Promotions: కేంద్ర ప్రభుత్వం కీలక ఉత్తర్వులు.. ఏపీకి చెందిన ఆ ఐదుగురికి IASలుగా పదోన్నతులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆంధ్రప్రదేశ్కు చెందిన ఐదుగురు నాన్-స్టేట్ సివిల్ సర్వీస్ (Non-SCS) అధికారులకు ఐఏఎస్లు (IAS)గా పదోన్నతి లభించింది. 2024 సెలెక్ట్ లిస్ట్ ఆధారంగా వీరికి ఐఏఎస్ హోదా కల్పిస్తూ కేంద్ర సిబ్బంది, శిక్షణ శాఖ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ అధికారులందరినీ ఆంధ్రప్రదేశ్ కేడర్కు కేటాయిస్తూ కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఐఏఎస్లుగా ఎంపికైన అధికారులు వీరే..
ప్రభుత్వం విడుదల చేసిన జాబితా ప్రకారం.. ప్రభల గోపినాథ్, గుడిశ బాలకృష్ణ, ఎం. జయకృష్ణ, ఏ.ఏ.ఎల్. పద్మావతి, మరియు డాక్టర్ మామిళ్లపల్లి వరప్రసాద్లు ఐఏఎస్ అధికారులుగా పదోన్నతి పొందారు. వీరంతా వివిధ ప్రభుత్వ శాఖలలో సుదీర్ఘ కాలం పాటు నాన్-స్టేట్ సివిల్ సర్వీస్ అధికారుల విభాగంలో విశేష సేవలు అందించారు. వారి పనితీరు, సీనియారిటీ ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం పంపిన సిఫార్సులను పరిశీలించిన కేంద్ర నియామకాల కమిటీ, తుది జాబితాను ఖరారు చేసింది.
Also Read
- TDP Governor Quota MLC Race: రెండు ఎమ్మెల్సీ స్థానాలు.. 20 మందికిపైగా ఆశావహులు.. టీడీపీలో ఆసక్తికర సమీకరణాలు
- Nitin Gadkari: E20పై తప్పుడు ప్రచారం.. మెటా, ఎక్స్, గూగుల్పై నితిన్ గడ్కరీ పరువునష్టం దావా.!
- Energy Crisis: భారత్లో మరోసారి ఇంధన సంక్షోభం రానుందా? నిపుణుల ఆందోళన ఎందుకు?
- Mrunal Thakur and Yashasvi Jaiswal: మృణాల్ ఠాకూర్–యశస్వి జైస్వాల్ డేటింగ్..! వైరల్ వీడియోతో మొదలైన కొత్త చర్చ..
పాలనలో మరింత వేగం..
రాష్ట్రంలో ఐఏఎస్ అధికారుల కొరతను అధిగమించడానికి , పరిపాలనను మరింత బలోపేతం చేయడానికి ఈ పదోన్నతులు ఎంతగానో దోహదపడతాయని సచివాలయ వర్గాలు పేర్కొన్నాయి. వివిధ శాఖల్లో క్షేత్రస్థాయిలో అపారమైన అనుభవం ఉన్న ఈ నాన్-స్టేట్ సివిల్ సర్వీస్ అధికారులు ఐఏఎస్లుగా బాధ్యతలు చేపట్టడం వల్ల ప్రభుత్వ పథకాల అమలు, ప్రజలకు సేవలందిచడంలో మరింత పారదర్శకత, వేగం పెరుగుతుందని భావిస్తున్నారు. త్వరలోనే వీరికి రాష్ట్ర ప్రభుత్వం నూతన పోస్టింగులను కేటాయించనుంది. పదోన్నతి పొందిన అధికారులకు పలువురు సహచర అధికారులు, ప్రజాప్రతినిధులు అభినందనలు తెలిపారు.
తాజావార్తలు
-
Ajay Bhupathi: ‘శ్రీనివాస మంగాపురం’లో ఆ పవర్ఫుల్ పాత్ర కోసం మొదటి నుంచి ఆయనే అనుకున్నా..
-
TDP Governor Quota MLC Race: రెండు ఎమ్మెల్సీ స్థానాలు.. 20 మందికిపైగా ఆశావహులు.. టీడీపీలో ఆసక్తికర సమీకరణాలు
-
Nitin Gadkari: E20పై తప్పుడు ప్రచారం.. మెటా, ఎక్స్, గూగుల్పై నితిన్ గడ్కరీ పరువునష్టం దావా.!
-
Rain Alert : హైదరాబాద్ వాసులకు అలర్ట్.. 3 గంటల్లో వర్షం, 40 కిమీ వేగంతో ఈదురుగాలులు.!
-
Energy Crisis: భారత్లో మరోసారి ఇంధన సంక్షోభం రానుందా? నిపుణుల ఆందోళన ఎందుకు?
ట్రెండింగ్
-
2027 World Cup: ఓపెనర్లుగా రోహిత్ శర్మ, వైభవ్ సూర్యవంశీ.. నాలుగో స్థానంలో శుభ్మన్ గిల్!
-
రూ.1,449కే 700GB డేటా, అన్లిమిటెడ్ కాలింగ్.. BSNL బ్రాడ్బ్యాండ్ ప్లాన్ అదిరిపోయింది..!
-
15 నెలల వ్యాలిడిటీతో Jio ‘Freedom Pack’.. 1000+ టీవీ ఛానళ్లు, 12 OTTలు ఫ్రీ.!
-
Samsung Galaxy Z Fold 8 Ultra vs Galaxy Z Fold 7: ఏ ఫోల్డబుల్ ఫోన్ బెస్ట్.?
-
Vaibhav Sooryavanshi: నా కల నిజమైంది.. ఇక మరింత రెచ్చిపోతా.. వైభవ్ సూర్యవంశీ ఆసక్తికర వ్యాఖ్యలు!