మాస్క్ ధరించలేదా..ఇక ఫైన్ కట్టాల్సిందే..
ఓమిక్రాన్ వేరింయట్ వేగంగా వ్యాప్తి నేపథ్యంలో, కోవిడ్ 19 వ్యాప్తిని నివారించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కఠిన ఆంక్షలు విధించింది. దీనికి సంబంధించి కేంద్రం జారీ చేసిన పరిమితులు/మార్గదర్శకాల జాబితా చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. బహిరంగ ప్రదేశాల్లో వ్యక్తులందరూ మాస్క్ ధరించడం తప్పనిసరి చేసింది. నిబంధనలు పాటించకుంటే రూ. 100 జరిమానా విధిస్తారు. మాస్క్ ముక్కు, నోటిని కప్పి ఉంచాలి. సంస్థలు లేదా దుకాణాలు మాస్క్ లేని వ్యక్తిని తమ ప్రాంగణంలోకి అనుమతిస్తే పరిస్థితి తీవ్రతను బట్టి వారికి రూ.10,000 నుండి రూ.25,000 వరకు జరిమానా విధించనున్నట్టు ప్రభుత్వం పేర్కొంది.
ఏదైనా మార్కెట్ లేదా వాణిజ్య సంస్థలో కోవిడ్ ప్రోటోకాల్ను అనుసరించడంలో ఏదైనా ఉల్లంఘనలకు పాల్పడితే ఆప్రాంతం వెంటనే ఒకటి రెండు రోజుల్లో మూసివేసేలా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఆప్రాంతంలో కోవిడ్-సముచిత నియమావళి మరియు జరిమానాలపై అవగాహన కల్పించడానికి మార్కెట్ అసోసియేషన్లను ప్రభుత్వం భాగస్వామ్యం చేసింది. దీనికి సంబంధించి వాట్సాప్ నంబర్ 8010968295లో ఫోటోగ్రాఫ్లను పోస్ట్ చేయడం ద్వారా కోవిడ్-రూల్స్ను అతిక్రమించిన వారిని అధికారుల దృష్టికి తీసుకెళ్ల వచ్చు. కోవిడ్ ప్రోటోకాల్ను ఉల్లంఘించే దుకాణాలపై చర్య తీసుకోవడానికి ఇప్పటికే ప్రభుత్వం ప్రత్యేక అధికార యంత్రాంగాన్ని నియమించింది.
Also Read
- Pawan Kalyan : ఇది కూటమి ప్రభుత్వం తీసుకువస్తున్న విప్లవాత్మక మార్పులకు నిదర్శనం
- Polavaram Project : పోలవరం ప్రాజెక్ట్పై కేంద్రం మెగా ప్లాన్..
- AP Mobile Alert: మొబైల్లో అలర్ట్ షాక్.? రేపు ఎన్నిగంటలకంటే..!
- Student Suicide: నిండు ప్రాణాన్ని బలితీసుకున్న నిరుద్యోగం.. కలల కొలువు దక్కకపోవడంతో బీటెక్ విద్యార్థిని ఆత్మహత్య
వివాహాలు, సమావేశాలకు 500 మంది మాత్రమే
వివాహాలు, మతపరమైన సమావేశాలు సామాజిక కార్యకలాపాలతో సహా అన్ని సమావేశాలను నిర్వహించుకోవడానికి గరిష్టంగా 500 మందికి మాత్రమే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఈ సమావేశాల్లో పాల్గొనే వారందరూ మాస్క్ ధరించడం, తరచుగా హ్యాండ్ శానిటైజేషన్ చేయడం మరియు సామాజిక దూరాన్ని పాటించడంతోపాటు కోవిడ్ రూల్స్ను విధిగా నిబంధనలు పాటించాల్సిందే.
నిబంధనలను ఉల్లంఘిస్తే విపత్తు నిర్వహణ చట్టం, 2005 ప్రకారం సెక్షన్లు 51 నుండి 60 వరకు, IPCలోని సెక్షన్ 188 అలాగే వర్తించే ఇతర చట్టాల ప్రకారం ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. దీనికి సంబంధించిన అధికారాన్ని కలెక్టర్లు, జిల్లా మేజిస్ట్రేట్లు, పోలీసు కమిషనర్లు మరియు ఎస్పీలు అమలు చేస్తారని ప్రభుత్వం పేర్కొంది. లాక్డౌన్ లాంటి విపత్కర పరిస్థితులు తలెత్తకుండా ఉండాలంటే ఇలాంటి నిబంధనలు కఠినంగా అమలు చేయాల్సిందేనని ప్రభుత్వం భావిస్తోంది.
తాజావార్తలు
-
Story Board : ఒంటరి పోరాటమా.. అంతర్గత వైఫల్యమా? విపక్షాల బలహీనతకు అసలు కారణం రాహులేనా?
-
GST: దేశ చరిత్రలోనే ఆల్ టైమ్ రికార్డ్.. ఏప్రిల్లో భారీగా జీఎస్టీ వసూళ్లు..
-
Ragi Sweet Roti: బామ్మల కాలం నాటి ఆరోగ్య రహస్యం.. నిమిషాల్లో తయారయ్యే రాగి తీపి రొట్టెలు ఇలా సింపుల్గా చేసేయండి!
-
Riyan parag: బీసీసీఐ జరిమానా విధించిన మరుసటి రోజే.. విశ్వరూపం చూపించిన రియాన్ పరాగ్..
-
Property Law India: తల్లిదండ్రుల ఆస్తిపై పిల్లలకు హక్కు ఉందని అనుకుంటున్నారా? ఈ నిజం తెలిస్తే షాక్ అవుతారు!
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!