Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం.. శ్రీవారి దర్శానికి 8గంటల సమయం..
- తిరుమల: 25 కంపార్టుమెంట్లలో వేచివున్న భక్తులు..
- టోకేన్ లేని భక్తుల సర్వదర్శనానికి 8 గంటల సమయం..
- శ్రీవారి హుండీ ఆదాయం రూ. 3.68 కోట్లు..
Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా కొనసాగుతుంది. ఈరోజు ఆదివారం అయినా భక్తుల రద్దీ పెద్దగా లేకపోవడంతో స్వామి వారిని ఈజీగా దర్శించుకుంటున్నారు. అతి తక్కువ టైంలో తిరుమల శ్రీవారి సేవలో పాల్గొని తమ మొక్కులను చెల్లించుకుంటున్నారు. ప్రస్తుతం ఏడు కొండల మీద భక్తుల రద్దీ సాధారణ స్థితికి చేరుకుందని టీటీడీ అధికారులు చెప్తున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఆదివారం కూడా భక్తుల సంఖ్య స్వల్పంగా ఉండటం ఇదే తొలిసారి అని వెల్లడించారు.
Read Also: Hydra: అమీన్ పూర్, కూకట్పల్లిలో హైడ్రా కూల్చివేతలు..
Also Read
- Weather Updates in Regional Languages: రైతులకు గుడ్న్యూస్.. ఇక ప్రాంతీయ భాషల్లోనే వాతావరణ సమాచారం..
- Nandamuri Balakrishna: అమరావతిలో బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి పనులు ప్రారంభం.. బాలయ్య ఆసక్తికర వ్యాఖ్యలు..
- AP Student Suicide in US: అమెరికాలో కర్నూలు యువకుడు ఆత్మహత్య.. పిస్టల్తో కాల్చుకుని..
- TTD Laddu Report: తిరుమల లడ్డూ వ్యవహారంపై ప్రభుత్వానికి నివేదిక.. కీలక అంశాలు వెలుగులోకి తెచ్చిన ఏక సభ్య కమిటీ..
ఈరోజు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని 25 కంపార్ట్మెంట్లలోనే భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. సర్వ దర్శనం కోసం క్యూ లైన్ లోకి ఉదయం ఏడు గంటలకు టోకెన్లు లేకుండా ప్రవేశించిన భక్తులకు శ్రీవారి దర్శనానికి కేవలం 8 గంటల సమయం మాత్రమే పడుతుంది. నిన్నటి(శనివారం) వరకూ శ్రీనివాసుడి దర్శనానికి ఇరవై నాలుగు గంటల సమయం పట్టేది. టైమ్ స్లాట్ దర్శనం భక్తులకు మూడు గంటల్లో స్వామివారి దర్శనం పూర్తైతుంది. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లు కొనుగోలు చేసిన భక్తులకు రెండు నుంచి మూడు గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు పేర్కొన్నారు. ఇక, నిన్న తిరుమల శ్రీవారిని 82 వేల 406 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 31 వేల 151 మంది భక్తులు తమ తలనీలాలను సమర్పించుకుని మొక్కులు చెల్లించారు. అలాగే, తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3.68 కోట్ల రూపాయల వచ్చిందని టీటీడీ అధికారులు వెల్లడించారు.
తాజావార్తలు
-
Weather Updates in Regional Languages: రైతులకు గుడ్న్యూస్.. ఇక ప్రాంతీయ భాషల్లోనే వాతావరణ సమాచారం..
-
NTRNEEL : డ్రాగన్ పార్ట్ – 2 కోసం ఎన్టీఆర్ షాకింగ్ మేకోవర్
-
Nandamuri Balakrishna: అమరావతిలో బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి పనులు ప్రారంభం.. బాలయ్య ఆసక్తికర వ్యాఖ్యలు..
-
DGP C.V. Anand: కొత్త డీజీపీగా సీవీ ఆనంద్ తొలి ప్రెస్మీట్.. పోలీస్ శాఖలో 19 వేల ఖాళీలు.. రిక్రూట్మెంట్పై కీలక ప్రకటన
-
M. K. Stalin: “కష్టపడ్డాం.. ఫలితం దక్కుతుంది”.. ఎగ్జిట్ పోల్స్పై సీఎం స్టాలిన్ ఫస్ట్ రియాక్షన్ ఇదే..
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!