YS Jagan: మరో ఏడాదిన్నరలో ఎన్నికలు.. ఈ రోజు నుంచే సిద్ధం కావాలి…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మనం మరో ఏడాదిన్నరలో మళ్లీ ఎన్నికలకు వెళ్తున్నాం.. ఈ రోజు నుంచే ఎన్నికలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి.. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గ కార్యకర్తలతో ప్రత్యేకంగా భేటీ అయిన ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఆలూరు నుంచి వచ్చిన కార్యకర్తలను కలుసుకోవడం సంతోషంగా ఉందన్నారు.. నియోజకవర్గంలోని ముఖ్యమైన కార్యకర్తలను కలుసుకోవాలన్నదే ఈ కార్యక్రమం ఉద్దేశమన్న ఆయన.. గడప గడపకూ కార్యక్రమాన్ని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో చేపడుతున్నాం.. ఎమ్మెల్యేలు సంబంధిత నియోజకవర్గాల్లో తిరుగుతున్నారు.. గ్రామంలో ప్రతి ఇంటికీ వెళ్తున్నారు.. ఈ మూడేళ్ల కాలంలో మనం చేసిన మంచి కార్యక్రమాలను ప్రతి ఇంటికీ తీసుకెళ్తున్నాం.. ఆ కుటుంబానికి జరిగిన మేలును వివరిస్తున్నాం.. ఆ మేలు జరిగిందా? లేదా? అనే విచారణ చేస్తున్నాం.. వారి ఆశీస్సులు తీసుకుంటున్నాం అన్నారు.
Also Read
- Gudivada Amarnath: హోంమంత్రి అనితపై మాజీ మంత్రి ఘాటు విమర్శలు.. ఆమె 'మేకప్ మంత్రి'..!
- Sajjala Ramakrishna Reddy: రెండేళ్ల పాలనపై ప్రజల ఆగ్రహం బయటపడింది.. చంద్రబాబుకు ఇదే లాస్ట్ టర్మ్..!
- Minister Vasamsetti Subhash: కార్మికుల కోసం సర్కార్ కీలక నిర్ణయం.. అంతా ఒకే దగ్గర..!
- Kesineni Nani vs Kesineni Chinni: కేశినేని బ్రదర్స్ మధ్య మళ్లీ ముదిరిన వార్.. ఎంపీ చిన్నిపై ఈడీకి నాని ఫిర్యాదు
ఇక, ఎక్కడైనా పొరపాట్లు జరిగిఉంటే.. వాటిని రిపేరు చేస్తున్నాం అన్నారు సీఎం వైఎస్ జగన్.. ప్రభుత్వంలో ఉన్న మనం అంతా.. గ్రామ స్థాయిల్లో కూడా వివిధ బాధ్యతలను నిర్వహిస్తున్నాం.. అంతా కలిసికట్టుగా ఒక్కటి కావాలి.. అప్పుడే మంచి విజయాలు నమోదు చేస్తాం అని సూచించారు. అలాగే ప్రతి సచివాలయానికీ రూ.20 లక్షల రూపాయలు ప్రాధాన్యతా పనుల కోసం కేటాయిస్తున్నాం.. ఫలానా పని చేయడం వల్ల ప్రజలకు మేలు అనుకుంటే.. అది చేయాలి.. అత్యంత ప్రాధాన్యమైన పనులను ఈ నిధులు ద్వారా చేపడతామన్నారు.. గ్రామంలో 2 రోజుల పాటు కచ్చితంగా ఎమ్మెల్యే గడప గడపకూ కార్యక్రమం చేపడుతున్నారు.. కనీసం రోజూ 8 గంటల పాటు సమయం గడుపుతున్నారని తెలిపారు. సీఎంగా నేను ప్రతి కార్యకర్తకూ అందుబాటులో ఉండలేకపోవచ్చు.. అది సాధ్యం కాదు కూడా అన్నారు వైఎస్ జగన్.. కాకపోతే ప్రతి ఎమ్మెల్యే కార్యకర్తలకు అందుబాటులో ఉండాలి.. ప్రతి గ్రామంలో రెండు రోజుల పాటు తిరగాలి.. రోజుకు 8 గంటలు గడపాలి.. సాధకబాధకాలు తెలుసుకుని.. వాటిని పరిష్కరించే ప్రయత్నం ఈ కార్యక్రమం ద్వారా సాగుతుందన్నారు. దేవుడి దయవల్ల గడప గడపకూ కార్యక్రమాలు బాగా జరుగుతున్నాయన్న సీఎం.. వీలైనప్పుడు ప్రతి నియోజకవర్గం నుంచి కార్యకర్తలను కలుస్తున్నాం.. ఒక్క ఆలూరు నియోజకవర్గానికే వివిధ పథకాల ద్వారా ఈ మూడు ఏళ్ల కాలంలో రూ.1050 కోట్లు నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో వేయడం జరిగిందని వెల్లడించారు.
తాజావార్తలు
-
Aashirwad Sooryavanshi: మరో సూర్యవంశీ వస్తున్నాడండోయ్.. తొలి శతకాన్ని నమోదు చేసిన ఆశీర్వాద్..
-
Blood Donate: రక్తదానం చేస్తే శరీరం బలహీనపడుతుందా..? డాక్టర్లు చెబుతున్న అసలు నిజం ఇదే..
-
APL 2026లో భోణీ కొట్టిన విజయవాడ సన్షైనర్స్.. కాకినాడ పై సూపర్ విక్టరీ
-
Cooking Hacks: ఇల్లాళ్లకు స్మార్ట్ హెల్ప్.. ఈ వంటింటి చిట్కాలు తెలిస్తే మీ పనులు నిమిషాల్లో అయిపోతాయి!
-
IND vs AFG ODI: టీమిండియాకు బిగ్ షాక్.. సిరీస్ మొత్తానికి స్టార్ ఆటగాళ్లు దూరం..
ట్రెండింగ్
-
Sachin Tendulkar: “ఎత్తు ఎంతైనా సరే.. ఆటిట్యూడ్ మారకూడదు.!” ఆకాశంలోనూ క్రికెట్ ఆడిన సచిన్.!
-
Indian Railways: రైలు ఆలస్యమైనా ప్రయాణికుడి తప్పేనా..? ప్లాట్ఫామ్ టికెట్ సమయం ముగిసిందంటూ రూ.520 జరిమానా.! వీడియో వైరల్..
-
Mahabharata Lessons: కురుక్షేత్రం vs ఆధునిక వార్స్.. యుద్ధం కంటే ధర్మమే గొప్పది.. మహాభారతం నేర్పిన సత్యం ఇదే!
-
iQOO Flagship Days Sale ప్రారంభం.. iQOO 15, iQOO 15R, Neo 10పై భారీ తగ్గింపులు.!
-
Bangladesh History: ఆస్ట్రేలియాపై చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్.. క్రికెట్ చరిత్రలోనే మొదటిసారి!