ఆపరేషన్ పరివర్తన లో భాగంగా ప్రత్యేక తనిఖీలు చేపట్టాం. ఈ మధ్య కాలంలో గంజాయి రవాణా ఎక్కువగా ఉంది అని విశాఖ డీసీపీ గౌతమీ శాలి అన్నారు. రూరల్ ఏరియాల్లో భారీగా గంజాయి పట్టుబడుతుంది. నగర పరిధిలో హోటల్స్, లాడ్జిల్లో, వాహన తనిఖీ లు ముమ్మరం చేస్తున్నాం. రెండు వారల్లో 310 బైండొవర్ కేసులు నమోదు చేసాము. ఆపరేషన్ పరివర్తన లో భాగంగా మార్పు కార్యక్రమం ద్వారా గంజాయికి బానిస అయిన వారికి ప్రత్యేక కౌన్సిలింగ్ ఇస్తున్నాము. సిటీ పరిధిలో 4 టన్నుల గంజాయి, కొన్ని లీటర్ల లిక్విడ్ గంజాయి కూడా పట్టు బడింది అన్నారు.
ఇక జాయింట్ డైరెక్టర్ సతీష్ కుమార్ మాట్లాడుతూ… ఏజెన్సీ లో వందల ఎకరాల్లో గంజాయి తోటలను ధ్వంసం చేసాము. విశాఖ ఏజెన్సీ నుండి ఇతర రాష్ట్రాలకు భారీగా గంజాయి రవాణా అవుతుంది. ఈ మధ్య కాలంలో యాసిష్ ఆయిల్ కూడా ఎక్కువగా పట్టుబడుతుంది. రూరల్ ప్రాంతంలో 185 లీటర్ల లిక్విడ్ గంజాయి పట్టుబడింది అని పేర్కొన్నారు.