CM YS Jagan Serious Warning: ఆ మంత్రులు, ఎమ్మెల్యేలపై వైఎస్ జగన్ సీరియస్.. డెడ్ లైన్ పెట్టేశారు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM YS Jagan Serious Warning: 30 మంది వైసీపీ ఎమ్మెల్యేలపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి మళ్లీ సీరియస్ అయ్యారు. జూన్ 30లోపు పనితీరు మార్చుకోవాలని డెడ్ లైన్ విధించారు. లేదంటే ఆ నియోజకవర్గాల్లో కొత్త ఇంఛార్జ్ లను నియమించాల్సి వస్తుందంటూ సంబంధిత ఎమ్మెల్యేలకు వార్నింగ్ ఇచ్చారు.. వైసీపీ విస్తృత స్థాయి సమావేశంలో గడప గడపకు కార్యక్రమంపై సోమవారం రోజు సీఎం వైఎస్ జగన్ సమీక్ష చేశారు. ఏ ఎమ్మెల్యే ఎన్నిరోజులు, ఎన్నిగంటలు పాల్గొన్నారనే లెక్కలనూ విశ్లేషించారు. టాప్-1లో కైకలూరు ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు ఉన్నారు. అతి తక్కువగా కార్యక్రమం చేపట్టిన వారి జాబితాలో కొడాలి నాని, మంత్రి బుగ్గన, వసంత కృష్ణా ప్రసాద్ , సామినేని ఉదయ భానులు ఉన్నారు.
Read Also: Marriage: పెళ్లికోసం ఆస్పత్రి గదిని బుక్ చేశారు.. ఎందుకంటే?
Also Read
- Thalliki Vandanam: భారీ శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. వారికి కూడా ‘తల్లికి వందనం’ వర్తింపు..
- Chittoor Horror: అసలు తల్లివేనా..? వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ఏడేళ్ల కుమారుడికి చిత్రహింసలు..!
- Nadendla Manohar: స్థానిక ఎన్నికల్లో కొత్త వ్యూహం.. మంత్రి నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు..
- OTR: పోలవరం క్రెడిట్ రేస్లోకి ఏపీ బీజేపీ.? ముఖ్య నేతలంతా ర్యాలీగా ప్రాజెక్ట్ సైట్కు.!
దువ్వాడ శ్రీనివాస్ చేపట్టిన గడప గడపకు కార్యక్రమంపై సీఎం జగన్ ఆసక్తికర విశ్లేషణ చేశారు. ఒక సచివాలయాన్ని కవర్ చేయడానికి దువ్వాడ ఎనిమిది రోజులు తీసుకుంటున్నారన్నారు. ప్రతి గడపను టచ్ చేయమన్నానని.. మరీ అంత స్లోగా చేస్తే ఎలా అంటూ జగన్ చురకలంటించారు. నాలుగు రోజుల్లో సచివాలయంలో పరిధిలో గడప గడపకు కంప్లీట్ చేసేలా చూసుకోవాలని దువ్వాడకు సూచించారు. ఇక ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థులను సీఎం జగన్ పరిచయం చేశారు. వారి గెలుపు కోసం పనిచేయాలని వైసీపీ ఎమ్మెల్యేలకు పిలుపునిచ్చారు. ఎమ్మెల్యేల పనితీరుపై గత సమీక్షలోనూ జగన్ సీరియస్ అయ్యారు. లెక్కలేసి మరీ పనితీరు మార్చుకోవాలని సూచించారు. ఈసారి సమీక్షలోనూ జగన్ 30 మంది ఎమ్మెల్యేలకు వార్నింగ్ ఇచ్చారు. జూన్ 30 లోపు పనితీరు మార్చుకోవాలని ,లేదంటే కొత్త ఇంచార్జ్ ల్ని పెట్టాల్సి వస్తుందని హెచ్చరించడం ఆసక్తికరంగా మారింది.. కాగా, గతంలోనూ కొంతమంది మంత్రులు, ఎమ్మెల్యేలకు సీఎం జగన్ వార్నింగ్ ఇచ్చారు.. పనితీరు మెరుగుపర్చుకోవాలని సూచించారు.. అయినా.. ఇప్పటికీ కొందరిలో ఎంటా మార్పు రావడం లేదని ఆయన అసహనం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది.
తాజావార్తలు
-
Cleaning Tips: మీ గ్యాస్ బర్నర్లు నల్లబడ్డాయా..? ఈ ఒక్క పని చేస్తే మిలమిల మెరిసిపోవాల్సిందే..
-
Telangana Cabinet: గ్రామ పంచాయతీలకు గుడ్న్యూస్.. తెలంగాణ క్యాబినెట్ కీలక నిర్ణయాలు..
-
Ration Cardholders: రేషన్ కార్డుదారులకు బిగ్ అలర్ట్.. ఈ నెల 31 వరకే అవకాశం..
-
Trump: ట్రంప్ టెలిప్రాంప్టర్ ఆపరేటర్కు భారీ షాక్.. ఎంత పని చేశాడంటే..!
-
Telangana Housing: పట్టణ పేదలకు శుభవార్త.. ‘ఇందిరమ్మ పట్టణ గృహ నిర్మాణ’ పథకానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్!
ట్రెండింగ్
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?