలకు చంద్రబాబు కౌంటర్.. కీలక వ్యాఖ్యలు
- CM Chandrababu: వైసీపీపై సీఎం చంద్రబాబు ఫైర్.. గంజాయి, రౌడీయిజంపై సంచలన వ్యాఖ్యలు
- Nuzvid Love Marriage Twist: ప్రేమ వివాహం తర్వాత ట్విస్ట్.. భార్యను అప్పగించేందుకు రూ.12 లక్షలు డిమాండ్?
- Polavaram Agency: ఏజెన్సీలో ఇంకా డోలీ మోతలే.. 4 కొండలు దాటి బాలికను మోసుకెళ్లిన గిరిజనులు
ఏలూరు పవర్పేటలోని ఎమ్మెల్యే కార్యాలయానికి కాల్ మనీ బాధితులు సుమారు 60 మంది వరకు చేరుకుని తమకు జరిగిన అన్యాయాన్ని ఎమ్మెల్యే బడేటి చంటి కి వివరించారు. 2021 నుంచి జరుగుతున్న అక్రమాలపై ఎన్నిసార్లు పోలీసులకు ఫిర్యాదు చేసిన వారు పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై స్పందించిన ఎమ్మెల్యే బడేటి బాధితులు అందరికీ న్యాయం జరిగే విధంగా సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. పేదల అవసరాలను ఆసరాగా చేసుకుని అధిక వడ్డీలు వసూలు చేసే గ్యాంగ్ లపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. బడేటి క్యాంప్ ఆఫీసులో ఎమ్మెల్యే బడేటి చంటి ని కలిసిన కాల్ మనీ బాధితులు, తమకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని..కాల్ మనీ పేరుతో మేడపాటి సుధాకర్ రెడ్డి అరాచకాలు ఇప్పుడిప్పుడే వెలుగు చూస్తున్నాయని ..మధ్యతరగతి కుటుంబాలనే టార్గెట్గా చేసుకుని కాల్ మనీ వేధింపులకు పాల్పడుతున్న మేడపాటి సుధాకర్ రెడ్డి, అతని అనుచరులపై చర్యలు ఉండేలాగా కృషి చేస్తామన్నారు.కాల్ మనీ బాధితులకు న్యాయం జరిగేలాగా తగు చర్యలు తీసుకొని, కాల్ మనీకి పాల్పడిన వారికి శిక్షపడేలా చూస్తామని హామీ ఇచ్చిన ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి ఈ వ్యవహారంలో బాధితులకు న్యాయం చేయడంతో పాటు, చేసిన వారిని కఠినంగా శిక్షిస్తామని హామీ ఇచ్చారు. కాల్ మనీ వ్యవహారంలో ఇప్పటికే బాధితులుగా మారిన వారంతా జిల్లా ఎస్పీ తో పాటు కలెక్టర్ ను కలిసి తమ గోడు వెళ్ళబోసుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే కాల్ మనీ గ్యాంగ్ అరాచకాలు తట్టుకోలేక ఊరు వదిలి వలసపోయిన బాధితులు తిరిగివచ్చి ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఏలూరు చుట్టుపక్కల ప్రాంతాల్లో ఇంకా ఎంతమంది బాధితులు బయటికి వస్తారు.. ఇంకెన్ని అన్యాయాలు వెలుగు చూస్తాయి అనేది సస్పెన్స్ గా మారింది.
తాజావార్తలు
-
Ravi Teja: ఇరుముడి జోష్లోనూ రవితేజ కొత్త సినిమాపై సస్పెన్స్! అసలేమైంది?
-
Ananthika Sanilkumar: ‘ఎల్లమ్మ’లో హీరోయిన్ ఫిక్స్.. డీఎస్పీకి జోడీ ఎవరో తెలుసా?
-
Cricket Record: 47 ఏళ్లకు అరంగేట్రం.. 51 ఏళ్ల వయసులో ప్రపంచ రికార్డు.. క్రికెట్లో 96 ఏళ్ల రికార్డు బద్దలు..
-
Kangana Ranaut: కంగనా, రామ్దేవ్ వివాదానికి రాఖీతో ముగింపు.. మిఠాయిలతో మళ్లీ అన్నాచెల్లెళ్ల బంధం!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
ట్రెండింగ్
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!
-
Fridge Wall Gap : ఫ్రిజ్ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!